ETV Bharat / business

భారత్​లో పెట్టుబడులకు ఫేస్​బుక్ అమితాసక్తి! - భారత్​లో ఫేస్​బుక్​ పెట్టుబడులు

భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్ తెలిపింది. చిన్న వ్యాపారులకు సాయమందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు వెల్లడించింది.

ఇండియా డిజిటల్​ ఎకానమీలో ఫేస్​బుక్​ పెట్టుబడులు!
We are deeply committed to investing in and nurturing India's digital economy: Facebook
author img

By

Published : Jul 2, 2020, 10:37 AM IST

సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​.. భారత్​ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. సాంకేతిక సామర్థ్యం పెంపు, మౌలిక సదుపాయాల కల్పనతో చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహమందించే విధంగా ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు ఫేస్​బుక్​ ఇండియా మేనేజింగ్​ డైరెక్టర్​ అజిత్​ మోహన్​ తెలిపారు. ఉద్యోగాల కల్పన కూడా ఈ పెట్టుబడుల ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు.

డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత్​ మిగత అన్ని దేశాలకన్నా ముందు వరుసలో ఉందని అజిత్​ మోహన్ వెల్లడించారు. భవిష్యత్​లో భారత రూపురేఖలను మార్చడంలో ఇది మేలు చేసే అంశమన్నారు.

సాంకేతికతను అందిపుచ్చుకోవడం వల్ల పారిశ్రామికంగా ఎన్నో మార్పులు వస్తాయని, ఇది భారత సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల కొత్త ఆవిష్కరణలు, వ్యాపారాలకు అవకాశాలు పెరిగి ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందనన్నారు. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: షేర్​చాట్ సూపర్​ హిట్- గంటకు 5 లక్షల డౌన్​లోడ్స్​

సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​.. భారత్​ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. సాంకేతిక సామర్థ్యం పెంపు, మౌలిక సదుపాయాల కల్పనతో చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహమందించే విధంగా ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు ఫేస్​బుక్​ ఇండియా మేనేజింగ్​ డైరెక్టర్​ అజిత్​ మోహన్​ తెలిపారు. ఉద్యోగాల కల్పన కూడా ఈ పెట్టుబడుల ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు.

డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత్​ మిగత అన్ని దేశాలకన్నా ముందు వరుసలో ఉందని అజిత్​ మోహన్ వెల్లడించారు. భవిష్యత్​లో భారత రూపురేఖలను మార్చడంలో ఇది మేలు చేసే అంశమన్నారు.

సాంకేతికతను అందిపుచ్చుకోవడం వల్ల పారిశ్రామికంగా ఎన్నో మార్పులు వస్తాయని, ఇది భారత సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల కొత్త ఆవిష్కరణలు, వ్యాపారాలకు అవకాశాలు పెరిగి ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందనన్నారు. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: షేర్​చాట్ సూపర్​ హిట్- గంటకు 5 లక్షల డౌన్​లోడ్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.