ETV Bharat / business

కేబుల్, డీటీహెచ్ బిల్ తగ్గే రోజు అతి దగ్గర్లోనే!

author img

By

Published : Sep 15, 2019, 5:45 PM IST

Updated : Sep 30, 2019, 5:43 PM IST

కేబుల్​ టీవీ, డీటీహెచ్​ల ఛార్జీలు తగ్గించేందుకు నిబంధనలను సవరించే దిశగా ట్రాయ్ అడుగులు వేస్తోంది. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన టారీఫ్​లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

కేబుల్​ టీవీ

కేబుల్ టీవీ, డీటీహెచ్​ వినియోగదారులకు టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్​' శుభవార్త తెలిపింది. టీవీ ఛానెళ్ల వీక్షణలో ఛార్జీల మోతపై పునరాలోచించనున్నట్లు ప్రకటించింది.

ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి కేబుల్ టీవీ, డీటీహెచ్​లకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది ట్రాయ్​. వీటి కారణంగా గతంతో పోలిస్తే.. ప్రస్తుతం కేబుల్​ టీవీ, డీటీహెచ్​ల నెలవారీ చందాలు భారీగా పెరిగాయి. ఈ విషయంపై చాలా మంది ధరలు తగ్గించాలని తమకు ఫిర్యాదు చేసినట్లు ట్రాయ్​ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా సవరణలు చేసేందుకు యోచిస్తున్నట్లు పేర్కొంది.

ట్రాయ్ ఏమందంటే..

కేబుల్​ టీవీ రంగంలో పారదర్శకతే ప్రాథమిక లక్ష్యంగా కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు ట్రాయ్​ స్పష్టం చేసింది. అయితే ఈ కారణంగా ధరలు పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించింది.

ముఖ్యంగా కొత్త నిబంధనలతో నిర్దిష్ట ఎన్​సీఎఫ్ ఛార్జీలను అమలు చేస్తోంది ట్రాయ్​. ఫలితంగా ప్రతీ వినియోగదారు ఏదైనా పే ఛానల్ చూడాలన్నా రూ.153 ఎన్​సీఎఫ్​ ఛార్జీని తప్పనిసరిగా చెల్లించాలి. ఇంతకుముందు ఇలాంటి నిబంధన లేదు. ఛార్జీలు పెరిగేందుకు ఇదీ ఒక కారణమైంది.

టీవీలు వీడి.. ఓటీటీల వైపు

అధిక ఛార్జీల కారణంగా చాలా మంది వినియోగదారులు లైవ్​ టీవీ ప్రసారాలు సన్​నెక్ట్స్, జీ5, హాట్​ స్టార్​, జియో టీవీ వంటి ఓటీటీ ప్లాట్​ ఫారాలపై చూసేందుకు మొగ్గుచూపుతున్నారు. వినియోగదారులకు ఈ యాప్​లు సౌలభ్యంగా ఉండటం వల్ల వాటి వినియోగం పెరిగి... డీటీహెచ్​, కేబుల్ టీవీల వినియోగం తగ్గింది. ఈ నేపథ్యంలో మళ్లీ ధరలు నియంత్రించి కేబుట్​ టీవీ, డీటీహెచ్​ల వినియోగం పెంచే దిశగా ట్రాయ్​ అడుగులు వేస్తోంది.

ట్రాయ్​ సవరణలపై అంచనాలు...

ట్రాయ్​ ప్రకటనతో ఎలాంటి సవరణలు ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో ప్రధానంగా లాంగ్​ టర్మ్ ప్లాన్​లు, మల్టీ టీవీలపై 'ఎన్​సీఎఫ్'​ ఛార్జీలు తగ్గించే అవకాశముందని​ వార్తా సంస్థలు అంటున్నాయి. అనవసర ఛానెళ్లు అందించి డీటీహెచ్​ ఆపరేటర్లు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ భావిస్తోందనే అంచనాలున్నాయి. ఇంకా ఎలాంటి మార్పులు చేస్తుందనే విషయం తెలియాలంటే ట్రాయ్​ ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి: 'వాట్సాప్​ సందేశాలు ట్రేస్​ చేయాల్సిందే'

కేబుల్ టీవీ, డీటీహెచ్​ వినియోగదారులకు టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్​' శుభవార్త తెలిపింది. టీవీ ఛానెళ్ల వీక్షణలో ఛార్జీల మోతపై పునరాలోచించనున్నట్లు ప్రకటించింది.

ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి కేబుల్ టీవీ, డీటీహెచ్​లకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది ట్రాయ్​. వీటి కారణంగా గతంతో పోలిస్తే.. ప్రస్తుతం కేబుల్​ టీవీ, డీటీహెచ్​ల నెలవారీ చందాలు భారీగా పెరిగాయి. ఈ విషయంపై చాలా మంది ధరలు తగ్గించాలని తమకు ఫిర్యాదు చేసినట్లు ట్రాయ్​ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా సవరణలు చేసేందుకు యోచిస్తున్నట్లు పేర్కొంది.

ట్రాయ్ ఏమందంటే..

కేబుల్​ టీవీ రంగంలో పారదర్శకతే ప్రాథమిక లక్ష్యంగా కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు ట్రాయ్​ స్పష్టం చేసింది. అయితే ఈ కారణంగా ధరలు పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించింది.

ముఖ్యంగా కొత్త నిబంధనలతో నిర్దిష్ట ఎన్​సీఎఫ్ ఛార్జీలను అమలు చేస్తోంది ట్రాయ్​. ఫలితంగా ప్రతీ వినియోగదారు ఏదైనా పే ఛానల్ చూడాలన్నా రూ.153 ఎన్​సీఎఫ్​ ఛార్జీని తప్పనిసరిగా చెల్లించాలి. ఇంతకుముందు ఇలాంటి నిబంధన లేదు. ఛార్జీలు పెరిగేందుకు ఇదీ ఒక కారణమైంది.

టీవీలు వీడి.. ఓటీటీల వైపు

అధిక ఛార్జీల కారణంగా చాలా మంది వినియోగదారులు లైవ్​ టీవీ ప్రసారాలు సన్​నెక్ట్స్, జీ5, హాట్​ స్టార్​, జియో టీవీ వంటి ఓటీటీ ప్లాట్​ ఫారాలపై చూసేందుకు మొగ్గుచూపుతున్నారు. వినియోగదారులకు ఈ యాప్​లు సౌలభ్యంగా ఉండటం వల్ల వాటి వినియోగం పెరిగి... డీటీహెచ్​, కేబుల్ టీవీల వినియోగం తగ్గింది. ఈ నేపథ్యంలో మళ్లీ ధరలు నియంత్రించి కేబుట్​ టీవీ, డీటీహెచ్​ల వినియోగం పెంచే దిశగా ట్రాయ్​ అడుగులు వేస్తోంది.

ట్రాయ్​ సవరణలపై అంచనాలు...

ట్రాయ్​ ప్రకటనతో ఎలాంటి సవరణలు ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో ప్రధానంగా లాంగ్​ టర్మ్ ప్లాన్​లు, మల్టీ టీవీలపై 'ఎన్​సీఎఫ్'​ ఛార్జీలు తగ్గించే అవకాశముందని​ వార్తా సంస్థలు అంటున్నాయి. అనవసర ఛానెళ్లు అందించి డీటీహెచ్​ ఆపరేటర్లు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ భావిస్తోందనే అంచనాలున్నాయి. ఇంకా ఎలాంటి మార్పులు చేస్తుందనే విషయం తెలియాలంటే ట్రాయ్​ ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి: 'వాట్సాప్​ సందేశాలు ట్రేస్​ చేయాల్సిందే'

AP Video Delivery Log - 0800 GMT News
Sunday, 15 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0759: Saudi Arabia Oil AP Clients Only 4230029
Saudi confirms attack halts 50% of oil production
AP-APTN-0747: Germany Protest AP Clients Only 4230027
Climate protesters block Frankfurt car show
AP-APTN-0641: Hong Kong Protest AP Clients Only 4230025
Hong Kong protesters gather at Causeway Bay
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.