ETV Bharat / business

భారత్​ మార్కెట్​లోకి స్మార్ట్​ టూత్​బ్రష్- ధర తెలుసా? - mi electric toothbrush price in india

ఎలక్ట్రానిక్​ దిగ్గజం షియోమీ తన స్మార్ట్​ ప్రపంచాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే భారత్​లో గురువారం ఎంఐ ఎలక్ట్రిక్​ బ్రష్​ను​ ఆవిష్కరించనుంది. ప్రత్యేకమైన సాంకేతికతతో రూపొందిన ఈ టూత్​ బ్రష్​ విశేషాలెంటో చూద్దాం..

Mi Electric Toothbrush
స్మార్ట్​ టూత్​బ్రష్
author img

By

Published : Feb 20, 2020, 6:44 AM IST

Updated : Mar 1, 2020, 10:09 PM IST

బడ్జెట్​ స్మార్ట్​ ఫోన్​ దిగ్గజం షియోమీ మరో ఉత్పత్తిని తీసుకురాబోతుంది. గతేడాది ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్​ ఆవిష్కరణతో వ్యక్తిగత ఆరోగ్యం రంగంలో అడుగుపెట్టిన సంస్థ.. తాజాగా ఎలక్ట్రిక్​ బ్రష్​ను తీసుకురానుంది. ఈ మేరకు టీజర్​ను విడుదల చేసింది షియోమీ.

ఎంఐ అధికారిక ట్విట్టర్​ ఖాతాలో 'మీ వ్యక్తిగత దంతవైద్యుడు- ఫిబ్రవరి 20న వస్తున్నాడు' అనే ట్యాగ్​లైన్​తో ఈ వీడియోను పోస్ట్ చేసింది.

అనేక ప్రత్యేకలు..

ఎంఐ ఎలక్ట్రిక్​ బ్రష్​ను మాగ్నెటిక్​ లెవిటేషన్​ సోనిక్​ మోటార్​తో తయారుచేసింది షియోమీ. దీనిలో ఉండే అల్ట్రాసోనిక్​ సాంకేతికత వల్ల బ్రష్​ నిమిషానికి 31,000 సార్లు తిరుగుతుంది. మెటల్​ ఫ్రీ హెడ్​, అత్యుత్తమ నాణ్యత కలిగిన బ్రిజిల్స్​, ఐపీఎక్స్​7 వాటర్​ రెసిస్టెంట్ ఈ బ్రష్ ప్రత్యేకతలు.

మనకు కావాల్సిన విధంగా..​

చాలా సెన్సిటివ్​గా, పళ్లను లోతుగా శుభ్రపరచడానికి ఇది ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. అయితే ఇందుకు మన ఫోన్​లో యాప్​ ఇన్​స్టాల్​ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన మోడ్​లో పెట్టుకుని స్విచ్ ఆన్​ చేస్తే.. అదే శుభ్రం చేస్తుంది. ఈ యాప్​ మనం బ్రష్ చేసిన సమయాలు, విధానాన్ని డేటా రూపంలో నిక్షిప్తం చేస్తుంది. పళ్ల ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది.

18 రోజుల బ్యాటరీ లైఫ్​..

700ఏంఏహెచ్ లిథియం బ్యాటరీ కలిగిన ఈ టూత్ బ్రష్ కు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 18 రోజులు వాడుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. బ్యాటరీ స్థాయి సూచించే ఇండికేటర్​ కూడా ఉంటుంది.

చైనాలో 2017లోనే ఎంఐ ఎలక్ట్రిక్ బ్రష్​ అమ్మకాలు ప్రారంభించింది. 2018లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించినా.. భారత్​కు మాత్రం గురువారం రానుంది. దీని ధర సుమారు రూ.2,000 వరకు ఉండవచ్చని నిపుణుల అంచనా.

బడ్జెట్​ స్మార్ట్​ ఫోన్​ దిగ్గజం షియోమీ మరో ఉత్పత్తిని తీసుకురాబోతుంది. గతేడాది ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్​ ఆవిష్కరణతో వ్యక్తిగత ఆరోగ్యం రంగంలో అడుగుపెట్టిన సంస్థ.. తాజాగా ఎలక్ట్రిక్​ బ్రష్​ను తీసుకురానుంది. ఈ మేరకు టీజర్​ను విడుదల చేసింది షియోమీ.

ఎంఐ అధికారిక ట్విట్టర్​ ఖాతాలో 'మీ వ్యక్తిగత దంతవైద్యుడు- ఫిబ్రవరి 20న వస్తున్నాడు' అనే ట్యాగ్​లైన్​తో ఈ వీడియోను పోస్ట్ చేసింది.

అనేక ప్రత్యేకలు..

ఎంఐ ఎలక్ట్రిక్​ బ్రష్​ను మాగ్నెటిక్​ లెవిటేషన్​ సోనిక్​ మోటార్​తో తయారుచేసింది షియోమీ. దీనిలో ఉండే అల్ట్రాసోనిక్​ సాంకేతికత వల్ల బ్రష్​ నిమిషానికి 31,000 సార్లు తిరుగుతుంది. మెటల్​ ఫ్రీ హెడ్​, అత్యుత్తమ నాణ్యత కలిగిన బ్రిజిల్స్​, ఐపీఎక్స్​7 వాటర్​ రెసిస్టెంట్ ఈ బ్రష్ ప్రత్యేకతలు.

మనకు కావాల్సిన విధంగా..​

చాలా సెన్సిటివ్​గా, పళ్లను లోతుగా శుభ్రపరచడానికి ఇది ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. అయితే ఇందుకు మన ఫోన్​లో యాప్​ ఇన్​స్టాల్​ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన మోడ్​లో పెట్టుకుని స్విచ్ ఆన్​ చేస్తే.. అదే శుభ్రం చేస్తుంది. ఈ యాప్​ మనం బ్రష్ చేసిన సమయాలు, విధానాన్ని డేటా రూపంలో నిక్షిప్తం చేస్తుంది. పళ్ల ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది.

18 రోజుల బ్యాటరీ లైఫ్​..

700ఏంఏహెచ్ లిథియం బ్యాటరీ కలిగిన ఈ టూత్ బ్రష్ కు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 18 రోజులు వాడుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. బ్యాటరీ స్థాయి సూచించే ఇండికేటర్​ కూడా ఉంటుంది.

చైనాలో 2017లోనే ఎంఐ ఎలక్ట్రిక్ బ్రష్​ అమ్మకాలు ప్రారంభించింది. 2018లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించినా.. భారత్​కు మాత్రం గురువారం రానుంది. దీని ధర సుమారు రూ.2,000 వరకు ఉండవచ్చని నిపుణుల అంచనా.

Last Updated : Mar 1, 2020, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.