ETV Bharat / business

'కరోనా వైరస్​తో కార్పొరేట్​ ఆదాయానికి గండి'

author img

By

Published : Mar 11, 2020, 10:59 AM IST

కరోనా ప్రభావంతో 2020లో కార్పొరేట్​ సంస్థల ఆదాయం 10 శాతం వరకు తగ్గుతుందని సిటీగ్రూప్ అంచనా వేసింది. చమురు సంక్షోభం కొనసాగితే ఈ పరిస్థితి మరింత దిగజారుతుందని అభిప్రాయపడింది.

corporate
కార్పొరేట్

ప్రపంచంలోని కీలకమైన కార్పొరేట్‌ కంపెనీల ఆదాయం 2020లో తగ్గవచ్చని సిటీగ్రూప్‌ అంచనా కట్టింది. ఈ తగ్గుదల 10శాతం వరకు ఉండొచ్చని పేర్కొంది. రష్యా, సౌదీ మధ్య చమురు యుద్ధం ఈ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని పేర్కొంది.

‘"కార్పొరేట్​ ఆదాయం మరింత తగ్గే ప్రమాదం ఉంది. ఫలితంగా 15-20శాతం ఈపీఎస్​పై ప్రభావం చూపవచ్చు. ఇది ప్రపంచ జీడీపీ వృద్ధిరేటులో 1.5శాతం వరకు ఉండవచ్చు."

- రాబర్ట్‌ బక్‌ల్యాండ్‌, సిటీగ్రూప్‌ విశ్లేషకుడు

ముఖ్యంగా కరోనావైరస్‌ దెబ్బకు చమురు ధరలు పడిపోవడం వల్ల సిటీగ్రూప్‌ ఈ అంచనాకు వచ్చింది. గత వారం రాబర్ట్‌ బక్‌ల్యాండ్‌ మరో కీలక విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచ ఆర్థిక వృద్ధిపై 2 శాతం ఉంటే గ్లోబల్‌ ఈపీఎస్‌ 10 శాతం వరకు దెబ్బతినవచ్చని తెలిపారు.

ఇదీ చూడండి: దిగ్గజ కంపెనీలపై కరోనా పిడుగు!

ప్రపంచంలోని కీలకమైన కార్పొరేట్‌ కంపెనీల ఆదాయం 2020లో తగ్గవచ్చని సిటీగ్రూప్‌ అంచనా కట్టింది. ఈ తగ్గుదల 10శాతం వరకు ఉండొచ్చని పేర్కొంది. రష్యా, సౌదీ మధ్య చమురు యుద్ధం ఈ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని పేర్కొంది.

‘"కార్పొరేట్​ ఆదాయం మరింత తగ్గే ప్రమాదం ఉంది. ఫలితంగా 15-20శాతం ఈపీఎస్​పై ప్రభావం చూపవచ్చు. ఇది ప్రపంచ జీడీపీ వృద్ధిరేటులో 1.5శాతం వరకు ఉండవచ్చు."

- రాబర్ట్‌ బక్‌ల్యాండ్‌, సిటీగ్రూప్‌ విశ్లేషకుడు

ముఖ్యంగా కరోనావైరస్‌ దెబ్బకు చమురు ధరలు పడిపోవడం వల్ల సిటీగ్రూప్‌ ఈ అంచనాకు వచ్చింది. గత వారం రాబర్ట్‌ బక్‌ల్యాండ్‌ మరో కీలక విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచ ఆర్థిక వృద్ధిపై 2 శాతం ఉంటే గ్లోబల్‌ ఈపీఎస్‌ 10 శాతం వరకు దెబ్బతినవచ్చని తెలిపారు.

ఇదీ చూడండి: దిగ్గజ కంపెనీలపై కరోనా పిడుగు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.