ETV Bharat / business

మారటోరియంతో లక్ష్మీ విలాస్​ షేర్లు భారీ పతనం

author img

By

Published : Nov 18, 2020, 12:16 PM IST

కేంద్రం విధించిన మారటోరియంతో లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేర్లు బుధవారం కుప్పకులాయి. బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈల్లో 20 శాతం వరకు పడిపోయాయి.

Lakshmi Vilas Bank shares fall sharply
భారీగా పతనమైన లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేర్లు

లక్ష్మీ విలాస్​ బ్యాంక్ షేర్లు బుధవారం భారీగా పతనమయ్యాయి. బ్యాంక్​పై కేంద్రం 30 రోజుల మారటోరియం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

బీఎస్​ఈలో షేరు విలువ 20 శాతం తగ్గి.. ఒక్కో షేరు రూ.12.4 వద్ద కొనసాగుతోంది.

ఎన్​ఎస్​ఈలో 19.14 శాతం తగ్గిన ఒక్కో షేరు ప్రస్తుతం రూ.12.45 వద్ద ఉంది.

మారటోరియం ఎందుకు?

లక్ష్మీ విలాస్​ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో..ఆర్​బీఐ సూచనల మేరకు కేంద్రం మారటోరియం నిర్ణయం తీసుకుంది. 30 రోజుల పాటు ఈ మారటోరియం అమలులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. బ్యాంక్ బోర్డునూ రద్దు చేసింది. ఒక్కో డిపాజిటర్​కు రూ.25 వేల వరకు నగదు విత్​ డ్రా పరిమితి విధించింది.

లక్ష్మీ విలాస్​ బ్యాంక్ షేర్లు బుధవారం భారీగా పతనమయ్యాయి. బ్యాంక్​పై కేంద్రం 30 రోజుల మారటోరియం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

బీఎస్​ఈలో షేరు విలువ 20 శాతం తగ్గి.. ఒక్కో షేరు రూ.12.4 వద్ద కొనసాగుతోంది.

ఎన్​ఎస్​ఈలో 19.14 శాతం తగ్గిన ఒక్కో షేరు ప్రస్తుతం రూ.12.45 వద్ద ఉంది.

మారటోరియం ఎందుకు?

లక్ష్మీ విలాస్​ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో..ఆర్​బీఐ సూచనల మేరకు కేంద్రం మారటోరియం నిర్ణయం తీసుకుంది. 30 రోజుల పాటు ఈ మారటోరియం అమలులో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. బ్యాంక్ బోర్డునూ రద్దు చేసింది. ఒక్కో డిపాజిటర్​కు రూ.25 వేల వరకు నగదు విత్​ డ్రా పరిమితి విధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.