ETV Bharat / business

పెరిగిన ధరలతో బంగారు రుణాలకు భలే డిమాండ్!

author img

By

Published : Nov 10, 2020, 4:13 PM IST

కరోనా కాలంలో బంగారం రుణాలకు డిమాండ్ భారీగా పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు ఇందుకు కారణంగా వెల్లడించింది. పెరిగిన ధరలతో ఎక్కువ రుణ విలువ లభించడం వల్ల రుణగ్రహీతలు, తక్కువ ఎల్​టీవీతో రుణ దాతలు లబ్ధిపొందారని పేర్కొంది.

World Gold Council on Gold loan Demand
పెరిగిన ధరలతో బంగారు రుణాలకు భారీ డిమాండ్

రికార్డు స్థాయిలో పెరిగిన పసిడి ధరలు.. కరోనా కాలంలో బంగారు రుణాల డిమాండ్​ను భారీగా 28.8 శాతం పెంచాయి. ఫలితంగా బంగారు రుణాలిచ్చే ప్రధాన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఏయూఎం (అసెట్ అండర్​ మేనేజ్​మెంట్​) కూడా భారీగా పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది.

పెరిగిన డిమాండ్​తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బంగారు రుణాల విలువ రూ.4,051 బిలియన్లు దాటొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సతరం ఈ విలువ రూ.3,448 బిలియన్లుగా తెలిపింది.

పెరిగిన పసిడి ధరలతో.. రుణ గ్రహీతలు అధిక రుణ విలువ పొంది లాభపడితే.. రుణదాతలు తక్కువ లోన్​ టూ వాల్యూ (ఎల్​టీవీ) నిష్పత్తితో లబ్ధిపొందారని పేర్కొంది డబ్ల్యూజీసీ.

ఏయూఎం వృద్ధి ఇలా..

దేశంలో ప్రధాన బంగారు రుణ సంస్థలైన ముత్తూట్ ఫినాన్స్, మణప్పురం ఫినాన్స్ కంపెనీల ఏయూఎం 2020-21 క్యూ2లో గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే వరుసగా 15 శాతం, 33.4 శాతం రుణాలు పెరిగినట్లు ప్రకటించాయి.

ఇదే కాలానికి.. కేరళకు చెందిన ఫెడరల్ బ్యాంక్​ బంగారు రుణాల ఏయూఎం ఏకంగా 36 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:ఉల్లి ఘాటు తగ్గకముందే.. వంట నూనెల మంట!

రికార్డు స్థాయిలో పెరిగిన పసిడి ధరలు.. కరోనా కాలంలో బంగారు రుణాల డిమాండ్​ను భారీగా 28.8 శాతం పెంచాయి. ఫలితంగా బంగారు రుణాలిచ్చే ప్రధాన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఏయూఎం (అసెట్ అండర్​ మేనేజ్​మెంట్​) కూడా భారీగా పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది.

పెరిగిన డిమాండ్​తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బంగారు రుణాల విలువ రూ.4,051 బిలియన్లు దాటొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సతరం ఈ విలువ రూ.3,448 బిలియన్లుగా తెలిపింది.

పెరిగిన పసిడి ధరలతో.. రుణ గ్రహీతలు అధిక రుణ విలువ పొంది లాభపడితే.. రుణదాతలు తక్కువ లోన్​ టూ వాల్యూ (ఎల్​టీవీ) నిష్పత్తితో లబ్ధిపొందారని పేర్కొంది డబ్ల్యూజీసీ.

ఏయూఎం వృద్ధి ఇలా..

దేశంలో ప్రధాన బంగారు రుణ సంస్థలైన ముత్తూట్ ఫినాన్స్, మణప్పురం ఫినాన్స్ కంపెనీల ఏయూఎం 2020-21 క్యూ2లో గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే వరుసగా 15 శాతం, 33.4 శాతం రుణాలు పెరిగినట్లు ప్రకటించాయి.

ఇదే కాలానికి.. కేరళకు చెందిన ఫెడరల్ బ్యాంక్​ బంగారు రుణాల ఏయూఎం ఏకంగా 36 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:ఉల్లి ఘాటు తగ్గకముందే.. వంట నూనెల మంట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.