ETV Bharat / business

సొంతింటి కల సాకారానికి ఇదే సరైన సమయమా?

author img

By

Published : Aug 28, 2020, 5:11 PM IST

కరోనా కారణంగా రియల్టీ రంగం సంక్షోభంలో ఉన్నప్పటికీ..ఇల్లు కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయమని అంటున్నారు నిపుణులు. గతంతో పోలిస్తే.. ఇప్పుడు మరింత తక్కువ ధరకే ఇల్లు సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.

Best time for Buy own House
ఇల్లు కొనేందుకు సరైన సమయం ఏది

కరోనా సంక్షోభంతో చాలా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో స్థిరాస్తి రంగం కూడా కీలకమైంది. అయితే ఇళ్ల కొనుగోలుకు మాత్రం ప్రస్తుత పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని, భవిష్యత్తులో గృహ స్థిరాస్తి రంగం మంచి ప్రదర్శన కనబరుస్తుందని రియల్టీ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు కారణాలు ఇలా ఉన్నాయి.

తగ్గిన వడ్డీ రేట్లు

సంవత్సరం క్రితం గృహ రుణంపై వడ్డీ రేట్లు 8 నుంచి 9 శాతం మధ్యలో ఉండేవి. ఇప్పుడు 7 శాతం వద్ద ఉన్నాయి.

ఏడాది ముందు రూ.40 లక్షలు 8.5 శాతం వడ్డీతో 20 ఏళ్లకు గృహ రుణం తీసుకుంటే ఈఎంఐ రూ.34,713గా ఉండేది. అదే రుణాన్ని ఇప్పుడు 7 శాతం వడ్డీతో తీసుకుంటే రూ.3,701 రూపాయలు తగ్గి ఈఎంఐ రూ.31,012 ఉంటుంది.

వడ్డీ రేట్ల తగ్గుదలతో పాటు.. పలు ఇతర కారణాలతో ఇళ్ల కొనుగోలుకు ఇప్పుడు అనువైన పరిస్థితులు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. గృహ కొనుగోలుకు కావాల్సిన మార్జిన్‌ డబ్బులు ఉన్నట్లయితే కొనుగోలు చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

అందుబాటు ధరలో ఇళ్లు...

ఇళ్ల ధరలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయని స్థిరాస్తి రంగ ప్రతినిధులు చెబుతున్నారు. డెవలపర్లు తమపై ఆర్థిక భారం పడకుండా.. ధరలు మరింత తగ్గించేందుకు మొగ్గు చూపొచ్చని అంటున్నారు. ఈ కారణాలతో చాలా ప్రాంతాల్లో ఇంతకుముందు నిర్మాణ దశలో ఉన్న ఇంటి ధరకే.. ప్రస్తుతం పూర్తి చేసిన ఇల్లు వస్తోందని స్థిరాస్తి విశ్లేషకులు చెబుతున్నారు.

మంచి డీల్స్​..

పండుగ సీజన్​ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. రియల్టీ సంస్థలు మంచి ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. కాంప్లిమెంటరీ కార్‌ పార్కింగ్‌, సులభమైన పేమెంట్‌ ప్లాన్స్‌ తదితర సదుపాయాలను పొందవచ్చని వారు అంటున్నారు. నేరుగా డెవలపర్లతో మాట్లాడటం ద్వారా ఇంకా మంచి డీల్స్ కుదుర్చుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఐటీ డిమాండ్‌..

గతంలో వచ్చిన మాంద్యంతో పోలిస్తే.. ఇప్పుడు గృహలకు సంబంధించిన స్థిరాస్తి రంగం ఆర్థికంగా మంచి స్థాయిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. గృహ స్థిరాస్తి రంగం స్థానిక డిమాండ్‌పైనే ఎక్కువగా ఆధాపడి ఉంటుంది. సంక్షోభంలో ఐటీ రంగం ఎక్కువ ప్రభావితం కాలేదు. ఈ నేపథ్యంలో ఐటీ ఎక్కువగా ఉన్న నగరాల్లో స్థిరాస్తి రంగం రికవరీ మంచి స్థాయిలో ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

స్టాక్‌ మార్కెట్లలో అనిశ్చితి..

స్టాక్‌ మార్కెట్లలో అనిశ్చితి పెరిగిపోవడం వల్ల పెట్టుబడిదారులు స్థిరాస్తిని స్థిర ఆదాయ వనరుగా పరిగణిస్తున్నారు. స్థిరాస్తి ధరల హేతుబద్ధీకరణ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మెరుగవటం సహా ఉద్యోగిత పెరగటం వల్ల అద్దె ఆదాయం మంచి స్థాయిలో ఉండే అవకాశం ఉందనేది స్థిరాస్తి రంగ నిపుణుల మాట. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కొనుగోలుదారుల సెంటిమెంట్‌ బలంగా ఉంటుందని వారు అంటున్నారు.

