ETV Bharat / business

భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం కసరత్తు! - వాణిజ్య వార్తలు

ప్రభుత్వాధీనంలోని సంస్థల్లో వాటాను తగ్గించుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అవసరాన్ని బట్టి 51 శాతం కన్నా తక్కువకు ప్రభుత్వ వాటాను కుదించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రంకసరత్తు
author img

By

Published : Nov 20, 2019, 6:01 AM IST

ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను 51 శాతానికన్నా తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ త్వరలో ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు సమాచారం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో.. ప్రభుత్వ రంగ జనరల్ బీమా సంస్థల విలీనం అంశమూ చర్చకు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

2018-19 బడ్జెట్​ సమావేశాల్లోనే.. ప్రభుత్వ రంగ జనరల్ ఇన్స్యూరెన్స్​ సంస్థలను విలీనం చేసి.. ఈ సంస్థను స్టాక్ మార్కెట్​లో నమోదు చేయాలని ప్రతిపాదన వచ్చింది.

ప్రభుత్వ రంగ ఇన్స్యూరెన్స్​ సంస్థలైన నేషనల్​ ఇన్స్యూరెన్స్​ కంపెనీ, యునైటెడ్​ ఇండియా ఇన్స్యూరెన్స్, ఓరియంటల్ ఇన్స్యూరెన్స్​ కంపెనీల విలీన అంశం ముందుకు సాగే అవకాశముందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ గతవారం తెలిపారు.

2019-20 బడ్జెట్ ప్రసంగంలో​.. ప్రభుత్వం ఆర్థికేతర రంగాల్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే విధానాన్ని అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు సీతారామన్. వాటిల్లో పెట్టుబడులను 51 శాతానికి తగ్గకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు.

అయితే ప్రస్తుతం ఇంకా అవసరమైతే ప్రభుత్వ సంస్థల నుంచి 51 శాతానికి కన్నా తక్కువగా ప్రభుత్వ వాటా కుదించుకునే విషయాన్ని పరిగణించే అవకాశమున్నట్లు ఆమె పేర్కొన్నారు. వాటా 51 శాతానికి తగ్గినా.. ఆయా సంస్థలు ప్రభుత్వాధీనంలోనే ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

కంపెనీ చట్టం సెక్షన్​ 241 సవరణ ద్వారా ఇది సాధ్యపడనుంది.

గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో..

2018-19 ఆర్థిక సంవత్సరంలో.. ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్రం రూ.84,972 కోట్లు ఆర్జించింది.
2017-18 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.1,00,056 కోట్లు గడించింది.

ఇదీ చూడండి: ప్రపంచ ఖరీదైన నివాస నగరాల్లో దిల్లీకి 9వ ర్యాంక్​

ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను 51 శాతానికన్నా తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ త్వరలో ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు సమాచారం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో.. ప్రభుత్వ రంగ జనరల్ బీమా సంస్థల విలీనం అంశమూ చర్చకు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

2018-19 బడ్జెట్​ సమావేశాల్లోనే.. ప్రభుత్వ రంగ జనరల్ ఇన్స్యూరెన్స్​ సంస్థలను విలీనం చేసి.. ఈ సంస్థను స్టాక్ మార్కెట్​లో నమోదు చేయాలని ప్రతిపాదన వచ్చింది.

ప్రభుత్వ రంగ ఇన్స్యూరెన్స్​ సంస్థలైన నేషనల్​ ఇన్స్యూరెన్స్​ కంపెనీ, యునైటెడ్​ ఇండియా ఇన్స్యూరెన్స్, ఓరియంటల్ ఇన్స్యూరెన్స్​ కంపెనీల విలీన అంశం ముందుకు సాగే అవకాశముందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ గతవారం తెలిపారు.

2019-20 బడ్జెట్ ప్రసంగంలో​.. ప్రభుత్వం ఆర్థికేతర రంగాల్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే విధానాన్ని అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు సీతారామన్. వాటిల్లో పెట్టుబడులను 51 శాతానికి తగ్గకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు.

అయితే ప్రస్తుతం ఇంకా అవసరమైతే ప్రభుత్వ సంస్థల నుంచి 51 శాతానికి కన్నా తక్కువగా ప్రభుత్వ వాటా కుదించుకునే విషయాన్ని పరిగణించే అవకాశమున్నట్లు ఆమె పేర్కొన్నారు. వాటా 51 శాతానికి తగ్గినా.. ఆయా సంస్థలు ప్రభుత్వాధీనంలోనే ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

కంపెనీ చట్టం సెక్షన్​ 241 సవరణ ద్వారా ఇది సాధ్యపడనుంది.

గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో..

2018-19 ఆర్థిక సంవత్సరంలో.. ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్రం రూ.84,972 కోట్లు ఆర్జించింది.
2017-18 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.1,00,056 కోట్లు గడించింది.

ఇదీ చూడండి: ప్రపంచ ఖరీదైన నివాస నగరాల్లో దిల్లీకి 9వ ర్యాంక్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kyiv - 19 November 2019
1. SOUNDBITE (German) Heiko Maas, German Foreign Minister:
"We have talked a lot in the past about the support Germany has given Ukraine in recent years. I have just said this before about 1.2 billion euros (1.33 billion US dollars) in civil and economic projects. We will continue to do so. In January, a whole series of State Secretaries from the German Federal Government will come to Ukraine to agree on further bilateral projects. You can rely on that in Ukraine, and I am sure that this will be recognised within Ukraine. Just like our commitment in Normandy format. And in the talks we have had I have not seen any reason why there should be any doubt about this assessment and about this fact."
2. Maas and Prystaiko shaking hands
STORYLINE:
German Foreign Minister Heiko Maas met his Ukrainian counterpart Vadym Volodymyrovych Prystaiko in Kyiv on Tuesday.
Speaking during a news conference, Maas announced that in January a "whole series" of State Secretaries from the German Federal Government would visit Ukraine to agree on further bilateral projects.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.