ETV Bharat / business

New IT rules: పోలీసుల బెదిరింపులపై ట్విట్టర్ ఆందోళన!

మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫామ్​ ట్విట్టర్​ (Twitter​) భారత్​లోని తమ ఉద్యోగుల భద్రత గురించి ఆందోళనలో ఉన్నట్లు తెలిపింది. భాజపా నేతలు ఇటీవల చేసిన ట్వీట్​లకు మ్యానుపులేటెడ్ మీడియా ట్యాగ్ ఇచ్చిన తర్వాత.. పోలీసులు బెదిరింపులకు పాల్పడుతుండటం ఇందుకు కారణమని చెప్పింది.

author img

By

Published : May 27, 2021, 2:03 PM IST

Twitter Concerned on Indian Staff
ట్విట్టర్​కు బెదిరింపులు

భాజపా నేతల ట్వీట్​లకు మ్యానుపులేటెడ్ మీడియా (Manipulated media) ట్యాగ్​ ఇచ్చిన తర్వాత.. పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫామ్ ట్విట్టర్ (Twitter)​ ఆరోపించింది. 'కొవిడ్​ టూల్​కిట్​(COVID Toolkit)' ఫిర్యాదు పేరుతో.. సమాచారం కావాలాని దిల్లీ పోలీసులు తమకు నోటీసులిచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్​లో తమ ఉద్యోగుల పట్ల ఆందోళనగా చెందుతున్నట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

కొత్త నిబంధనలు పాటిస్తాం కానీ..

భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనలను (New IT rules) పాటించేందుకు ప్రయత్నిస్తామని ట్విట్టర్​ వెల్లడించింది. అయితే కొత్త ఐటీ రూల్స్​లో భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించేలా ఉన్న కొన్ని నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వివరించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లుగానే భావ ప్రకటన స్వేచ్ఛ, పారదర్శకత, గోప్యతకు(Privacy) ప్రాధాన్యమిస్తూ కార్యకలాపాలు సాగించనున్నట్లు ట్విట్టర్ పేర్కొంది.

ఇదీ చదవండి:టూల్​కిట్ వివాదం- ట్విట్టర్​కు కేంద్రం వార్నింగ్!

భాజపా నేతల ట్వీట్​లకు మ్యానుపులేటెడ్ మీడియా (Manipulated media) ట్యాగ్​ ఇచ్చిన తర్వాత.. పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫామ్ ట్విట్టర్ (Twitter)​ ఆరోపించింది. 'కొవిడ్​ టూల్​కిట్​(COVID Toolkit)' ఫిర్యాదు పేరుతో.. సమాచారం కావాలాని దిల్లీ పోలీసులు తమకు నోటీసులిచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్​లో తమ ఉద్యోగుల పట్ల ఆందోళనగా చెందుతున్నట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

కొత్త నిబంధనలు పాటిస్తాం కానీ..

భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనలను (New IT rules) పాటించేందుకు ప్రయత్నిస్తామని ట్విట్టర్​ వెల్లడించింది. అయితే కొత్త ఐటీ రూల్స్​లో భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించేలా ఉన్న కొన్ని నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వివరించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లుగానే భావ ప్రకటన స్వేచ్ఛ, పారదర్శకత, గోప్యతకు(Privacy) ప్రాధాన్యమిస్తూ కార్యకలాపాలు సాగించనున్నట్లు ట్విట్టర్ పేర్కొంది.

ఇదీ చదవండి:టూల్​కిట్ వివాదం- ట్విట్టర్​కు కేంద్రం వార్నింగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.