ETV Bharat / business

మాంద్యం భయాలతో నష్టం- కుదేలైన ఎస్​ బ్యాంక్

ఆర్థిక వృద్ధి మందగమనం భయాలతో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 229 పాయింట్లు క్షీణించింది. నిప్టీ 73 పాయింట్లు కోల్పోయింది. ఎస్​ బ్యాంక్​ షేర్లు అత్యధికంగా 6 శాతానికి పైగా నష్టాన్ని నమోదు చేశాయి.

author img

By

Published : Nov 13, 2019, 4:12 PM IST

స్టాక్​ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనానికి సంకేతంగా సెప్టెంబరులో పారిశ్రామిక ఉత్పత్తి 4.3 శాతం తగ్గిందని అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. వీటికి తోడు ఎస్​బీఐ ఇటీవల విడుదల చేసిన సర్వేలో 2019-20 జీడీపీ 5 శాతానికే పరిమితం కావచ్చని అంచనా వేసింది. ఈ అంశాలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 229 పాయింట్లు కోల్పోయింది. చివరకు 40,116 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 73 పాయింట్లు క్షీణించి..11,840 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,447 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,016 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,947 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,823 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టీసీఎస్​ 3.76 శాతం, రిలయన్స్ 3.10 శాతం, హెచ్​యూఎల్ 0.63 శాతం, మారుతీ 0.31 శాతం, ఎన్​టీపీసీ 0.04 శాతం లాభాలను నమోదు చేశాయి. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి.

ఎస్​ బ్యాంక్​ 6.51 శాతం, ఎస్​బీఐ 3.69 శాతం, యాక్సిస్​ బ్యాంక్​ 3.18 శాతం, వేదాంత 2.82 శాతం, సన్​ఫార్మా 2.34 శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి: ఇకపై ఫేస్​బుక్​లోనూ ఆన్​లైన్​ చెల్లింపులు!

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనానికి సంకేతంగా సెప్టెంబరులో పారిశ్రామిక ఉత్పత్తి 4.3 శాతం తగ్గిందని అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. వీటికి తోడు ఎస్​బీఐ ఇటీవల విడుదల చేసిన సర్వేలో 2019-20 జీడీపీ 5 శాతానికే పరిమితం కావచ్చని అంచనా వేసింది. ఈ అంశాలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 229 పాయింట్లు కోల్పోయింది. చివరకు 40,116 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 73 పాయింట్లు క్షీణించి..11,840 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 40,447 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,016 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,947 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,823 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టీసీఎస్​ 3.76 శాతం, రిలయన్స్ 3.10 శాతం, హెచ్​యూఎల్ 0.63 శాతం, మారుతీ 0.31 శాతం, ఎన్​టీపీసీ 0.04 శాతం లాభాలను నమోదు చేశాయి. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి.

ఎస్​ బ్యాంక్​ 6.51 శాతం, ఎస్​బీఐ 3.69 శాతం, యాక్సిస్​ బ్యాంక్​ 3.18 శాతం, వేదాంత 2.82 శాతం, సన్​ఫార్మా 2.34 శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి: ఇకపై ఫేస్​బుక్​లోనూ ఆన్​లైన్​ చెల్లింపులు!

Rajouri (J-K), Nov 13 (ANI): To spread the message of peace, prosperity and brotherhood in the region, RR Romeo Force organised a cycling expedition for the youths of the state. The event was organised in Rajouri from Palma to Keri sector. To motivate the youth, General Officer Commanding (GOC) of Counter Insurgency Force (Romeo), Major General PS Bajwa and other officials also participated in the event.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.