భారత్లో కరోనా మహమ్మారి కారణంగా గతేడాది టెలివిజన్ వ్యూయర్షిప్(వీక్షణలు) భారీగా పెరిగిందని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) తెలిపింది. వారంలో టెలివిజన్ చూసే సమయం 9 శాతం పెరిగి 999 బిలియన్ల నిమిషాలకు చేరిందని వెల్లడించింది.
2019లో ఒకరోజులో ప్రతి వ్యక్తి సగటు వీక్షణ సమయం 3 గంటల 42 నిమిషాలు ఉండగా.. 2020లో అది 4 గంటల 2 నిమిషాలకు పెరిగిందని బార్క్ తెలిపింది. లాక్డౌన్తో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల టీవీ వీక్షణ సమయం గణనీయంగా పెరిగిందని చెప్పింది.
ఏవేవి? ఎంతెంత?
- సాధారణ వినోద ఛానెళ్లను చూసే నిమిషాలు 9 శాతం పెరిగాయి. సినిమాలు- 10 శాతం, పిల్లల ఛానెళ్లు- 27 శాతం పెరిగాయి.
- మ్యూజిక్ ఛానెళ్లు చూసే నిమిషాలు(- 11 శాతం), క్రీడ ఛానెళ్లు(-35 శాతం) తగ్గాయి.
మార్చిలో టీవీ వీక్షణలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని బార్క్ సీఈఓ సునీల్ లుల్లా చెప్పారు. రామాయణం, మహాభారతం వంటి పౌరాణిక క్లాసిక్లకు అధిక వీక్షణలు దక్కాయని చెప్పారు. ప్రపంచంలో అత్యధికంగా వీక్షణలు పొందిన టీవీ ప్రోగ్రామ్గా 'రామాయణం' రికార్డు సాధించిందని తెలిపారు.
జనతా కర్ఫ్యూ కారణంగా జనవరి- మార్చితో పోల్చితే.. మార్చి నుంచి జూన్ మధ్య టీవీ చూసే సమయం 23 శాతం పెరిగిందని బార్క్ చెప్పింది. 2020లోని 12వ వారంలో టీవీ వార్తల వీక్షణలు 206 బిలియన్ల నిమిషాలుగా నమోదైందని తెలిపింది.
ఇదీ చదవండి:స్పెక్ట్రమ్ వేలంలో తొలిరోజు రూ. 17,146 కోట్ల బిడ్లు