ETV Bharat / business

ఒడుదొడుకుల మధ్య నష్టాలతో ముగిసిన సూచీలు

author img

By

Published : Nov 10, 2021, 9:29 AM IST

Updated : Nov 10, 2021, 3:50 PM IST

Stock market
స్టాక్​ మార్కెట్

15:42 November 10

ఒడుదొడుకుల మధ్య జరిగిన ట్రేడింగ్​లో స్టాక్​ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్​ 80 పాయింట్లు కోల్పోయి.. 60,352.82 స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 18,017 వద్దకు చేరింది.  

14:02 November 10

దేశీయ స్టాక్​ మార్కెట్లు ఆరంభ నష్టాల నుంచి క్రమంగా పుంజుకున్నాయి. సూచీలు ప్రస్తుతం ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 60,434 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 18 వేల ఎగువన కొనసాగుతోంది.

11:44 November 10

స్టాక్ మార్కెట్లు స్థిరంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 200 పాయింట్లకుపైగా నష్టంతో.. 60,173 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి.. 17,968 వద్ద కదలాడుతోంది.

ఆసియా మార్కెట్లు ఒక శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. షాంఘై, హాంకాంగ్​, టోక్యో, సియోల్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి.  

  • ఎం అండ్​ ఎం, భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్​, డాక్టర్​ రెడ్డీస్​, సన్​ ఫార్మా, ఐటీసీ, టెక్​ మహీంద్రా షేర్లు రాణిస్తున్నాయి.
  • టాటాస్టీల్​, ఇండస్​బ్యాంకు, ఏషియన్​పెయింట్స్​, ఐసీఐసీఐ బ్యాంకు, హెడీఎఫ్​సీ జంట, కోటక్​బ్యాంకు షేర్లు ప్రధానంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

పెద్ద షేర్లకు అమ్మకాల ఒత్తిడి

హెచ్‌డీఎఫ్‌సీ జంట, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్​ బ్యాంకు వంటి పెద్ద షేర్ల అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో దేశీయ సూచీలు కుంగాయి. 

ఫలితంగా బుధవారం సెషన్​ ప్రారంభ దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా కోల్పోయి.​. 60 వేల దిగువ కదలాడిన సూచీ.. తిరిగి కాస్త పుంజుకుంది. 

09:03 November 10

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో స్టాక్ మార్కెట్లు (Stock market live) బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా కోల్పోయి 60,056 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 100 పాయింట్లకుపైగా నష్టంతో.. 17,931 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది.

సెన్సెక్స్​ 30 సూచీలో ఎం అండ్​ ఎం, సన్​ఫార్మా, డాక్టర్ ​రెడ్డీస్​ మినహా మిగిలినవి నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

15:42 November 10

ఒడుదొడుకుల మధ్య జరిగిన ట్రేడింగ్​లో స్టాక్​ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్​ 80 పాయింట్లు కోల్పోయి.. 60,352.82 స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 18,017 వద్దకు చేరింది.  

14:02 November 10

దేశీయ స్టాక్​ మార్కెట్లు ఆరంభ నష్టాల నుంచి క్రమంగా పుంజుకున్నాయి. సూచీలు ప్రస్తుతం ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 60,434 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 18 వేల ఎగువన కొనసాగుతోంది.

11:44 November 10

స్టాక్ మార్కెట్లు స్థిరంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 200 పాయింట్లకుపైగా నష్టంతో.. 60,173 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి.. 17,968 వద్ద కదలాడుతోంది.

ఆసియా మార్కెట్లు ఒక శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. షాంఘై, హాంకాంగ్​, టోక్యో, సియోల్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి.  

  • ఎం అండ్​ ఎం, భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్​, డాక్టర్​ రెడ్డీస్​, సన్​ ఫార్మా, ఐటీసీ, టెక్​ మహీంద్రా షేర్లు రాణిస్తున్నాయి.
  • టాటాస్టీల్​, ఇండస్​బ్యాంకు, ఏషియన్​పెయింట్స్​, ఐసీఐసీఐ బ్యాంకు, హెడీఎఫ్​సీ జంట, కోటక్​బ్యాంకు షేర్లు ప్రధానంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

పెద్ద షేర్లకు అమ్మకాల ఒత్తిడి

హెచ్‌డీఎఫ్‌సీ జంట, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్​ బ్యాంకు వంటి పెద్ద షేర్ల అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో దేశీయ సూచీలు కుంగాయి. 

ఫలితంగా బుధవారం సెషన్​ ప్రారంభ దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా కోల్పోయి.​. 60 వేల దిగువ కదలాడిన సూచీ.. తిరిగి కాస్త పుంజుకుంది. 

09:03 November 10

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో స్టాక్ మార్కెట్లు (Stock market live) బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా కోల్పోయి 60,056 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 100 పాయింట్లకుపైగా నష్టంతో.. 17,931 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది.

సెన్సెక్స్​ 30 సూచీలో ఎం అండ్​ ఎం, సన్​ఫార్మా, డాక్టర్ ​రెడ్డీస్​ మినహా మిగిలినవి నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Nov 10, 2021, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.