ETV Bharat / business

స్వచ్ఛంద పదవీ విరమణకు 3 రోజుల్లో 40 వేల మంది!

author img

By

Published : Nov 8, 2019, 8:30 PM IST

కేవలం మూడు రోజుల్లోనే 40,000 మంది బీఎస్ఎన్​ఎల్​ ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి వెల్లడించారు. గడువులోపు 80 వేల మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని బీఎస్​ఎన్​ఎల్​ భావిస్తోంది.

బీఎస్​ఎన్​ఎల్ స్వచ్ఛంద పదవీ విరమణ

బీఎస్​ఎన్​ఎల్ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్​ఎస్​)కు భారీ స్పందన వస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. కేవలం మూడు రోజుల్లోనే 40,000 మంది వీఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.

అసలెందుకు వీఆర్​ఎస్​...

అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్​ఎన్​ఎల్, ఎంటీఎన్​ఎల్​ సంస్థలను గట్టెక్కించేందుకు కేంద్రం ఇటీవల రూ.69,000 కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించింది. వ్యయాలను తగ్గించుకునేందుకు ఆయా సంస్థల ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకానికి అక్టోబర్ 5 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి బీఎస్​ఎన్​ఎల్, ఎంటీఎన్ఎల్​లు. డిసెంబర్​ 3ను చివరి తేదిగా నిర్ణయించాయి.

"వీఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకున్న వారిలో.. 26 వేల మంది గ్రూప్ సీ క్యాడెర్​కు చెందిన వారు. అన్ని క్యాడెర్​ల నుంచి మంచి స్పందన వస్తోంది."
- పి.కె.పర్వార్​, బీఎస్​ఎన్​ఎల్​ ఛైర్మన్​

వీఆర్​ఎస్​ పథకాన్ని 70 నుంచి 80 వేల మంది ఉద్యోగులు వినియోగించుకుంటారని బీఎస్​ఎన్ఎల్​ భావిస్తోంది. దీని ద్వారా రూ.7,000 కోట్లు వ్యయంలో ఆదా అవుతుందని అంచనా.

బీఎస్​ఎన్​ఎల్ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్​ఎస్​)కు భారీ స్పందన వస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. కేవలం మూడు రోజుల్లోనే 40,000 మంది వీఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.

అసలెందుకు వీఆర్​ఎస్​...

అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్​ఎన్​ఎల్, ఎంటీఎన్​ఎల్​ సంస్థలను గట్టెక్కించేందుకు కేంద్రం ఇటీవల రూ.69,000 కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించింది. వ్యయాలను తగ్గించుకునేందుకు ఆయా సంస్థల ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకానికి అక్టోబర్ 5 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి బీఎస్​ఎన్​ఎల్, ఎంటీఎన్ఎల్​లు. డిసెంబర్​ 3ను చివరి తేదిగా నిర్ణయించాయి.

"వీఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకున్న వారిలో.. 26 వేల మంది గ్రూప్ సీ క్యాడెర్​కు చెందిన వారు. అన్ని క్యాడెర్​ల నుంచి మంచి స్పందన వస్తోంది."
- పి.కె.పర్వార్​, బీఎస్​ఎన్​ఎల్​ ఛైర్మన్​

వీఆర్​ఎస్​ పథకాన్ని 70 నుంచి 80 వేల మంది ఉద్యోగులు వినియోగించుకుంటారని బీఎస్​ఎన్ఎల్​ భావిస్తోంది. దీని ద్వారా రూ.7,000 కోట్లు వ్యయంలో ఆదా అవుతుందని అంచనా.

Gwalior (Madhya Pradesh), Nov 08 (ANI): Madhya Pradesh government has decided to introduce eggs in mid-day meal menu in the state. While the BJP government has opposed the decision of state government. Speaking on it, State Minister of Women and Child Development, Imarti Devi said, "We had consulted doctors before we decided to introduce eggs in midday meal menu in the state. In Maharashtra, which has a BJP govt, eggs are being served in midday meal since 2016. Their (BJP) main branch (RSS) which is headquartered in Maharashtra has not raised an issue over serving of eggs in midday meal in Maharashtra. Why are they doing politics over it issue in Madhya Pradesh."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.