పన్ను ఎగవేత ఆరోపణలతో మీడియా దిగ్గజం జీ గ్రూప్ ముంబయి కార్యాలయంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఈ విషయాన్ని జీ గ్రూప్ కూడా ధ్రువీకరించింది.
ఐటీ అధికారులతో పూర్తిగా సహకరించినట్లు సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. వారికి కావాల్సిన అన్ని అధారాలను సమర్పించినట్లు వివరించారు. అయితే ముంబయి కార్యాలయంలో మాత్రమే సోదాలు నిర్వహించారా అనే విషయంపై స్పష్టతనివ్వలేదు.
ఐటీ అధికారుల ప్రకారం.. ముంబయితో పాటు దిల్లీలో ఉన్న జీ గ్రూప్ కార్యాలయంలోనూ సోదాలు చెపట్టినట్లు తెలుస్తోంది. సోదాల్లో తెలిసిన వివరాలు మాత్రం ఐటీ అధికారులు వెల్లడించలేదు.
ఇదీ చూడండి:ఈఎంఐ కట్టలేని స్థితికి 80% ఎంఎస్ఎంఈలు!