ETV Bharat / business

నీరవ్​కు బెయిల్​ నిరాకరణ- మరో నెల రిమాండ్

author img

By

Published : Apr 26, 2019, 3:52 PM IST

ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్​ పిటిషన్​ను లండన్​ కోర్టు మరోమారు తిరస్కరించింది. వచ్చే నెల 24 వరకు రిమాండ్​ పొడిగించింది. తదుపరి విచారణను మే 30న జరపనుంది.

నీరవ్​ మోదీ

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు (పీఎన్​బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్​ కోర్టులో మూడో సారి చుక్కెదురైంది.

ఆయన బెయిల్ అభ్యర్థనను తోసిపోచ్చుతూ వెస్ట్​మినిస్టర్​ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. నీరవ్​కు వచ్చేనెల 24 వరకు రిమాండ్ పొడిగించింది. పూర్తి విచారణను మే 30 జరపనున్నట్లు తెలిపింది.

దాదాపు రూ. 13,000 కోట్ల కుంభకోణం కేసులో నీరవ్​ ప్రధాన నిందితుడు. మోసం వెలుగులోకి వచ్చేసరికి ఆయన లండన్​ పరారయ్యారు.

నీరవ్​ మోదీని అప్పగించాలని భారత్​​ చేసిన విజ్ఞప్తి మేరకు లండన్​ కోర్టు ఆయనపై ఆరెస్టు వారెంటు జారీ చేసింది.

మార్చి 19న స్కాట్​లాండ్ యార్డ్​​ అధికారులు నీరవ్​ను అదుపులోకి తీసుకున్నారు. నీరవ్​ను స్వదేశానికి రప్పించేందుకు భారత్​ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది.

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు (పీఎన్​బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్​ కోర్టులో మూడో సారి చుక్కెదురైంది.

ఆయన బెయిల్ అభ్యర్థనను తోసిపోచ్చుతూ వెస్ట్​మినిస్టర్​ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. నీరవ్​కు వచ్చేనెల 24 వరకు రిమాండ్ పొడిగించింది. పూర్తి విచారణను మే 30 జరపనున్నట్లు తెలిపింది.

దాదాపు రూ. 13,000 కోట్ల కుంభకోణం కేసులో నీరవ్​ ప్రధాన నిందితుడు. మోసం వెలుగులోకి వచ్చేసరికి ఆయన లండన్​ పరారయ్యారు.

నీరవ్​ మోదీని అప్పగించాలని భారత్​​ చేసిన విజ్ఞప్తి మేరకు లండన్​ కోర్టు ఆయనపై ఆరెస్టు వారెంటు జారీ చేసింది.

మార్చి 19న స్కాట్​లాండ్ యార్డ్​​ అధికారులు నీరవ్​ను అదుపులోకి తీసుకున్నారు. నీరవ్​ను స్వదేశానికి రప్పించేందుకు భారత్​ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది.


Varanasi (UP), Apr 26 (ANI): After filing nomination from Uttar Pradesh's Varanasi parliamentary constituency, Prime Minister Narendra Modi said, "I deeply express gratitude towards people of Kashi. They have again blessed me after 5 years. Such a grand roadshow yesterday was possible only in Kashi. Some people are making an environment that Modi have already won and its ok not to vote. Please do not get influenced by such people. Voting is your right, democracy is a festival, must vote to strengthen the country".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.