ETV Bharat / business

ఇన్వెస్టర్లకు గుడ్​ న్యూస్​ - మ్యూచువల్​ ఫండ్స్​, డీమ్యాట్​ ఖాతాల నామినేషన్ గడువు పెంపు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 6:58 PM IST

SEBI Extends Deadline To Add Nominees In Mutual Funds And Demat Accounts In Telugu : డీమ్యాట్​ ఖాతాదారులకు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్​. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) మ్యూచ్​వల్​ ఫండ్స్​, డీమ్యాట్ ఖాతాలను నామినీని ఏర్పాటు చేసుకునే గడువును మరోసారి పొడిగించింది. అంటే 2023 డిసెంబర్​ 31తో ముగియాల్సిన గడువును 2024 జూన్​ 30 వరకు పొడిగించింది.

mutual funds nominee rules
Trading account nominee rules

SEBI Extends Deadline To Add Nominees In Mutual Funds And Demat Accounts : మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) మ్యూచువల్ ఫండ్స్​, డీమ్యాట్​ ఖాతాదారులకు గుడ్ న్యూస్​ చెప్పింది. మ్యూచువల్ ఫండ్స్​, డీమ్యాట్ ఖాతాలను నామినీని ఏర్పాటుచేసేందుకు ఇచ్చిన గడువును 2023 డిసెంబర్​ 31 నుంచి 2024 జూన్​ 30 వరకు పొడిగించింది.

పెట్టుబడిదారులు తమ ఆస్తులను భద్రపరుచుకోవడానికి, చట్టపరమైన వారసులకు వాటిని బదిలీ చేయడానికి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.

"మార్కెట్ వర్గాల నుంచి, పెట్టుబడిదారుల నుంచి అనేక విజ్ఞప్తులు, అభ్యర్థనలు వచ్చాయి. అందుకే వారి సౌలభ్యం కోసం, డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ పోర్టుఫోలియోలకు నామినేషన్​ సమర్పించేందుకు ఇచ్చిన గడువును 2024 జూన్ 30 వరకు పొడిగించాలని నిర్ణయణం తీసుకున్నాం."
- సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్​ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) సర్క్యులర్​

ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలి!
అసెట్ మేనేజ్​మెంట్ కంపెనీలు (AMCs), డిపాజిటరీ పార్టిసిపెంట్​లు, రిజిస్ట్రార్​ అండ్​ ట్రాన్స్​ఫర్​ ఏజెంట్లు (RTA)లు - డీమ్యాట్​ ఖాతాదారులకు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు అవేర్​నెస్ కల్పించాలని సెబీ నిర్దేశించింది. ఇన్వెస్టర్లు కచ్చితంగా తమ డీమ్యాట్​ ఖాతాలకు, మ్యూచువల్​ ఫండ్లకు నామినీలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం పెట్టుబడిదారులకు ఈ-మెయిల్స్, SMSలు పంపించాలని తెలిపింది. నామినీని ఏర్పాటు చేయడమే కాదు. ఇప్పటి వరకు ఉన్న నామినీలను తొలగించడానికి, నామినీలను మార్చడానికి తగిన సూచనలు చేసి, అందుకోసం పూర్తి సహకారం అందించాలని స్పష్టం చేసింది.

ఎస్​బీఐ 'అమృత్​ కలశ్'​ స్కీమ్​ గడువు పెంపు!
మనదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అమృత్ కలశ్ పథకం గడువును మరోసారి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పథకం గడువును ఆగస్టు 15 నుంచి డిసెంబర్​ 31 వరకు పొడిగించింది. అయితే తాజాగా ఈ గడువును 2024 మార్చి 31 వరకు పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది.

అమృత్​ కలశ్ స్కీమ్ బెనిఫిట్స్​
Amrith Kalash Scheme Interest Rates : ఎస్​బీఐ 2023 ఫిబ్రవరి 15న అమృత్ కలశ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఒక ప్రత్యేకమైన ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్​. దీని కాలపరిమితి 400 రోజులు మాత్రమే. ఎస్​బీఐ ఈ స్కీమ్​ ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ పౌరులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు ఏకంగా 7.60 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లు ఈ అమృత్​ కలశ్​ పథకం ద్వారా అధిక లబ్ధి పొందుతారు.

