ETV Bharat / business

ఏడాదిలో రూ.6 లక్షల ఇడ్లీలు ఆర్డర్ చేసిన 'హైదరాబాదీ'.. రోజుకు 23 ప్లేట్లు!

author img

By

Published : Mar 30, 2023, 9:00 PM IST

ఆన్‌లైన్‌లో వివిధ రకాల పుడ్స్​ ఆర్డర్​ చేస్తూ ఉంటారు. అయితే హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి మాత్రం.. రికార్డ్​ స్థాయిలో ఇడ్లీలను ఆర్డర్​ చేశాడు. ఏడాదిలో 8వేలకు పైగా ప్లేట్ల ఇడ్లీలను స్విగ్గీ ద్వారా తెప్పించుకున్నాడు. అందుకు ఆరు లక్షలు రూపాయలను ఖర్చు చేశాడు.

man-ordered-6-lakh-rupees-worth-idli-in-year-said-swiggy-annual-report-2023
వామ్మో.. రూ.6 లక్షల ఇడ్లీలను స్విగ్గీలో ఆర్డర్​ చేసిన వ్యక్తి

ఇడ్లీని ఇష్టపడని వారెవరుంటారు! చాలా మంది ఇడ్లీని లొట్టలేసుకుంటూ తింటారు. దక్షిణ భారతదేశంలో ఇడ్లీకి క్రేజ్​ మాములుగా ఉండదు!. ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదనే కారణంతో చాలా మంది దీన్ని అమితంగా తింటారు. రుచి కూడా బాగుండటం వల్ల పాపులర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ల్లో.. ఇడ్లీ కూడా ఒకటిగా నిలిచింది. అయితే హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి ఒక సంవత్సర కాలంలో ఎన్ని ఇడ్లీలు ఆర్డర్​ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏడాదిలో ఆరు లక్షల విలువ చేసే ఇడ్లీలు ఆర్డర్​ చేశాడు. ఎనిమిది వేల పైగా పేట్లకు స్విగ్గీ ద్వారా తెప్పించుకున్నాడు. గురువారం ప్రపంచ ఇడ్లీ దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ అయిన స్విగ్గీ.. ఈ వంటకంపై తన వార్షిక నివేదికను విడుదల చేసింది.

2022 మార్చి 30 నుంచి 2023 మార్చి 25 మధ్య కాలంలో వినియోగదారులు ఇచ్చిన ఇడ్లీ ఆర్డర్లపై.. స్విగ్గీ ఓ అధ్యయనం చేసింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను సైతం తయారుచేసింది. ఈ పన్నెండు నెలల కాలంలో స్విగ్గీ 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేసిందని అందులో పేర్కొంది. అత్యధికంగా బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాల నుంచి ఇడ్లీ ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత కోల్‌కతా, కోచి, ముంబయి, కొయంబత్తూర్‌, పుణె నుంచి కూడా వినియోగదారులు అత్యధికంగా ఇడ్లీలను ఆర్డర్లు చేసినట్లు పేర్కొంది.

ఇక హైదరాబాద్‌కు చెందిన ఓ కస్టమర్ విషయానికి వస్తే.. సంవత్సర కాలంలో అతడు రూ.6 లక్షల విలువ చేసే ఇడ్లీలను తమ వేదికపై ఆర్డర్‌ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. ఆ వినియోగదారుడు మొత్తం 8,428 ప్లేట్ల ఇడ్లీలను స్విగ్గీలో కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌ మాత్రమే గాక.. బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ఆ వ్యక్తి ఇడ్లీలను ఆర్డర్‌ చేసినట్లు తెలిపింది. అంటే సరాసరి రోజుకు 23 ప్లేట్లు! ఇక ఎక్కువ మంది మసాలా దోశను స్విగ్గీలో కొనుగోలు చేసినట్లు కంపెనీ తన నివేదికలో వెల్లడించింది.

