ETV Bharat / business

విక్రయానికి నోచుకోని ఇళ్ల సంఖ్య హైదరాబాద్​లోనే తక్కువ - వ్యాపార వార్తలు

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రియల్టీ రంగ అనిశ్చితి కారణంగా జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.56 లక్షల ఇళ్లు విక్రయానికి నోచుకోలేదు. ఇలా బెంగళూరులో విక్రయమవని ఇళ్లు అమ్ముడయ్యేందుకు అత్యల్పంగా 15 నెలలు.. దిల్లీకి అత్యధికంగా 44 నెలల సమయం పడుతుందని స్థిరాస్తి సంస్థ 'అనరాక్' అంచనా వేసింది.

రియల్టీ రంగం
author img

By

Published : Nov 13, 2019, 8:56 PM IST

Updated : Nov 14, 2019, 11:42 AM IST

గత కొన్ని నెలలుగా దేశంలో గృహ నిర్మాణ రంగంలో అనిశ్చితి నెలకొంది. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో నిర్మాణం పూర్తయిన ఇళ్లు చాలా వరకు అమ్ముడవ్వలేదు. వీటిని విక్రయించేందుకు ఆయా నగరాలకు ఎంత సమయం పడుతుందనే దానిపై ప్రముఖ స్థిరాస్తి రంగ సంస్థ 'అనరాక్'​ ఓ నివేదిక విడుదల చేసింది.

అనరాక్ నివేదిక ప్రకారం హైదరాబాద్​, దిల్లీ (ఎన్​సీఆర్​), ముంబయి (ఎంఎంఆర్​), కోల్​కతా, చెన్నై, బెంగళూరు, పుణెల్లో.. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం 6.56 లక్షల ఇళ్లు అమ్ముడవకుండా మిగిలిపోయాయని తెలిసింది.

బెంగళూర్​లో వేగంగా..

సెప్టెంబర్​ నాటికి మూడు నెలల కాలంలో విక్రయం కాకుండా మిగిలిపోయిన ఇళ్లను అమ్మేందుకు 15 నెలల సమయం పడుతుందని అనరాక్ వెల్లడించింది. ఇతర నగరాలతో పోలిస్తే ఇదే అత్యల్ప సమయంగా అనరాక్​ పేర్కొంది. విక్రయమవ్వకుండా మిగిలిపోయిన ఇళ్లను అమ్మేందుకు దిల్లీకి అత్యధికంగా 44 నెలల సమయం పడుతుందని అంచనా వేసింది.

నగరాల వారీగా అమ్ముడవ్వని గృహాలు..

  • ముంబయి (ఎంఎంఆర్​)- 2.21 లక్షలు
  • దిల్లీ (ఎన్​సీఆర్​)- 1.78 లక్షలు
  • పుణే- 92,560
  • బెంగళూరు- 63,540
  • కోల్​కతా- 45,570
  • చెన్నై- 31,380
  • హైదరాబాద్- 23,890

ఇదీ చూండండి: అక్టోబర్​లో 4.62 శాతానికి రిటైల్​ ద్రవ్యోల్బణం

గత కొన్ని నెలలుగా దేశంలో గృహ నిర్మాణ రంగంలో అనిశ్చితి నెలకొంది. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో నిర్మాణం పూర్తయిన ఇళ్లు చాలా వరకు అమ్ముడవ్వలేదు. వీటిని విక్రయించేందుకు ఆయా నగరాలకు ఎంత సమయం పడుతుందనే దానిపై ప్రముఖ స్థిరాస్తి రంగ సంస్థ 'అనరాక్'​ ఓ నివేదిక విడుదల చేసింది.

అనరాక్ నివేదిక ప్రకారం హైదరాబాద్​, దిల్లీ (ఎన్​సీఆర్​), ముంబయి (ఎంఎంఆర్​), కోల్​కతా, చెన్నై, బెంగళూరు, పుణెల్లో.. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం 6.56 లక్షల ఇళ్లు అమ్ముడవకుండా మిగిలిపోయాయని తెలిసింది.

బెంగళూర్​లో వేగంగా..

సెప్టెంబర్​ నాటికి మూడు నెలల కాలంలో విక్రయం కాకుండా మిగిలిపోయిన ఇళ్లను అమ్మేందుకు 15 నెలల సమయం పడుతుందని అనరాక్ వెల్లడించింది. ఇతర నగరాలతో పోలిస్తే ఇదే అత్యల్ప సమయంగా అనరాక్​ పేర్కొంది. విక్రయమవ్వకుండా మిగిలిపోయిన ఇళ్లను అమ్మేందుకు దిల్లీకి అత్యధికంగా 44 నెలల సమయం పడుతుందని అంచనా వేసింది.

నగరాల వారీగా అమ్ముడవ్వని గృహాలు..

  • ముంబయి (ఎంఎంఆర్​)- 2.21 లక్షలు
  • దిల్లీ (ఎన్​సీఆర్​)- 1.78 లక్షలు
  • పుణే- 92,560
  • బెంగళూరు- 63,540
  • కోల్​కతా- 45,570
  • చెన్నై- 31,380
  • హైదరాబాద్- 23,890

ఇదీ చూండండి: అక్టోబర్​లో 4.62 శాతానికి రిటైల్​ ద్రవ్యోల్బణం

New Delhi, Nov 13 (ANI): Supreme Court to pronounce its verdict in the Sabarimala review petition on Thursday (November 14). The review petition is against the verdict allowing entry of women of all age groups into the Sabarimala temple. "We are all hopeful that positive verdict will come. We are not saying that faith is above law or constitution. We are only asking for deities' rights and devotees rights under Article 25. We have plan B and ready with curative petition. We will request for ordinance from central government which says that Sabarimala is a denomination, said social activist Rahul Easwar. Last year, the top court had ordered that women of all ages must be allowed into the famous Ayyappa shrine in Kerala, ending a centuries-old ban on women and girls between 10 and 50 years.As the verdict sparked a series of protests, The Travancore Devaswom Board (TDB), which manages the Sabarimala temple, argued that the court cannot intervene with centuries-old belief. However, the Kerala government had supported the verdict.

Last Updated : Nov 14, 2019, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.