సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. శుక్రవారం ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. జిల్లా సార్మేడి మెస్రం దుర్గు, ఆడె హన్మంత్రావు మాట్లాడుతూ.. పేద ఆదివాసీలకు ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ఆదివాసీల చట్టాలను సంరక్షించడంలో పెసా కమిటీ ఛైర్మన్ విఫలమయ్యారని విమర్శించారు.
సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా హామీ ఇచ్చారు. ఆయన వెంట డీఎస్పీ ఉదయ్రెడ్డి ఉన్నారు. ఆదివాసీ నాయకులు శంకర్, పుష్పరాణి, జుగాదిరావు, ఆనంద్రావు పాల్గొన్నారు.