దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ 'మారుతీ సుజుకీ ఇండియా' మరో రికార్డు సాధించింది. దేశీయ విపణిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2 కోట్ల మార్క్ను దాటినట్లు ప్రకటించింది.
దాదాపు 37 ఏళ్ల కాలంలో ఈ ఘనతను సాధించినట్లు ఆ సంస్థ పేర్కొంది. 'మారుతీ 800'తో భారత్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది మారుతీ సుజుకీ. ఈ సంస్థ తొలి కారును 1983 డిసెంబర్ 14న విక్రయించింది.
కోటి ప్యాసింజర్ వాహనాల విక్రయానికి 29 ఏళ్ల సమయం పట్టిందని.. కేవలం 8 ఏళ్ల సమయంలోనే మరో కోటి వాహనాలు విక్రయించి.. 2 కోట్ల మార్క్ను అందుకున్నట్లు పేర్కొంది మారుతీ సుజుకీ ఇండియా.
ఫ్యాక్టరీలో తయారైన.. సీఎన్జీ వాహనాలతో పాటు.. స్మార్ట్ హైబ్రిడ్ వాహనాలను, 8 బీఎస్ 6 మోడళ్లను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఎండీ కెనిచీ అయూకవా తెలిపారు.
సుజుకీ మోటార్స్ కార్పొరేషన్ నుంచి చిన్న సైజు.. విద్యుత్ వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు కెనిచీ.
ఇదీ చూడండి:మోటొ 'పాప్-అప్ సెల్ఫీ' ఫోన్.. మార్కెట్లోకి ఎప్పుడంటే?