ETV Bharat / business

దేశంలో భారీగా పెరిగిన గోల్డ్​ స్మగ్లింగ్.. కారణం?

author img

By

Published : Jul 27, 2020, 12:44 PM IST

ఇటీవలి కాలంలో దేశంలో గోల్డ్ స్మగ్లింగ్ ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. స్మగ్లర్లకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ స్మగ్లింగ్ వ్యవహారానికి కేరళ ప్రధాన కేంద్రమైంది. దీనికి కారణమేంటి? అసలు బంగారానికి భారత్​లో ఎందుకింత డిమాండ్? ఇది ఎప్పటికీ ఇలానే కొనసాగుతుందా? దీనికి సమాధానం నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం.

Gold smuggling:  The answers to why gold, why Kerala, why gold price rises steadily and why mostly from Gulf countries
దేశంలో బంగారం స్మగ్లింగ్ ఎందుకు పెరిగిపోతోంది?

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి తోడు స్వయంగా ఓ ఐఏఎస్ అధికారి ఈ వ్యవహారంతో సంబంధం కలిగి ఉండడం, ఆయనే ముఖ్యమంత్రి మాజీ ప్రధాన కార్యదర్శి కావడం కూడా... రాజకీయ దుమారానికి దారితీసింది.

జులై 5న గల్ఫ్ నుంచి కేరళ తిరువనంతపురం విమానాశ్రయానికి బంగారం అక్రమ రవాణా చేసిన నలుగురు నిందితులను కస్టమ్స్ అధికారులు గుర్తించి, అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15 కోట్ల విలువైన 30 కేజీల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఈ కేసుపై కస్టమ్స్​, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ), ఆదాయ పన్నుశాఖలు మొదట దర్యాప్తు ప్రారంభించాయి. తరువాత ఈ కేసుపై ఈడీ కూడా విచారణ ప్రారంభించింది. నిందితులపై అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేసింది.

ఉగ్రవాదులతో సంబంధం

ఈ కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు నిందితులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని వల్ల దేశ భద్రతను, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందుని ఎన్​ఐఏ రంగంలోకి దిగింది.

ఎన్నో ప్రశ్నలు?

ఈ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భారతదేశానికి... గల్ఫ్ దేశాల నుంచే ఎందుకు ఎక్కువగా బంగారం అక్రమ రవాణా జరుగుతోంది? ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఈ బంగారం స్మగ్లింగ్ కోసం కేరళ రాష్ట్రాన్నే ఎందుకు ఎక్కువగా ఎంచుకుంటున్నారు? కరెన్సీ సహా ఇంకా విలువైన లోహాలు ఉండగా.. కేవలం బంగారాన్నే ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు?

సామాన్యుల మెదడును తొలుస్తున్న ఇలాంటి ప్రశ్నలకు... సమాధానం ఇచ్చారు ఓ సీనియర్ ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్(ఐఆర్​ఎస్​). అయితే ఆయన తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

*ప్రశ్న: గల్ఫ్ దేశాల నుంచి బంగారం అక్రమ రవాణా ఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి?

జవాబు: 1990వరకు, మన దేశ చట్టం ప్రకారం, బంగారం అక్రమ రవాణాను క్రిమినల్ నేరం కింద పరిగణించేవారు. అయితే 1990 జూన్ 6న.. 'గోల్డ్ కంట్రోల్ యాక్ట్​ 1968'ను పార్లమెంట్ రద్దు చేసింది. అలాగే 1990 చట్టం ప్రకారం, 6 నెలలు విదేశాల్లో నివసించిన భారతీయులు.. స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు 5 కిలోగ్రాముల బంగారం వరకు తీసుకురావడానికి అవకాశం కల్పించింది.

దీని ప్రకారం, విదేశాల నుంచి భారత్​కు తీసుకొచ్చిన ఒక గ్రాము బంగారానికి కట్టాల్సిన డ్యూటీ ఫీజు కేవలం రూ.22 మాత్రమే. అంటే, సాంకేతికంగా సావరిన్ గోల్డ్​పై రూ.176 డ్యూటీ చెల్లించి.. ఎవరైనా విదేశాల నుంచి బంగారాన్ని భారత్​కు తీసుకురావచ్చు. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని స్మగ్లర్లు బంగారం అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు.

