ETV Bharat / business

డీమార్ట్​ ఓనర్​ కొత్త ఇల్లు రూ.1238 కోట్లు.. ఫొటోలు చూశారా?

author img

By

Published : May 9, 2023, 1:42 PM IST

Dmart Founder New House Photos : డీమార్ట్​ వ్యవస్థాపకుడు రూ.1238 కోట్లు పెట్టి కొన్న కొత్త ఇంటి ఫొటోలు బయటకు వచ్చాయి. సామాజిక మాధ్యమాల వేధికగా ఓ వ్యాపార సంస్థ ఈ ఫొటోలను షేర్ చేసింది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో రాధాకిషన్ దమానీ ఈ ఇంటిని కొనుగోలు చేశారు.

demart-founder-new-house-photos-new-house-photos-and-radhakishan-damani-new-house-photos
డీమార్ట్​ వ్యవస్థాపకుడి ఇంటి ఫోటోలు

Dmart owner new house photos : డీమార్ట్​ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ.. మూడు నెలల క్రితం కొన్న కొత్త ఇంటి ఫొటోలు.. తాజాగా బయటకు వచ్చాయి. దాదాపు రూ.1238 కోట్లు విలువైన ఈ ఇంటిని 2023 ఫిబ్రవరిలో దమానీ కొనుగోలు చేశారు. ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలను.. ఓ వ్యాపార సంస్థ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దిగ్గజ బిలియనీర్లకు నిలయమైన ముంబయి నగరంలోనే.. ఈ కొత్త ఇంటిని కోట్లు ఖర్చు చేసి కొన్నారు రాధాకిషన్ దమానీ. ప్రస్తుతం రూ.13,658 కోట్ల సంపద కలిగిన దమానీ.. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం దక్షిణ ముంబయిలో 28 ఫ్లాట్లతో కూడిన హై-ఎండ్ రెసిడెన్షియల్ భవనాన్ని కొనుగోలు చేశారు.

దమానీ కుటుంబం, ఆయన స్నేహితులు కలిసి.. మొత్తం 1,82,084 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియా కలిగిన భవనాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 100 కంటే ఎక్కువ పార్కింగ్ ప్లేస్​లు ఉన్నాయి. ముంబయిలోని వర్లీ జిల్లా.. త్రీ సిక్స్​టీ వెస్ట్ సొసైటీలో ఈ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇక్కడ 5వేల చదరపు అడుగుల కార్పెట్ ఏరియాకు.. దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. పలు మీడియా కథనాల ప్రకారం.. సహానా గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుధాకర్ శెట్టి నుంచి.. దమానీ ఈ ఫ్లాట్లు కొన్నట్లు తెలిసింది.

2021లోనూ రాధాకిషన్ దమానీ తన సోదరుడు గోపీకిషన్ దమానీతో కలిసి.. ముంబయిలోని మలబార్ హిల్‌లో రెండంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశారు. 5752.22 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 90 ఏళ్ల నాటి ఈ భవనాన్ని.. మొత్తం రూ.1001 కోట్లు పెట్టి కొన్నారు. ఒక్కో చదరపు అడుగుకు రూ.1,61,670 ఖర్చు చేశారు. ఈ మధ్యకాలంలోనే దాదాపు రూ.400 కోట్లతో మరో ఏడు ప్రాపర్టీలను సైతం దమానీ కొనుగోలు చేశారు.

దేశంలోనే అత్యంత కాస్ట్లీ ఫ్లాట్​.. రూ.369 కోట్లకు సేల్​.. ఎవరు కొన్నారో తెలుసా?
నెల రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త, హెల్త్‌కేర్‌ ఉత్పత్తుల సంస్థ ఫామీ కేర్‌ వ్యవస్థాపకుడు జేపీ తపారియా కుటుంబసభ్యులు.. ఓ ట్రిప్లెక్స్‌ ఇంటిని అక్షరాలా రూ.369కోట్లకు కొనుగోలు చేశారు. దక్షిణ ముంబయిలోని అత్యంత ఖరీదైన మలబార్‌ హిల్స్‌ ప్రాంతంలో ఈ ఇల్లు ఉంది. తపారియా కుటుంబం బీచ్​ వ్యూ ఉన్న ఈ లగ్జరీ ఇంటిని లోధా గ్రూప్‌నకు చెందిన మార్కోటెక్‌ డెవలపర్స్‌ నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్‌ ఇదేనని వార్తలు వినిపిస్తున్నాయి. ముంబయిలో సూపర్‌ లగ్జరీ నివాస టవర్‌గా పేరొందిన లోధా మలబార్‌ ప్యాలెస్‌లోని 26,27,28 అంతస్తుల్లో ఈ ట్రిప్లెక్స్‌ ఉంది. ఈ ఫ్లాట్​ వైశాల్యం 27,160 చదరపు అడుగులు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

