ETV Bharat / business

అదానీ చేతికి ముంబయి అంతర్జాతీయ ఎయిర్​పోర్ట్

author img

By

Published : Jul 13, 2021, 10:24 PM IST

ముంబయి ఎయిర్​పోర్ట్ నిర్వహణ బాధ్యతలు అదానీ గ్రూప్ చేతికి వచ్చాయి. ఈ విషయాన్ని అదానీ గ్రూప్ వెల్లడించింది. ముంబయి గర్వించేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతామని సంస్థ అధినేత గౌతమ్ అదానీ పేర్కొన్నారు.

MUMBAI AIRPORT ADANI
అదానీ ముంబయి ఎయిర్​పోర్ట్

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను జీవీకే గ్రూప్ నుంచి బదిలీ చేసుకున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ ఎయిర్​పోర్టులో జీవీకే గ్రూప్​కు ఉన్న 50.5శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు గతేడాది ఆగస్టులోనే అదానీ వెల్లడించింది. దీంతో పాటు మైనారిటీ భాగస్వాముల నుంచి 23.5 శాతం వాటాను దక్కించుకోనున్నట్లు తెలిపింది. మంగళవారం నిర్వహించిన బోర్డు మీటింగ్​లో నిర్వహణ బాధ్యతలను స్వీకరించినట్లు అదానీ ఎయిర్​పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ వెల్లడించింది. అంతకుముందు, సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయంపై ట్వీట్ చేశారు.

"ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను తీసుకోవడం సంతోషకరం. భవిష్యత్ ఎయిర్​పోర్ట్ ఎకోసిస్టమ్​ను రూపొందించేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తుంది. స్థానికంగా వేలాది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాం. ముంబయి గర్వించేలా చేస్తామని హామీ ఇస్తున్నా."

-గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్

ముంబయి ఎయిర్​పోర్ట్ పూర్తిగా అదానీ చేతికి వచ్చేందుకు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర సిటీ, ఇండస్ట్రీయల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్(సిడ్కో) నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.

అదానీ హవా

దిల్లీ తర్వాత అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయం ముంబయిదే. ప్యాసింజర్లతో పాటు కార్గో ట్రాఫిక్ ఇక్కడ అధికంగా ఉంటుంది. కాగా, మొత్తం ఎనిమిది ఎయిర్​పోర్టులను తన అధీనం(నిర్వహణ, అభివృద్ధి కోసం)లో ఉంచుకొని దేశంలో అతిపెద్ద ఎయిర్​పోర్ట్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా కొనసాగుతోంది అదానీ గ్రూప్​. మొత్తం 25 శాతం రవాణా ఈ ఎయిర్​పోర్టుల గుండా జరుగుతోంది. ముంబయి విమానాశ్రయంతో కలిపితే.. 33 శాతం కార్గో ట్రాఫిక్ అదానీ గ్రూప్​లోని ఎయిర్​పోర్టుల ద్వారానే జరుగుతుంది.

ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ఓయో సీఈఓ- కారణం?

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను జీవీకే గ్రూప్ నుంచి బదిలీ చేసుకున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ ఎయిర్​పోర్టులో జీవీకే గ్రూప్​కు ఉన్న 50.5శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు గతేడాది ఆగస్టులోనే అదానీ వెల్లడించింది. దీంతో పాటు మైనారిటీ భాగస్వాముల నుంచి 23.5 శాతం వాటాను దక్కించుకోనున్నట్లు తెలిపింది. మంగళవారం నిర్వహించిన బోర్డు మీటింగ్​లో నిర్వహణ బాధ్యతలను స్వీకరించినట్లు అదానీ ఎయిర్​పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ వెల్లడించింది. అంతకుముందు, సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయంపై ట్వీట్ చేశారు.

"ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను తీసుకోవడం సంతోషకరం. భవిష్యత్ ఎయిర్​పోర్ట్ ఎకోసిస్టమ్​ను రూపొందించేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తుంది. స్థానికంగా వేలాది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాం. ముంబయి గర్వించేలా చేస్తామని హామీ ఇస్తున్నా."

-గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్

ముంబయి ఎయిర్​పోర్ట్ పూర్తిగా అదానీ చేతికి వచ్చేందుకు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర సిటీ, ఇండస్ట్రీయల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్(సిడ్కో) నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.

అదానీ హవా

దిల్లీ తర్వాత అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయం ముంబయిదే. ప్యాసింజర్లతో పాటు కార్గో ట్రాఫిక్ ఇక్కడ అధికంగా ఉంటుంది. కాగా, మొత్తం ఎనిమిది ఎయిర్​పోర్టులను తన అధీనం(నిర్వహణ, అభివృద్ధి కోసం)లో ఉంచుకొని దేశంలో అతిపెద్ద ఎయిర్​పోర్ట్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా కొనసాగుతోంది అదానీ గ్రూప్​. మొత్తం 25 శాతం రవాణా ఈ ఎయిర్​పోర్టుల గుండా జరుగుతోంది. ముంబయి విమానాశ్రయంతో కలిపితే.. 33 శాతం కార్గో ట్రాఫిక్ అదానీ గ్రూప్​లోని ఎయిర్​పోర్టుల ద్వారానే జరుగుతుంది.

ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ఓయో సీఈఓ- కారణం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.