ETV Bharat / business

ఎయిర్​టెల్​పై ట్రాయ్​కు జియో ఫిర్యాదు

author img

By

Published : Dec 14, 2020, 10:18 PM IST

రైతు ఆందోళనలను సొమ్ము చేసుకునేందుకు భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియా లిమిటెడ్​లు దుర్మార్గమైన, విభజనపూరిత ప్రచారం నిర్వహిస్తున్నాయని ఆరోపించింది రిలయన్స్​ జియో. జియో నుంచి తమ నెట్​వర్క్​కు మారడం అనేది రైతు నిరసనలకు మద్దతు చర్యగా చూపుతూ ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్రాయ్​కి లేఖ రాసింది.

Reliance Jio
రిలయన్స్​ జియో

టెలికాం సంస్థలు భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియా లిమిటెడ్​పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​కు లేఖ రాసింది జియో. దుర్మార్గమైన, విభజనపూరిత ప్రచారం నిర్వహిస్తున్నాయని లేఖలో ఆరోపించింది. జియో నుంచి తమ నెట్​వర్క్​కు మారడం అనేది రైతు నిరసనలకు మద్దతు చర్యగా చూబుతూ.. ప్రజలను ప్రేరేపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రత్యుర్థుల చర్యలు జియో ఉద్యోగుల భద్రతను దెబ్బతీస్తాయని లేఖలో పేర్కొంది. రైతుల ఆందోళనలను సొమ్ము చేసుకునేందుకు అనైతిక, నిబంధనలకు విరుద్ధమైన మొబైల్​ పోర్టబిలిటీ ప్రచారం నిర్వహించటం పట్ల ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసింది జియో. ఇలాంటి ప్రచారం ఒక్క ఉత్తర భారతానికే పరిమితం కాలేదని, ఎంఎన్​పీ ద్వారా వినియోగదారులను పొందేందుకు దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది. ఎయిర్​టెల్​, వీఐఎల్​ ప్రచార సందేశాలను సూచిస్తూ తమ వినియోగాదారులు పెద్ద సంఖ్యలో నంబర్లు పోర్ట్​ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. టెలికాం టారిఫ్​ ఆర్డర్​-1999 నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని స్పష్టం చేసింది.

ఖండించిన ఎయిర్​టెల్​, వీఐఎల్​..

జియో చేసిన ఆరోపణలను ఖండించాయి ఎయిర్​టెల్​, వీఐఎల్​లు. ఈ మేరకు ట్రాయ్​కి లేఖ రాసింది భారతీ ఎయిర్​టెల్​. "ఈ నిరాధారమైన ఆరోపణలను మేము గట్టిగా తిరస్కరించాలనుకుంటున్నాం. మేము ఎల్లప్పుడూ మా వ్యాపారాన్ని మంచి వ్యక్తిత్వం, పారదర్శకతతో నిర్వహించాము," అని పేర్కొంది. నీతిగా ఉంటూనే వ్యాపారం చేయాలనేదానిని మా సంస్థ నమ్ముతుందన్నారు వొడాఫోన్​ ఐడియా ప్రతినిధి. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తమ మీద చేసే బాధ్యతారాహిత్యమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

నాలుగేళ్ల తర్వాత..

నాలుగేళ్ల తర్వాత.. ఈ ఏడాది సెప్టెంబర్​లో.. కొత్త వినియోగదారుల సంఖ్యలో జియోను వెనక్కి నెట్టింది ఎయిర్​టెల్​. ఈ ఏడాది సెప్టెంబర్​లో ఎయిర్​టెల్​ 37.7 లక్షల మంది కస్టమర్లను చేర్చుకోగా.. ఆ తర్వాత జియో 14.6 లక్షల కొత్త కస్టమర్లను పొందింది. ఆ తర్వాతి స్థానంలో బీఎస్​ఎన్​ఎల్​ 78,454తో ఉంది.

ఇదీ చూడండి: ఎయిర్​ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్​ బిడ్​

టెలికాం సంస్థలు భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియా లిమిటెడ్​పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​కు లేఖ రాసింది జియో. దుర్మార్గమైన, విభజనపూరిత ప్రచారం నిర్వహిస్తున్నాయని లేఖలో ఆరోపించింది. జియో నుంచి తమ నెట్​వర్క్​కు మారడం అనేది రైతు నిరసనలకు మద్దతు చర్యగా చూబుతూ.. ప్రజలను ప్రేరేపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రత్యుర్థుల చర్యలు జియో ఉద్యోగుల భద్రతను దెబ్బతీస్తాయని లేఖలో పేర్కొంది. రైతుల ఆందోళనలను సొమ్ము చేసుకునేందుకు అనైతిక, నిబంధనలకు విరుద్ధమైన మొబైల్​ పోర్టబిలిటీ ప్రచారం నిర్వహించటం పట్ల ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసింది జియో. ఇలాంటి ప్రచారం ఒక్క ఉత్తర భారతానికే పరిమితం కాలేదని, ఎంఎన్​పీ ద్వారా వినియోగదారులను పొందేందుకు దేశవ్యాప్తంగా తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది. ఎయిర్​టెల్​, వీఐఎల్​ ప్రచార సందేశాలను సూచిస్తూ తమ వినియోగాదారులు పెద్ద సంఖ్యలో నంబర్లు పోర్ట్​ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. టెలికాం టారిఫ్​ ఆర్డర్​-1999 నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని స్పష్టం చేసింది.

ఖండించిన ఎయిర్​టెల్​, వీఐఎల్​..

జియో చేసిన ఆరోపణలను ఖండించాయి ఎయిర్​టెల్​, వీఐఎల్​లు. ఈ మేరకు ట్రాయ్​కి లేఖ రాసింది భారతీ ఎయిర్​టెల్​. "ఈ నిరాధారమైన ఆరోపణలను మేము గట్టిగా తిరస్కరించాలనుకుంటున్నాం. మేము ఎల్లప్పుడూ మా వ్యాపారాన్ని మంచి వ్యక్తిత్వం, పారదర్శకతతో నిర్వహించాము," అని పేర్కొంది. నీతిగా ఉంటూనే వ్యాపారం చేయాలనేదానిని మా సంస్థ నమ్ముతుందన్నారు వొడాఫోన్​ ఐడియా ప్రతినిధి. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తమ మీద చేసే బాధ్యతారాహిత్యమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

నాలుగేళ్ల తర్వాత..

నాలుగేళ్ల తర్వాత.. ఈ ఏడాది సెప్టెంబర్​లో.. కొత్త వినియోగదారుల సంఖ్యలో జియోను వెనక్కి నెట్టింది ఎయిర్​టెల్​. ఈ ఏడాది సెప్టెంబర్​లో ఎయిర్​టెల్​ 37.7 లక్షల మంది కస్టమర్లను చేర్చుకోగా.. ఆ తర్వాత జియో 14.6 లక్షల కొత్త కస్టమర్లను పొందింది. ఆ తర్వాతి స్థానంలో బీఎస్​ఎన్​ఎల్​ 78,454తో ఉంది.

ఇదీ చూడండి: ఎయిర్​ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్​ బిడ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.