దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరోమోటోకార్ప్ 10 మోడళ్లను బీఎస్-6 నిబంధనల ప్రకారం త్వరలోనే ఆధునీకరించనున్నట్లు ప్రకటించింది. వీటిలో ఐదు మోడళ్లు ఎక్కువగా అమ్ముడయ్యే విభాగంలోనివేనని పేర్కొంది.
2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 ఉద్గార నియమాలు తప్పని సరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ గడువులోపే.. తమ మోడళ్లను బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా ఆధునీకరించనున్నట్లు కంపెనీ అధికారిక వర్గాలు తెలిపాయి.
కొత్త ఉత్పత్తులతో.. 2020 ఫిబ్రవరిలో జైపుర్లోని సంస్థ పరిశోధన కేంద్రం(సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ)లో భారీ ఎత్తున ఓ ప్రదర్శన నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
రానున్న 4-8 వారాల్లో కంపెనీ.. స్ల్పెండర్, హెచ్ఎఫ్ డీలక్స్, గ్లామర్, మ్యాస్ట్రో సహా మొత్తం 10 మోడళ్లను బీఎస్-6 వేరియంట్లలో అందుబాటులోకి తేనున్నట్లు హీరో మోటార్స్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ సంస్థ తొలి బీఎస్-6 ఉద్గార నియమాలు పాటించే బైక్.. 'స్ల్పెండర్ ఐ స్మార్ట్' విక్రయాలను నవంబర్ నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి:నవంబర్లో మూడేళ్ల గరిష్ఠానికి చిల్లర ద్రవ్యోల్బణం