ETV Bharat / business

కొన్ని వేల యాప్​లను సస్పెండ్ చేసిన ఫేస్​బుక్​!

వ్యక్తిగత సమాచార గోప్యత సమీక్షలో భాగంగా పదుల వేల సంఖ్యలో యాప్​లను సస్పెండ్​ చేసింది సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ ఫేస్​బుక్​. కేంబ్రిడ్జ్​ అనలిటికా వివాదం అనంతరం వ్యక్తిగత గోప్యత, సమాచార భద్రతపై వస్తున్న ఆరోపణల దృష్ట్యా ఇలా కఠిన చర్యలు తీసుకుంది.

author img

By

Published : Sep 21, 2019, 10:28 AM IST

Updated : Oct 1, 2019, 10:28 AM IST

కొన్ని వేల యాప్​లను సస్పెండ్ చేసిన ఫేస్​బుక్​!

ఫేస్​బుక్​ను తమ ప్లాట్​ఫామ్​లలో వినియోగించే పదుల వేల యాప్​లను సస్పెండ్​ చేస్తున్నట్లు ప్రకటించింది దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్​బుక్​. లక్షల మంది ఫేస్​బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చిన తర్వాత గతేడాది నుంచి సమాచార గోప్యతపై సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే భద్రతా ప్రమాణాలపై అనుమానాలున్న కారణంగా ఫేస్​బుక్​ను వాడకుండా కొన్ని వేల యాప్​లను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం తెలిపింది జుకర్​బర్గ్​ సంస్థ. ఈ యాప్​ల వల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ముప్పు లేదని.. తాము అడిగిన సమాచారాన్ని పొందుపరచని కారణంగానే వాటిపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది ఫేస్​బుక్​.

డేటా దుర్వినియోగంపై దుమారం

2016లో డొనాల్డ్​ ట్రంప్​కు అనుకూలంగా రాజకీయ ప్రచారం నిర్వహించిన కేంబ్రిడ్జ్​ అనలిటికా... 10 లక్షలమంది ఫేస్​బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని వచ్చిన ఆరోపణలు పెను దుమారం రేపాయి. ఈ విషయం వెల్లడైన తరువాత.. 2011 నాటి ఫేస్​బుక్​ గోప్యతా ఉల్లంఘనలపై విచారణను గతేడాది తిరిగి ప్రారంభించింది అమెరికా ఫెడరల్​ ట్రేడ్ కమిషన్. చివరకు పేస్​బుక్​కు 5 బిలియన్​ డాలర్ల జరిమానా విధించింది.

అనంతరం సమాచార గోప్యతపై సమీక్షలు నిర్వహిస్తోంది ఫేస్​బుక్​. ఏడాది క్రితం 400 యాప్​లను సస్పెండ్​ చేసింది. ఇప్పుడు ఆ చర్యలను మరింత కఠినతరం చేసింది. వేల యాప్​లను నిషేధించింది. వీటిపై విచారణ చేపడుతున్నామని తెలిపింది. భద్రతా ప్రమాణాలకు ముప్పు లేదని భావించిన యాప్​లపై సస్పెన్షన్ ఎత్తివేస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ప్రభుత్వ ఉద్దీపనలతో.. సామాన్యులకూ లాభాలే!

ఫేస్​బుక్​ను తమ ప్లాట్​ఫామ్​లలో వినియోగించే పదుల వేల యాప్​లను సస్పెండ్​ చేస్తున్నట్లు ప్రకటించింది దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్​బుక్​. లక్షల మంది ఫేస్​బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చిన తర్వాత గతేడాది నుంచి సమాచార గోప్యతపై సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే భద్రతా ప్రమాణాలపై అనుమానాలున్న కారణంగా ఫేస్​బుక్​ను వాడకుండా కొన్ని వేల యాప్​లను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం తెలిపింది జుకర్​బర్గ్​ సంస్థ. ఈ యాప్​ల వల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ముప్పు లేదని.. తాము అడిగిన సమాచారాన్ని పొందుపరచని కారణంగానే వాటిపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది ఫేస్​బుక్​.

డేటా దుర్వినియోగంపై దుమారం

2016లో డొనాల్డ్​ ట్రంప్​కు అనుకూలంగా రాజకీయ ప్రచారం నిర్వహించిన కేంబ్రిడ్జ్​ అనలిటికా... 10 లక్షలమంది ఫేస్​బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని వచ్చిన ఆరోపణలు పెను దుమారం రేపాయి. ఈ విషయం వెల్లడైన తరువాత.. 2011 నాటి ఫేస్​బుక్​ గోప్యతా ఉల్లంఘనలపై విచారణను గతేడాది తిరిగి ప్రారంభించింది అమెరికా ఫెడరల్​ ట్రేడ్ కమిషన్. చివరకు పేస్​బుక్​కు 5 బిలియన్​ డాలర్ల జరిమానా విధించింది.

అనంతరం సమాచార గోప్యతపై సమీక్షలు నిర్వహిస్తోంది ఫేస్​బుక్​. ఏడాది క్రితం 400 యాప్​లను సస్పెండ్​ చేసింది. ఇప్పుడు ఆ చర్యలను మరింత కఠినతరం చేసింది. వేల యాప్​లను నిషేధించింది. వీటిపై విచారణ చేపడుతున్నామని తెలిపింది. భద్రతా ప్రమాణాలకు ముప్పు లేదని భావించిన యాప్​లపై సస్పెన్షన్ ఎత్తివేస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ప్రభుత్వ ఉద్దీపనలతో.. సామాన్యులకూ లాభాలే!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 1, 2019, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.