ఆ రోజుల్లో స్మగ్లర్లు.. గల్ఫ్ నుంచి వచ్చే కొంతమందిని ప్రలోభపెట్టి, వారికి విమానం టికెట్లు కొనిచ్చి, బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చేలా చేసేవారు. అలా గల్ఫ్​ నుంచి వచ్చిన వారు తాము తెచ్చిన బంగారానికి విమానాశ్రయంలోనే డ్యూటీ కట్టేసేవారు. వారు బయటకు రాగానే... స్మగ్లర్లు ఆ బంగారాన్ని తీసుకునేవారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక్కో విమానంలో సుమారు 50 నుంచి 60 మంది వరకు ఇలా బంగారాన్ని అక్రమంగా తరలించేవారు. ఆదాయపన్ను శాఖ, రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంస్థలు చేసిన దర్యాప్తులో.. గల్ఫ్ నుంచి బంగారం తెచ్చేవారి ఆర్థిక పరిస్థితి తీవ్ర దుర్భరంగా ఉన్నట్లు తేలింది. వారు కనీసం ఒక్క బంగారం బిస్కెట్​ను కూడా కొనే స్థితిలో లేరని స్పష్టం అయ్యింది. దీని ద్వారా భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా జరిగినట్లు అధికారులు గుర్తించారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే... ఇలా గల్ఫ్​ నుంచి బంగారాన్ని అక్రమంగా తెచ్చినవారికి.... నిజంగా ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో.. అది చివరికి ఎవరికి చేరుతుందో... ఏమీ తెలియదు.

ఇలా ఈ దందా 2012 వరకు కొనసాగింది. అయితే 2012లో బంగారం దిగుమతి సుంకాన్ని... భారత్​ మార్కెట్ విలువలో 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2014లో మరోసారి ఈ సంకాన్ని 12.5 శాతానికి పెంచింది. ఇది బంగారం అక్రమ రవాణా మరింత పెరిగేలా చేసింది.

*ప్రశ్న: బంగారాన్ని మాత్రమే ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు?

జవాబు: చట్ట విరుద్ధంగా కరెన్సీని ఒక దేశం నుంచి మరో దేశానికి తరలించడం కష్టం. అదే బంగారం అయితే చాలా సులభంగా అక్రమ రవాణా చేయవచ్చని స్మగ్లర్లు గుర్తించారు. సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలకు వీసా లేకుండా అక్రమంగా వెళ్లి పనిచేసే పేద మలయాళీ కార్మికులు.. ఈ స్మగ్లర్ల వలలో చిక్కుతారు.

సౌదీ అరేబియాలో శుక్రవారం.. వారాంతపు సెలవుదినం. అందువల్ల బ్యాంకులు పనిచేయవు. కనుక ఈ కార్మికులు తమ సంపాదనను స్వదేశానికి పంపించడానికి వీలుపడదు. అందువల్ల వీరు స్థానికంగా ఉండే... ఓ హవాలా ఏజెంట్ ద్వారా భారత్​లో ఉన్న తమ బంధువులకు డబ్బు పంపిస్తారు. ఇలా భారత్​కు అక్రమంగా పంపించే సొమ్ము కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే ఇది బంగారం రూపంలో ఉంటుంది.

పెరుగుతున్న డిమాండ్ కూడా..

భారత్​లో ఎప్పటికప్పుడు బంగారానికి పెరుగుతున్న డిమాండ్ కూడా... అక్రమ రవాణాకు దారితీస్తోంది.

*బంగారం అక్రమ రవాణాకు కేరళనే ఎందుకు ఎంచుకుంటున్నారు?

