ETV Bharat / business

ఆరామ్​కోపై కొవిడ్​ దెబ్బ- 2020 లాభం సగానికి పతనం - సౌదీ ఆరామ్​కో మొత్తం ఆదాయం

ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతిదారు సంస్థ సౌదీ ఆరామ్​కోపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా రవాణా స్తంభించడం వల్ల గతేడాది చమురు ధరలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. దీనితో 2020లో వార్షిక ప్రాతిపదికన సంస్థ లాభాలు 49 బిలియన్​ డాలర్లకు తగ్గినట్లు సౌదీ ఆరామ్​కో ప్రకటించింది. 2019లో సంస్థ లాభం 88.2 బిలియన్​ డాలర్లుగా నమోదవటం గమనార్హం.

Saudi Aramco sees 50 pc lose in annual Profits
కరోనా వల్ల సగానికి తగ్గిన ఆరామ్​కో లాభాలు
author img

By

Published : Mar 21, 2021, 4:54 PM IST

చమురు దిగ్గజం సౌదీ అరామ్‌కో 2020 లాభాలు దాదాపు సగానికి పడిపోయి 49 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో చమురు ధరలు, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. 2019, డిసెంబరులో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన తర్వాత సౌదీ అరామ్‌కో ప్రకటించిన రెండో వార్షిక ఫలితాలు ఇవి. 2018లో అరామ్‌కో 111.2 బిలియన్‌ డాలర్ల లాభాన్ని ఆర్జించగా.. 2019లో అది 88.2 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. ఇక 2020లో మరింత క్షీణించి 49 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

ముందు ప్రకటించినట్లుగా తమ కంపెనీ వాటాదార్లకు అయిదేళ్లపాటు ఏడాదికి 75 బిలియన్‌ డాలర్ల చొప్పున డివిడెండు చెల్లిస్తామని తెలిపింది. అయితే ఈ ఆదాయంలో చాలా వరకు సౌదీ ప్రభుత్వానికే వెళ్లనుంది. ఎందుకంటే కంపెనీలో 98 శాతం వాటాలు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి.

కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా రవాణా స్తంభించిపోయింది. దీనితో చమురు గిరాకీ తగ్గి ధరలు 30 ఏళ్ల కనిష్ఠానికి పతనమయ్యాయి. అయితే, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం, లాక్‌డౌన్‌ ముగియడం వల్ల అంతర్జాతీయంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. చమురు గిరాకీ పుంజుకుంది. రవాణా సదుపాయాలను పునరుద్ధరించారు. దీనితో చమురు ధరలు మరోసారి పెరుగుతున్నాయి.

ఇదీ చదవండి:టెలికాం ఛార్జీల పెంపు ఇప్పట్లో లేనట్లే!

చమురు దిగ్గజం సౌదీ అరామ్‌కో 2020 లాభాలు దాదాపు సగానికి పడిపోయి 49 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో చమురు ధరలు, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. 2019, డిసెంబరులో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన తర్వాత సౌదీ అరామ్‌కో ప్రకటించిన రెండో వార్షిక ఫలితాలు ఇవి. 2018లో అరామ్‌కో 111.2 బిలియన్‌ డాలర్ల లాభాన్ని ఆర్జించగా.. 2019లో అది 88.2 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. ఇక 2020లో మరింత క్షీణించి 49 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

ముందు ప్రకటించినట్లుగా తమ కంపెనీ వాటాదార్లకు అయిదేళ్లపాటు ఏడాదికి 75 బిలియన్‌ డాలర్ల చొప్పున డివిడెండు చెల్లిస్తామని తెలిపింది. అయితే ఈ ఆదాయంలో చాలా వరకు సౌదీ ప్రభుత్వానికే వెళ్లనుంది. ఎందుకంటే కంపెనీలో 98 శాతం వాటాలు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి.

కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా రవాణా స్తంభించిపోయింది. దీనితో చమురు గిరాకీ తగ్గి ధరలు 30 ఏళ్ల కనిష్ఠానికి పతనమయ్యాయి. అయితే, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం, లాక్‌డౌన్‌ ముగియడం వల్ల అంతర్జాతీయంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. చమురు గిరాకీ పుంజుకుంది. రవాణా సదుపాయాలను పునరుద్ధరించారు. దీనితో చమురు ధరలు మరోసారి పెరుగుతున్నాయి.

ఇదీ చదవండి:టెలికాం ఛార్జీల పెంపు ఇప్పట్లో లేనట్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.