బడ్జెట్ విమానయాన సంస్థ గో ఎయిర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం ప్రాథమిక దరఖాస్తు దాఖలు చేసింది. తాజాగా బ్రాండ్ పేరును గో ఫస్ట్గా మార్చుకున్న ఈ సంస్థ రూ.3,600 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు రానున్నట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గో ఎయిర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
వాడియా గ్రూప్ సంస్థ అయిన గో ఎయిర్ కార్యకాలపాలు ప్రారంభించి 15 ఏళ్లైంది. బడ్జెట్ ఎయిర్లైన్ సంస్థగా మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే సంస్థ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. దీనితో పాటు రూ.1,500 కోట్ల ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్ ద్వారా సేకరించాలని భావిస్తోంది.
ఐపీఓ ప్రక్రియ పూర్తయితే.. ఇండిగో, స్పైస్జెట్ తర్వాత భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యే మూడో సంస్థగా నిలవనుంది గో ఎయిర్.