ETV Bharat / business

నికర లాభాలతో దూసుకుపోతున్న ఎస్​బీఐ

author img

By

Published : Aug 2, 2019, 5:41 PM IST

2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎస్​బీఐ రూ.2,312 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. బ్యాంకుకు వస్తున్న అధిక ఆదాయాలకు తోడు, మొండి బకాయిలు తగ్గడం కూడా ఇందుకు కారణం.

నికర లాభాలతో దూసుకుపోతున్న ఎస్​బీఐ

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్​బీఐ (భారతీయ స్టేట్​ బ్యాంకు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.2,312 కోట్లు నికర లాభాన్ని ఆర్జించింది. అధిక ఆదాయానికి తోడు మొండి బకాయిల తగ్గింపు చర్యలే ఇందుకు కారణం.

2018-19 ఏప్రిల్-జూన్​ త్రైమాసికంలో ఎస్​బీఐ రూ.4,875.85 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం.

స్టాక్​ ఎక్స్ఛేంజ్​ల్లో ఎస్​బీఐ పోస్టు చేసిన ఆర్థిక ఫలితాల ప్రకారం, 2019-20లో బ్యాంకు స్థిర ఆదాయం రూ.70,653.23 కోట్లకు పెరిగింది.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.65,492.67 కోట్లుగా ఉంది.

ఎస్​బీఐకి.... గతేడాది జూన్​ చివరినాటికి 10.69 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్​పీఏ), ఈ జూన్ చివరినాటికి 7.53 శాతానికి తగ్గాయి. అదే విధంగా 2018లో 5.29 శాతంగా ఉన్న నికర ఎన్​పీఏలు, 2019 నాటికి 3.07 శాతానికి తగ్గాయి.

ప్రస్తుతం ఎస్​బీఐ షేర్లు బీఎస్​ఈలో ఒక్కోటి రూ.319.45 వద్ద ట్రేడవుతున్నాయి.

ఇదీ చూడండి: భారీ నష్టాల నుంచి లాభాల బాటలోకి..


దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్​బీఐ (భారతీయ స్టేట్​ బ్యాంకు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.2,312 కోట్లు నికర లాభాన్ని ఆర్జించింది. అధిక ఆదాయానికి తోడు మొండి బకాయిల తగ్గింపు చర్యలే ఇందుకు కారణం.

2018-19 ఏప్రిల్-జూన్​ త్రైమాసికంలో ఎస్​బీఐ రూ.4,875.85 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం.

స్టాక్​ ఎక్స్ఛేంజ్​ల్లో ఎస్​బీఐ పోస్టు చేసిన ఆర్థిక ఫలితాల ప్రకారం, 2019-20లో బ్యాంకు స్థిర ఆదాయం రూ.70,653.23 కోట్లకు పెరిగింది.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.65,492.67 కోట్లుగా ఉంది.

ఎస్​బీఐకి.... గతేడాది జూన్​ చివరినాటికి 10.69 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్​పీఏ), ఈ జూన్ చివరినాటికి 7.53 శాతానికి తగ్గాయి. అదే విధంగా 2018లో 5.29 శాతంగా ఉన్న నికర ఎన్​పీఏలు, 2019 నాటికి 3.07 శాతానికి తగ్గాయి.

ప్రస్తుతం ఎస్​బీఐ షేర్లు బీఎస్​ఈలో ఒక్కోటి రూ.319.45 వద్ద ట్రేడవుతున్నాయి.

ఇదీ చూడండి: భారీ నష్టాల నుంచి లాభాల బాటలోకి..


Vellore (TN), Aug 02 (ANI): A complaint has been registered against DMK leader MK Stalin and four other leaders for holding a poll meeting at a hall in Tamil Nadu's Vellore on Thursday without prior permission for the same. The authorities have also sealed the hall, where the meeting was held. The election to the Vellore Lok Sabha constituency, which was countermanded due to excess use of money power, will be held on August 5.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.