Dmart owner new house photos : డీమార్ట్​ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ.. మూడు నెలల క్రితం కొన్న కొత్త ఇంటి ఫొటోలు.. తాజాగా బయటకు వచ్చాయి. దాదాపు రూ.1238 కోట్లు విలువైన ఈ ఇంటిని 2023 ఫిబ్రవరిలో దమానీ కొనుగోలు చేశారు. ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలను.. ఓ వ్యాపార సంస్థ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దిగ్గజ బిలియనీర్లకు నిలయమైన ముంబయి నగరంలోనే.. ఈ కొత్త ఇంటిని కోట్లు ఖర్చు చేసి కొన్నారు రాధాకిషన్ దమానీ. ప్రస్తుతం రూ.13,658 కోట్ల సంపద కలిగిన దమానీ.. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం దక్షిణ ముంబయిలో 28 ఫ్లాట్లతో కూడిన హై-ఎండ్ రెసిడెన్షియల్ భవనాన్ని కొనుగోలు చేశారు.

దమానీ కుటుంబం, ఆయన స్నేహితులు కలిసి.. మొత్తం 1,82,084 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియా కలిగిన భవనాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 100 కంటే ఎక్కువ పార్కింగ్ ప్లేస్​లు ఉన్నాయి. ముంబయిలోని వర్లీ జిల్లా.. త్రీ సిక్స్​టీ వెస్ట్ సొసైటీలో ఈ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇక్కడ 5వేల చదరపు అడుగుల కార్పెట్ ఏరియాకు.. దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. పలు మీడియా కథనాల ప్రకారం.. సహానా గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుధాకర్ శెట్టి నుంచి.. దమానీ ఈ ఫ్లాట్లు కొన్నట్లు తెలిసింది.

2021లోనూ రాధాకిషన్ దమానీ తన సోదరుడు గోపీకిషన్ దమానీతో కలిసి.. ముంబయిలోని మలబార్ హిల్‌లో రెండంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశారు. 5752.22 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 90 ఏళ్ల నాటి ఈ భవనాన్ని.. మొత్తం రూ.1001 కోట్లు పెట్టి కొన్నారు. ఒక్కో చదరపు అడుగుకు రూ.1,61,670 ఖర్చు చేశారు. ఈ మధ్యకాలంలోనే దాదాపు రూ.400 కోట్లతో మరో ఏడు ప్రాపర్టీలను సైతం దమానీ కొనుగోలు చేశారు.

దేశంలోనే అత్యంత కాస్ట్లీ ఫ్లాట్​.. రూ.369 కోట్లకు సేల్​.. ఎవరు కొన్నారో తెలుసా?
నెల రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త, హెల్త్‌కేర్‌ ఉత్పత్తుల సంస్థ ఫామీ కేర్‌ వ్యవస్థాపకుడు జేపీ తపారియా కుటుంబసభ్యులు.. ఓ ట్రిప్లెక్స్‌ ఇంటిని అక్షరాలా రూ.369కోట్లకు కొనుగోలు చేశారు. దక్షిణ ముంబయిలోని అత్యంత ఖరీదైన మలబార్‌ హిల్స్‌ ప్రాంతంలో ఈ ఇల్లు ఉంది. తపారియా కుటుంబం బీచ్​ వ్యూ ఉన్న ఈ లగ్జరీ ఇంటిని లోధా గ్రూప్‌నకు చెందిన మార్కోటెక్‌ డెవలపర్స్‌ నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్‌ ఇదేనని వార్తలు వినిపిస్తున్నాయి. ముంబయిలో సూపర్‌ లగ్జరీ నివాస టవర్‌గా పేరొందిన లోధా మలబార్‌ ప్యాలెస్‌లోని 26,27,28 అంతస్తుల్లో ఈ ట్రిప్లెక్స్‌ ఉంది. ఈ ఫ్లాట్​ వైశాల్యం 27,160 చదరపు అడుగులు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.