వాల్మార్ట్కు చెందిన దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులపై స్పందించింది. తమ సంస్థ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలు, భారతీయ చట్టాలకు లోబడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. నోటీసులపై ఈడీకి పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది.
నోటీసులు ఎందుకు?
2009 నుంచి 2015 మధ్య పలు విదేశీ సంస్థలు ఫ్లిప్కార్ట్లో పెట్టిన పెట్టుబడుల విషయంలో.. విదేశీ మారకపు చట్టాలను ఉల్లఘించారని ఈడీ ఇటీవల పేర్కొంది. ఈ మేరకు ఫ్లిప్కార్ట్ సహా.. ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇతర కంపెనీలకు రూ.10,600 కోట్ల షోకాజ్ నోటీసులు పంపింది ఈడీ.
ఇదీ చదవండి: యూజర్లకు వొడాఫోన్ ఐడియా హెచ్చరిక!