ETV Bharat / business

తెలుగు రాష్ట్రాలకు జియో అదనపు స్పెక్ట్రం

author img

By

Published : May 21, 2021, 8:52 PM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది టెలికాం దిగ్గజం జియో. రెండు రాష్ట్రాల్లో జియో నెట్​వర్క్​ను మరింత మెరుగుపరిచినట్లు తెలిపింది. ఇందుకోసం రెండు రాష్ట్రాల్లో 20 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రంను ప్రస్తుతమున్న సామర్థ్యానికి అదనంగా జోడించినట్లు వెల్లడించింది. దీనితో జియో డేటా స్పీడ్ దాదాపు రెట్టింపు కానున్నట్లు పేర్కొంది.

jIo capacity in Telangana
సామర్థ్యం పెంచుకున్న జియోనెట్​వర్క్​

వినియోగదారులకు మరింత మెరుగైన 4జీ సేవలను అందించేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ అంతటా 20 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రంను అదనంగా జోడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియోకు ఇప్పటి వరకు ఉన్న 40 మెగాహెర్ట్జ్‌ ​ స్పెక్ట్రం లభ్యత ఇప్పుడు 50 శాతం పెరిగి 60 మెగాహెర్ట్జ్‌ వరకు చేరుకుంది.

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్​) ఇటీవల నిర్వహించిన వేలంలో, ఏపీ టెలికాం సర్కిల్ కోసం 850 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్​లో 5 హెర్ట్జ్‌ ​; 1800 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్​లో 5 హెర్ట్జ్‌ ; 2300 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్​లో 10 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రంను జియో చేజిక్కించుకుంది. ఈ అదనపు స్పెక్ట్రంను రెండు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న తన అన్ని టవర్ సైట్‌లలో జియో విజయవంతంగా అనుసంధానం చేసింది.

ఫలితంగా, ఈ ప్రాంతంలోని వినియోగదారులందరికీ ఇక నుంచి మరింత మెరుగైన వేగవంతమైన 4G సేవలు అందుబాటులోకి రానున్నాయి. నెట్‌వర్క్ సామర్థ్యం 50 శాతం పెరగడం సహా పాటు డేటా వేగం కూడా రెట్టింపు కానుంది. ఏపీ టెలికాం సర్కిల్ (తెలంగాణ & ఏపీ)లో 3.16 కోట్లకు పైగా మొబైల్ చందాదారులతో పాటు దాదాపు 40% కస్టమర్ మార్కెట్ వాటాతో జియో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

ఇదీ చదవండి:టూల్​కిట్ వివాదం- ట్విట్టర్​కు కేంద్రం వార్నింగ్!

వినియోగదారులకు మరింత మెరుగైన 4జీ సేవలను అందించేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ అంతటా 20 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రంను అదనంగా జోడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియోకు ఇప్పటి వరకు ఉన్న 40 మెగాహెర్ట్జ్‌ ​ స్పెక్ట్రం లభ్యత ఇప్పుడు 50 శాతం పెరిగి 60 మెగాహెర్ట్జ్‌ వరకు చేరుకుంది.

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్​) ఇటీవల నిర్వహించిన వేలంలో, ఏపీ టెలికాం సర్కిల్ కోసం 850 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్​లో 5 హెర్ట్జ్‌ ​; 1800 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్​లో 5 హెర్ట్జ్‌ ; 2300 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్​లో 10 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రంను జియో చేజిక్కించుకుంది. ఈ అదనపు స్పెక్ట్రంను రెండు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న తన అన్ని టవర్ సైట్‌లలో జియో విజయవంతంగా అనుసంధానం చేసింది.

ఫలితంగా, ఈ ప్రాంతంలోని వినియోగదారులందరికీ ఇక నుంచి మరింత మెరుగైన వేగవంతమైన 4G సేవలు అందుబాటులోకి రానున్నాయి. నెట్‌వర్క్ సామర్థ్యం 50 శాతం పెరగడం సహా పాటు డేటా వేగం కూడా రెట్టింపు కానుంది. ఏపీ టెలికాం సర్కిల్ (తెలంగాణ & ఏపీ)లో 3.16 కోట్లకు పైగా మొబైల్ చందాదారులతో పాటు దాదాపు 40% కస్టమర్ మార్కెట్ వాటాతో జియో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

ఇదీ చదవండి:టూల్​కిట్ వివాదం- ట్విట్టర్​కు కేంద్రం వార్నింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.