జూనియర్ పంచాయతీ కార్యదర్శి ప్రవేశ పరీక్ష రాసి, ఎంపిక కాలేకపోయిన వారిని.. ఖాళీగా ఉన్న స్థానాల్లో అర్హత ఆధారంగా తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ హిమాయత్నగర్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట రెండోరోజు కూడా ఆందోళన కొనసాగించారు. 2018 డిసెంబర్ 10న జరిగిన ఇంటర్వూలకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచినా.. ప్రతి జిల్లాలో 20 నుంచి 30 మంది కూడా హాజరు కాలేదని తెలిపారు. ఎంపికైన వారిలో కొంత మంది వేరే ఉద్యోగాలు సాధించారని.. ఆ ఖాళీలను కొద్ది తేడాతో అవకాశం కోల్పోయిన తమకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: 'భద్రత విషయంలో చింతించాల్సిన పనిలేదు'