సెకండ్​ హ్యాండ్​ కారు కొనాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

మీ ఆదాయపన్ను మరింత తగ్గించుకోవాలా? - ఇలా ట్యాక్స్ చెల్లిస్తే భారీ మినహాయింపు మీ సొంతం!

SEBI Extends Deadline To Add Nominees In Mutual Funds And Demat Accounts : మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) మ్యూచువల్ ఫండ్స్​, డీమ్యాట్​ ఖాతాదారులకు గుడ్ న్యూస్​ చెప్పింది. మ్యూచువల్ ఫండ్స్​, డీమ్యాట్ ఖాతాలను నామినీని ఏర్పాటుచేసేందుకు ఇచ్చిన గడువును 2023 డిసెంబర్​ 31 నుంచి 2024 జూన్​ 30 వరకు పొడిగించింది.

పెట్టుబడిదారులు తమ ఆస్తులను భద్రపరుచుకోవడానికి, చట్టపరమైన వారసులకు వాటిని బదిలీ చేయడానికి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.

"మార్కెట్ వర్గాల నుంచి, పెట్టుబడిదారుల నుంచి అనేక విజ్ఞప్తులు, అభ్యర్థనలు వచ్చాయి. అందుకే వారి సౌలభ్యం కోసం, డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ పోర్టుఫోలియోలకు నామినేషన్​ సమర్పించేందుకు ఇచ్చిన గడువును 2024 జూన్ 30 వరకు పొడిగించాలని నిర్ణయణం తీసుకున్నాం."
- సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్​ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) సర్క్యులర్​

ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలి!
అసెట్ మేనేజ్​మెంట్ కంపెనీలు (AMCs), డిపాజిటరీ పార్టిసిపెంట్​లు, రిజిస్ట్రార్​ అండ్​ ట్రాన్స్​ఫర్​ ఏజెంట్లు (RTA)లు - డీమ్యాట్​ ఖాతాదారులకు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు అవేర్​నెస్ కల్పించాలని సెబీ నిర్దేశించింది. ఇన్వెస్టర్లు కచ్చితంగా తమ డీమ్యాట్​ ఖాతాలకు, మ్యూచువల్​ ఫండ్లకు నామినీలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం పెట్టుబడిదారులకు ఈ-మెయిల్స్, SMSలు పంపించాలని తెలిపింది. నామినీని ఏర్పాటు చేయడమే కాదు. ఇప్పటి వరకు ఉన్న నామినీలను తొలగించడానికి, నామినీలను మార్చడానికి తగిన సూచనలు చేసి, అందుకోసం పూర్తి సహకారం అందించాలని స్పష్టం చేసింది.

ఎస్​బీఐ 'అమృత్​ కలశ్'​ స్కీమ్​ గడువు పెంపు!
మనదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అమృత్ కలశ్ పథకం గడువును మరోసారి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పథకం గడువును ఆగస్టు 15 నుంచి డిసెంబర్​ 31 వరకు పొడిగించింది. అయితే తాజాగా ఈ గడువును 2024 మార్చి 31 వరకు పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది.

అమృత్​ కలశ్ స్కీమ్ బెనిఫిట్స్​
Amrith Kalash Scheme Interest Rates : ఎస్​బీఐ 2023 ఫిబ్రవరి 15న అమృత్ కలశ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఒక ప్రత్యేకమైన ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్​. దీని కాలపరిమితి 400 రోజులు మాత్రమే. ఎస్​బీఐ ఈ స్కీమ్​ ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ పౌరులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు ఏకంగా 7.60 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లు ఈ అమృత్​ కలశ్​ పథకం ద్వారా అధిక లబ్ధి పొందుతారు.

సెకండ్​ హ్యాండ్​ కారు కొనాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

మీ ఆదాయపన్ను మరింత తగ్గించుకోవాలా? - ఇలా ట్యాక్స్ చెల్లిస్తే భారీ మినహాయింపు మీ సొంతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.