ఇదీ చూడండి:జీఎస్టీ పరిహారంపై బిహార్​ రూటే సెపరేటు

కరోనా సంక్షోభంతో చాలా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో స్థిరాస్తి రంగం కూడా కీలకమైంది. అయితే ఇళ్ల కొనుగోలుకు మాత్రం ప్రస్తుత పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని, భవిష్యత్తులో గృహ స్థిరాస్తి రంగం మంచి ప్రదర్శన కనబరుస్తుందని రియల్టీ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు కారణాలు ఇలా ఉన్నాయి.

తగ్గిన వడ్డీ రేట్లు

సంవత్సరం క్రితం గృహ రుణంపై వడ్డీ రేట్లు 8 నుంచి 9 శాతం మధ్యలో ఉండేవి. ఇప్పుడు 7 శాతం వద్ద ఉన్నాయి.

ఏడాది ముందు రూ.40 లక్షలు 8.5 శాతం వడ్డీతో 20 ఏళ్లకు గృహ రుణం తీసుకుంటే ఈఎంఐ రూ.34,713గా ఉండేది. అదే రుణాన్ని ఇప్పుడు 7 శాతం వడ్డీతో తీసుకుంటే రూ.3,701 రూపాయలు తగ్గి ఈఎంఐ రూ.31,012 ఉంటుంది.

వడ్డీ రేట్ల తగ్గుదలతో పాటు.. పలు ఇతర కారణాలతో ఇళ్ల కొనుగోలుకు ఇప్పుడు అనువైన పరిస్థితులు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. గృహ కొనుగోలుకు కావాల్సిన మార్జిన్‌ డబ్బులు ఉన్నట్లయితే కొనుగోలు చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

అందుబాటు ధరలో ఇళ్లు...

ఇళ్ల ధరలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయని స్థిరాస్తి రంగ ప్రతినిధులు చెబుతున్నారు. డెవలపర్లు తమపై ఆర్థిక భారం పడకుండా.. ధరలు మరింత తగ్గించేందుకు మొగ్గు చూపొచ్చని అంటున్నారు. ఈ కారణాలతో చాలా ప్రాంతాల్లో ఇంతకుముందు నిర్మాణ దశలో ఉన్న ఇంటి ధరకే.. ప్రస్తుతం పూర్తి చేసిన ఇల్లు వస్తోందని స్థిరాస్తి విశ్లేషకులు చెబుతున్నారు.

మంచి డీల్స్​..

పండుగ సీజన్​ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. రియల్టీ సంస్థలు మంచి ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. కాంప్లిమెంటరీ కార్‌ పార్కింగ్‌, సులభమైన పేమెంట్‌ ప్లాన్స్‌ తదితర సదుపాయాలను పొందవచ్చని వారు అంటున్నారు. నేరుగా డెవలపర్లతో మాట్లాడటం ద్వారా ఇంకా మంచి డీల్స్ కుదుర్చుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఐటీ డిమాండ్‌..

గతంలో వచ్చిన మాంద్యంతో పోలిస్తే.. ఇప్పుడు గృహలకు సంబంధించిన స్థిరాస్తి రంగం ఆర్థికంగా మంచి స్థాయిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. గృహ స్థిరాస్తి రంగం స్థానిక డిమాండ్‌పైనే ఎక్కువగా ఆధాపడి ఉంటుంది. సంక్షోభంలో ఐటీ రంగం ఎక్కువ ప్రభావితం కాలేదు. ఈ నేపథ్యంలో ఐటీ ఎక్కువగా ఉన్న నగరాల్లో స్థిరాస్తి రంగం రికవరీ మంచి స్థాయిలో ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

స్టాక్‌ మార్కెట్లలో అనిశ్చితి..

స్టాక్‌ మార్కెట్లలో అనిశ్చితి పెరిగిపోవడం వల్ల పెట్టుబడిదారులు స్థిరాస్తిని స్థిర ఆదాయ వనరుగా పరిగణిస్తున్నారు. స్థిరాస్తి ధరల హేతుబద్ధీకరణ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మెరుగవటం సహా ఉద్యోగిత పెరగటం వల్ల అద్దె ఆదాయం మంచి స్థాయిలో ఉండే అవకాశం ఉందనేది స్థిరాస్తి రంగ నిపుణుల మాట. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కొనుగోలుదారుల సెంటిమెంట్‌ బలంగా ఉంటుందని వారు అంటున్నారు.

ఇదీ చూడండి:జీఎస్టీ పరిహారంపై బిహార్​ రూటే సెపరేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.