ETV Bharat / business

జియోతో పోరుకు ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్ రె'ఢీ​'..! - ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్​ న్యూస్​

ప్రపంచాన్ని కళ్ల ముందుంచేందుకు రిలయన్స్​ సంస్థ.. బ్రాడ్​బ్యాండ్​, ల్యాండ్​లైన్​, టీవీ వంటివి ఒకే ప్యాకేజీలో ఇస్తోంది. ఈ ప్రకటనతో మిగిలిన నెట్​వర్క్​లు బెంబేలెత్తిపోయాయి. జియో గిగాఫైబర్​ను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీ ఎయిర్​టెల్​ 'ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్ ఫైబర్​'​ ద్వారా స్మార్ట్​ హోమ్స్​​ సొల్యూషన్స్​ను తీసుకొస్తుంది. త్వరలో జరగనున్న ఇండియా మొబైల్​ కాంగ్రెస్ ​(ఐఎంసీ)-2019 కార్యక్రమంలో దీనిని ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది.

జియోతో పోరుకు ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్ రె'ఢీ​'..!
author img

By

Published : Oct 12, 2019, 4:05 PM IST

భారత టెలికాం రంగంలో విప్లవం సృష్టించిన జియో... గిగాఫైబర్ ప్రకటనతో ఇతర నెట్​వర్క్​లకు పెద్ద సవాల్​ విసిరింది. ఈ​ పోటీని తట్టుకునేందుకు ఇతర టెలికాం సంస్థలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. గిగాఫైబర్​ ధాటికి తేలిపోకుండా ఉండేందుకు భారతీ ఎయిర్​టెల్​ 'ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్​ ఫైబర్​' తీసుకొచ్చింది. దీని ద్వారా డీటీహెచ్, బ్రాడ్​బ్యాండ్​, టీవీ వంటి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది.

సంప్రదాయ వినియోగదారులు చేజారిపోకుండా ఉండేందుకు, ఇతర వినియోగదారులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఎక్స్​ట్రీమ్​ ఫైబర్​ను మరింత ప్రభావవంతంగా చేసేందుకు ఐఓటీ సొల్యూషన్స్​ అందించేందుకు కసరత్తు చేస్తోంది.

త్వరలో జరగబోయే ఇండియా మొబైల్​ కాంగ్రెస్​ (ఐఎంసీ)-2019 కార్యక్రమంలో టెలికాం ఆపరేటర్లు.. నూతన ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా భారతీ ఎయిర్​టెల్​ లైవ్-5జీ నెట్​వర్క్​పై డెమోను ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. దానితో పాటు స్మార్ట్​ బిజినెస్​, స్మార్ట్​ సిటీస్​ ప్రాజెక్ట్​ వంటివి ప్రదర్శించనుంది.

ఎయిర్​టెల్​ ప్రదర్శించే 5జీ సాంకేతికతలో లైసెన్స్​డ్​ అసిస్టెడ్​ యాక్సెస్​ (ఎల్​ఏఏ), డిజిటల్​ ఇండియాలో ఏ విధంగా భాగస్వాములు అవుతారనే అంశాలు ఉండనున్నాయి. 'ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్​ ' కింద తీసుకురానున్న స్మార్ట్​ హోమ్స్​​ సొల్యూషన్స్​ను అందించేందుకు ఐఓటీ సొల్యూషన్స్​పై పనిచేస్తున్నట్లు తెలిపింది. మరింత శక్తిమంతంగా పనిచేసే దిశగా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్​ అనేది సంస్థ స్మార్ట్​ హోమ్స్​​ సొల్యూషన్​లోని భాగం​. బ్రాడ్​ బ్యాండ్​, డీటీహెచ్​, టీవీ వంటివి ఒకే దానిలో అందిస్తోంది. స్మార్ట్​ హోమ్​ కోసం ఐఓటీ సేవలను ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్​ ద్వారా తీసుకురానుంది.