ఇతర రాష్ట్రాలతో పోల్చితే, కేరళలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఒక్కసారి బంగారం బయటకు వెళ్తే, కోరుకున్న స్థలానికి సులభంగా రవాణా చేయవచ్చు. దీనితోపాటు కేరళలో పోలీసు రైడ్​లు తక్కువ. అందువల్ల స్మగ్లర్లకు ఇది చాలా అనువైన ప్రదేశం. అయితే వీరికి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. అందుకే దీనిపై ఐఎన్​ఏ ప్రత్యేకంగా దర్యాప్తు జరుపుతోంది.

*బంగారంపై మోజు ఎందుకు?

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బంగారాన్ని ఓ సురక్షితమైన పెట్టుబడిగా ప్రజలు భావిస్తారు. అయితే 1990 నుంచి 2014 మధ్య... స్టాక్​మార్కెట్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ రంగాలతో పోల్చితే... బంగారం ధరలు అనుకున్నంత గొప్పగా పెరగలేదు.

అయితే నోట్ల రద్దు తరువాత, భారత ఆర్థిక వ్యవస్థలో భారీ కుదుపు ఏర్పడింది. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతింది. షేర్ మార్కెట్లు కూడా నష్టాలు చవిచూశాయి. అలాంటి సమయంలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీనితో కష్టకాలంలో ఆదుకునే మంచి పెట్టుబడిగా ప్రజలు బంగారం వైపు మొగ్గుచూపడం మరోసారి మొదలుపెట్టారు.

ఆర్థిక మాంద్యం పరిస్థితిల్లో..

దేశంలో గత మూడేళ్లుగా ఆర్థికమాంద్యం ఉండడం, కరోనా సంక్షోభం, లాక్​డౌన్ పరిస్థితులు, ఇవన్నీ కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి.

మరోసారి డీమోనిటైజేషన్​ చేస్తే?

2016 నవంబర్ 8న కేంద్రం ప్రభుత్వం అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం మరోసారి డీమోనిటైజేషన్ చేస్తే నల్లధనం దాచుకున్నవారికి చాలా కష్టమైపోతుంది. అదే బంగారం రూపంలో నల్లధనం దాచుకుంటే.. వాళ్లు చాలా సురక్షితంగా ఉండొచ్చు. ఇప్పుడు ఇదే ఆలోచనతో స్మగ్లర్లు.. భారత్​లోకి బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏదిఏమైనా భారత ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకున్న తరువాత.. బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: క్యూ1 లెక్కలు, చైనా చిక్కులే కీలకం!

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి తోడు స్వయంగా ఓ ఐఏఎస్ అధికారి ఈ వ్యవహారంతో సంబంధం కలిగి ఉండడం, ఆయనే ముఖ్యమంత్రి మాజీ ప్రధాన కార్యదర్శి కావడం కూడా... రాజకీయ దుమారానికి దారితీసింది.

జులై 5న గల్ఫ్ నుంచి కేరళ తిరువనంతపురం విమానాశ్రయానికి బంగారం అక్రమ రవాణా చేసిన నలుగురు నిందితులను కస్టమ్స్ అధికారులు గుర్తించి, అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15 కోట్ల విలువైన 30 కేజీల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఈ కేసుపై కస్టమ్స్​, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ), ఆదాయ పన్నుశాఖలు మొదట దర్యాప్తు ప్రారంభించాయి. తరువాత ఈ కేసుపై ఈడీ కూడా విచారణ ప్రారంభించింది. నిందితులపై అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేసింది.

ఉగ్రవాదులతో సంబంధం

ఈ కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు నిందితులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని వల్ల దేశ భద్రతను, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందుని ఎన్​ఐఏ రంగంలోకి దిగింది.

ఎన్నో ప్రశ్నలు?

ఈ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భారతదేశానికి... గల్ఫ్ దేశాల నుంచే ఎందుకు ఎక్కువగా బంగారం అక్రమ రవాణా జరుగుతోంది? ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఈ బంగారం స్మగ్లింగ్ కోసం కేరళ రాష్ట్రాన్నే ఎందుకు ఎక్కువగా ఎంచుకుంటున్నారు? కరెన్సీ సహా ఇంకా విలువైన లోహాలు ఉండగా.. కేవలం బంగారాన్నే ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు?