మన దేశంలో బిర్యానీకి సైతం మంచి డిమాండ్​ ఉంది. 2023 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేసినట్లు గతంలో స్విగ్గీ తెలిపింది. అదే సమయంలో 2.5 లక్షల పిజ్జాలను సైతం కస్టమర్లకు అందించినట్లు వెల్లడించింది. అందులో హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ల శాతం-75.4 శాతం ఉన్నట్లు తెలిపింది. లఖ్​నవీ బిర్యానీ ఆర్డర్ల శాతం-14.2 శాతంగా ఉందని పేర్కొంది. కోల్‌కతా బిర్యానీ ఆర్డర్ల శాతం-10.4 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్​లో ఎక్కువ మంది బావర్చీ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్​ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. బావర్చీ నుంచి నిమిషానికి రెండు బిర్యానీలు డెలివరీ అందించినట్లు సంస్థ పేర్కొంది.

ఇడ్లీని ఇష్టపడని వారెవరుంటారు! చాలా మంది ఇడ్లీని లొట్టలేసుకుంటూ తింటారు. దక్షిణ భారతదేశంలో ఇడ్లీకి క్రేజ్​ మాములుగా ఉండదు!. ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదనే కారణంతో చాలా మంది దీన్ని అమితంగా తింటారు. రుచి కూడా బాగుండటం వల్ల పాపులర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ల్లో.. ఇడ్లీ కూడా ఒకటిగా నిలిచింది. అయితే హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి ఒక సంవత్సర కాలంలో ఎన్ని ఇడ్లీలు ఆర్డర్​ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏడాదిలో ఆరు లక్షల విలువ చేసే ఇడ్లీలు ఆర్డర్​ చేశాడు. ఎనిమిది వేల పైగా పేట్లకు స్విగ్గీ ద్వారా తెప్పించుకున్నాడు. గురువారం ప్రపంచ ఇడ్లీ దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ అయిన స్విగ్గీ.. ఈ వంటకంపై తన వార్షిక నివేదికను విడుదల చేసింది.

2022 మార్చి 30 నుంచి 2023 మార్చి 25 మధ్య కాలంలో వినియోగదారులు ఇచ్చిన ఇడ్లీ ఆర్డర్లపై.. స్విగ్గీ ఓ అధ్యయనం చేసింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను సైతం తయారుచేసింది. ఈ పన్నెండు నెలల కాలంలో స్విగ్గీ 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేసిందని అందులో పేర్కొంది. అత్యధికంగా బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాల నుంచి ఇడ్లీ ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత కోల్‌కతా, కోచి, ముంబయి, కొయంబత్తూర్‌, పుణె నుంచి కూడా వినియోగదారులు అత్యధికంగా ఇడ్లీలను ఆర్డర్లు చేసినట్లు పేర్కొంది.

ఇక హైదరాబాద్‌కు చెందిన ఓ కస్టమర్ విషయానికి వస్తే.. సంవత్సర కాలంలో అతడు రూ.6 లక్షల విలువ చేసే ఇడ్లీలను తమ వేదికపై ఆర్డర్‌ చేసినట్లు స్విగ్గీ పేర్కొంది. ఆ వినియోగదారుడు మొత్తం 8,428 ప్లేట్ల ఇడ్లీలను స్విగ్గీలో కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌ మాత్రమే గాక.. బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ఆ వ్యక్తి ఇడ్లీలను ఆర్డర్‌ చేసినట్లు తెలిపింది. అంటే సరాసరి రోజుకు 23 ప్లేట్లు! ఇక ఎక్కువ మంది మసాలా దోశను స్విగ్గీలో కొనుగోలు చేసినట్లు కంపెనీ తన నివేదికలో వెల్లడించింది.

మన దేశంలో బిర్యానీకి సైతం మంచి డిమాండ్​ ఉంది. 2023 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేసినట్లు గతంలో స్విగ్గీ తెలిపింది. అదే సమయంలో 2.5 లక్షల పిజ్జాలను సైతం కస్టమర్లకు అందించినట్లు వెల్లడించింది. అందులో హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ల శాతం-75.4 శాతం ఉన్నట్లు తెలిపింది. లఖ్​నవీ బిర్యానీ ఆర్డర్ల శాతం-14.2 శాతంగా ఉందని పేర్కొంది. కోల్‌కతా బిర్యానీ ఆర్డర్ల శాతం-10.4 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్​లో ఎక్కువ మంది బావర్చీ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్​ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. బావర్చీ నుంచి నిమిషానికి రెండు బిర్యానీలు డెలివరీ అందించినట్లు సంస్థ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.