5జీ నెట్​వర్క్​..

ప్రస్తుతం దేశంలో 4జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2020 అర్ధభాగంలో లేక 2021 ప్రారంభంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలో ప్రభుత్వం నిర్వహించే 5జీ స్పెక్ట్రం వేలానికి ప్రస్తుతం రిలయన్స్​ జియో సహా దాదాపు అన్ని సంస్థలు వ్యతిరేకంగా ఉన్నాయి. స్పెక్ట్రం కేటాయింపులు జరిగే వరకు, టెలికాం సంస్థలు దేశంలో 5జీ సేవలను ప్రారంభించలేవు.

స్మార్ట్​ సిటీస్​ ప్రాజెక్ట్​...

భారతీ ఎయిర్​టెల్​ ఇప్పటికే స్మార్ట్​ సిటీస్​ ప్రాజెక్ట్​పై పనిచేస్తోంది. హరియాణాలోని ఫరీదాబాద్​లో స్మార్ట్​ సిటీ సొల్యూషన్స్​ను ప్రారంభించింది. ఇందులో ట్రాఫిక్​ నియంత్రణ వ్యవస్థ, నగరవ్యాప్తంగా నిఘా, కాలుష్య తనిఖీ, ట్రాఫిక్​ అమలు వ్యవస్థ, వీధి దీపాలు, స్మార్ట్​ సిగ్నల్​ విధానాలు ఉన్నాయి. ఇందులోని కొన్నింటిని ఐఎంసీ-2019లో ప్రదర్శించనుంది ఎయిర్​టెల్​. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది.

కనెక్టెడ్​ వాహనాలు​..

నెట్​వర్క్​కు అనుసంధానమైన వాహనాలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది ఎయిర్​టెల్​. భారత్​లో మొట్టమొదటి ఇంటర్​నెట్​ కార్​-ఎంజీ హెక్టార్​ను తీసుకొచ్చింది. భవిష్యత్తు తరం ద్విచక్రవాహనాలు, కార్లను శక్తిమంతం చేయడానికి ఇతర ఆటోమోటివ్​ ఓఈఎంలతో పనిచేస్తోంది.

ఇదీ చూడండి: ట్రాఫిక్​ చలానా రాశారని రోడ్డుపై ఆత్మహత్య!

భారత టెలికాం రంగంలో విప్లవం సృష్టించిన జియో... గిగాఫైబర్ ప్రకటనతో ఇతర నెట్​వర్క్​లకు పెద్ద సవాల్​ విసిరింది. ఈ​ పోటీని తట్టుకునేందుకు ఇతర టెలికాం సంస్థలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. గిగాఫైబర్​ ధాటికి తేలిపోకుండా ఉండేందుకు భారతీ ఎయిర్​టెల్​ 'ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్​ ఫైబర్​' తీసుకొచ్చింది. దీని ద్వారా డీటీహెచ్, బ్రాడ్​బ్యాండ్​, టీవీ వంటి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది.

సంప్రదాయ వినియోగదారులు చేజారిపోకుండా ఉండేందుకు, ఇతర వినియోగదారులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఎక్స్​ట్రీమ్​ ఫైబర్​ను మరింత ప్రభావవంతంగా చేసేందుకు ఐఓటీ సొల్యూషన్స్​ అందించేందుకు కసరత్తు చేస్తోంది.

త్వరలో జరగబోయే ఇండియా మొబైల్​ కాంగ్రెస్​ (ఐఎంసీ)-2019 కార్యక్రమంలో టెలికాం ఆపరేటర్లు.. నూతన ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా భారతీ ఎయిర్​టెల్​ లైవ్-5జీ నెట్​వర్క్​పై డెమోను ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. దానితో పాటు స్మార్ట్​ బిజినెస్​, స్మార్ట్​ సిటీస్​ ప్రాజెక్ట్​ వంటివి ప్రదర్శించనుంది.