సామాన్యుల మెదడును తొలుస్తున్న ఇలాంటి ప్రశ్నలకు... సమాధానం ఇచ్చారు ఓ సీనియర్ ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్(ఐఆర్​ఎస్​). అయితే ఆయన తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

*ప్రశ్న: గల్ఫ్ దేశాల నుంచి బంగారం అక్రమ రవాణా ఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి?

జవాబు: 1990వరకు, మన దేశ చట్టం ప్రకారం, బంగారం అక్రమ రవాణాను క్రిమినల్ నేరం కింద పరిగణించేవారు. అయితే 1990 జూన్ 6న.. 'గోల్డ్ కంట్రోల్ యాక్ట్​ 1968'ను పార్లమెంట్ రద్దు చేసింది. అలాగే 1990 చట్టం ప్రకారం, 6 నెలలు విదేశాల్లో నివసించిన భారతీయులు.. స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు 5 కిలోగ్రాముల బంగారం వరకు తీసుకురావడానికి అవకాశం కల్పించింది.

దీని ప్రకారం, విదేశాల నుంచి భారత్​కు తీసుకొచ్చిన ఒక గ్రాము బంగారానికి కట్టాల్సిన డ్యూటీ ఫీజు కేవలం రూ.22 మాత్రమే. అంటే, సాంకేతికంగా సావరిన్ గోల్డ్​పై రూ.176 డ్యూటీ చెల్లించి.. ఎవరైనా విదేశాల నుంచి బంగారాన్ని భారత్​కు తీసుకురావచ్చు. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని స్మగ్లర్లు బంగారం అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు.

ఆ రోజుల్లో స్మగ్లర్లు.. గల్ఫ్ నుంచి వచ్చే కొంతమందిని ప్రలోభపెట్టి, వారికి విమానం టికెట్లు కొనిచ్చి, బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చేలా చేసేవారు. అలా గల్ఫ్​ నుంచి వచ్చిన వారు తాము తెచ్చిన బంగారానికి విమానాశ్రయంలోనే డ్యూటీ కట్టేసేవారు. వారు బయటకు రాగానే... స్మగ్లర్లు ఆ బంగారాన్ని తీసుకునేవారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక్కో విమానంలో సుమారు 50 నుంచి 60 మంది వరకు ఇలా బంగారాన్ని అక్రమంగా తరలించేవారు. ఆదాయపన్ను శాఖ, రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంస్థలు చేసిన దర్యాప్తులో.. గల్ఫ్ నుంచి బంగారం తెచ్చేవారి ఆర్థిక పరిస్థితి తీవ్ర దుర్భరంగా ఉన్నట్లు తేలింది. వారు కనీసం ఒక్క బంగారం బిస్కెట్​ను కూడా కొనే స్థితిలో లేరని స్పష్టం అయ్యింది. దీని ద్వారా భారీ ఎత్తున బంగారం అక్రమ రవాణా జరిగినట్లు అధికారులు గుర్తించారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే... ఇలా గల్ఫ్​ నుంచి బంగారాన్ని అక్రమంగా తెచ్చినవారికి.... నిజంగా ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో.. అది చివరికి ఎవరికి చేరుతుందో... ఏమీ తెలియదు.

ఇలా ఈ దందా 2012 వరకు కొనసాగింది. అయితే 2012లో బంగారం దిగుమతి సుంకాన్ని... భారత్​ మార్కెట్ విలువలో 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2014లో మరోసారి ఈ సంకాన్ని 12.5 శాతానికి పెంచింది. ఇది బంగారం అక్రమ రవాణా మరింత పెరిగేలా చేసింది.

*ప్రశ్న: బంగారాన్ని మాత్రమే ఎందుకు స్మగ్లింగ్ చేస్తున్నారు?