ఎయిర్​టెల్​ ప్రదర్శించే 5జీ సాంకేతికతలో లైసెన్స్​డ్​ అసిస్టెడ్​ యాక్సెస్​ (ఎల్​ఏఏ), డిజిటల్​ ఇండియాలో ఏ విధంగా భాగస్వాములు అవుతారనే అంశాలు ఉండనున్నాయి. 'ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్​ ' కింద తీసుకురానున్న స్మార్ట్​ హోమ్స్​​ సొల్యూషన్స్​ను అందించేందుకు ఐఓటీ సొల్యూషన్స్​పై పనిచేస్తున్నట్లు తెలిపింది. మరింత శక్తిమంతంగా పనిచేసే దిశగా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్​ అనేది సంస్థ స్మార్ట్​ హోమ్స్​​ సొల్యూషన్​లోని భాగం​. బ్రాడ్​ బ్యాండ్​, డీటీహెచ్​, టీవీ వంటివి ఒకే దానిలో అందిస్తోంది. స్మార్ట్​ హోమ్​ కోసం ఐఓటీ సేవలను ఎయిర్​టెల్​ ఎక్స్​ట్రీమ్​ ద్వారా తీసుకురానుంది.

5జీ నెట్​వర్క్​..

ప్రస్తుతం దేశంలో 4జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2020 అర్ధభాగంలో లేక 2021 ప్రారంభంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలో ప్రభుత్వం నిర్వహించే 5జీ స్పెక్ట్రం వేలానికి ప్రస్తుతం రిలయన్స్​ జియో సహా దాదాపు అన్ని సంస్థలు వ్యతిరేకంగా ఉన్నాయి. స్పెక్ట్రం కేటాయింపులు జరిగే వరకు, టెలికాం సంస్థలు దేశంలో 5జీ సేవలను ప్రారంభించలేవు.

స్మార్ట్​ సిటీస్​ ప్రాజెక్ట్​...

భారతీ ఎయిర్​టెల్​ ఇప్పటికే స్మార్ట్​ సిటీస్​ ప్రాజెక్ట్​పై పనిచేస్తోంది. హరియాణాలోని ఫరీదాబాద్​లో స్మార్ట్​ సిటీ సొల్యూషన్స్​ను ప్రారంభించింది. ఇందులో ట్రాఫిక్​ నియంత్రణ వ్యవస్థ, నగరవ్యాప్తంగా నిఘా, కాలుష్య తనిఖీ, ట్రాఫిక్​ అమలు వ్యవస్థ, వీధి దీపాలు, స్మార్ట్​ సిగ్నల్​ విధానాలు ఉన్నాయి. ఇందులోని కొన్నింటిని ఐఎంసీ-2019లో ప్రదర్శించనుంది ఎయిర్​టెల్​. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది.

కనెక్టెడ్​ వాహనాలు​..

నెట్​వర్క్​కు అనుసంధానమైన వాహనాలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది ఎయిర్​టెల్​. భారత్​లో మొట్టమొదటి ఇంటర్​నెట్​ కార్​-ఎంజీ హెక్టార్​ను తీసుకొచ్చింది. భవిష్యత్తు తరం ద్విచక్రవాహనాలు, కార్లను శక్తిమంతం చేయడానికి ఇతర ఆటోమోటివ్​ ఓఈఎంలతో పనిచేస్తోంది.

ఇదీ చూడండి: ట్రాఫిక్​ చలానా రాశారని రోడ్డుపై ఆత్మహత్య!


Srinagar (JandK), Oct 12 (ANI): India Army continued recruitment drives in Kashmir valley for the youths of Kashmir. Army held recruitment rally in Srinagar for youth of South Kashmir on October 12 (Saturday). Where large number of youths participated in the drive. "In next three days army will cover all the districts of south Kashmir as well as districts of north Kashmir through recruitment drive," Said Commanding officer 162 Territorial Army, R.R. Singh.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.