జవాబు: చట్ట విరుద్ధంగా కరెన్సీని ఒక దేశం నుంచి మరో దేశానికి తరలించడం కష్టం. అదే బంగారం అయితే చాలా సులభంగా అక్రమ రవాణా చేయవచ్చని స్మగ్లర్లు గుర్తించారు. సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలకు వీసా లేకుండా అక్రమంగా వెళ్లి పనిచేసే పేద మలయాళీ కార్మికులు.. ఈ స్మగ్లర్ల వలలో చిక్కుతారు.

సౌదీ అరేబియాలో శుక్రవారం.. వారాంతపు సెలవుదినం. అందువల్ల బ్యాంకులు పనిచేయవు. కనుక ఈ కార్మికులు తమ సంపాదనను స్వదేశానికి పంపించడానికి వీలుపడదు. అందువల్ల వీరు స్థానికంగా ఉండే... ఓ హవాలా ఏజెంట్ ద్వారా భారత్​లో ఉన్న తమ బంధువులకు డబ్బు పంపిస్తారు. ఇలా భారత్​కు అక్రమంగా పంపించే సొమ్ము కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే ఇది బంగారం రూపంలో ఉంటుంది.

పెరుగుతున్న డిమాండ్ కూడా..

భారత్​లో ఎప్పటికప్పుడు బంగారానికి పెరుగుతున్న డిమాండ్ కూడా... అక్రమ రవాణాకు దారితీస్తోంది.

*బంగారం అక్రమ రవాణాకు కేరళనే ఎందుకు ఎంచుకుంటున్నారు?

ఇతర రాష్ట్రాలతో పోల్చితే, కేరళలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఒక్కసారి బంగారం బయటకు వెళ్తే, కోరుకున్న స్థలానికి సులభంగా రవాణా చేయవచ్చు. దీనితోపాటు కేరళలో పోలీసు రైడ్​లు తక్కువ. అందువల్ల స్మగ్లర్లకు ఇది చాలా అనువైన ప్రదేశం. అయితే వీరికి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. అందుకే దీనిపై ఐఎన్​ఏ ప్రత్యేకంగా దర్యాప్తు జరుపుతోంది.

*బంగారంపై మోజు ఎందుకు?

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బంగారాన్ని ఓ సురక్షితమైన పెట్టుబడిగా ప్రజలు భావిస్తారు. అయితే 1990 నుంచి 2014 మధ్య... స్టాక్​మార్కెట్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ రంగాలతో పోల్చితే... బంగారం ధరలు అనుకున్నంత గొప్పగా పెరగలేదు.

అయితే నోట్ల రద్దు తరువాత, భారత ఆర్థిక వ్యవస్థలో భారీ కుదుపు ఏర్పడింది. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతింది. షేర్ మార్కెట్లు కూడా నష్టాలు చవిచూశాయి. అలాంటి సమయంలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీనితో కష్టకాలంలో ఆదుకునే మంచి పెట్టుబడిగా ప్రజలు బంగారం వైపు మొగ్గుచూపడం మరోసారి మొదలుపెట్టారు.

ఆర్థిక మాంద్యం పరిస్థితిల్లో..

దేశంలో గత మూడేళ్లుగా ఆర్థికమాంద్యం ఉండడం, కరోనా సంక్షోభం, లాక్​డౌన్ పరిస్థితులు, ఇవన్నీ కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి.

మరోసారి డీమోనిటైజేషన్​ చేస్తే?

2016 నవంబర్ 8న కేంద్రం ప్రభుత్వం అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం మరోసారి డీమోనిటైజేషన్ చేస్తే నల్లధనం దాచుకున్నవారికి చాలా కష్టమైపోతుంది. అదే బంగారం రూపంలో నల్లధనం దాచుకుంటే.. వాళ్లు చాలా సురక్షితంగా ఉండొచ్చు. ఇప్పుడు ఇదే ఆలోచనతో స్మగ్లర్లు.. భారత్​లోకి బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏదిఏమైనా భారత ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకున్న తరువాత.. బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: క్యూ1 లెక్కలు, చైనా చిక్కులే కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.