ఇంటి నుంచి పనిచేసే వారికి అనుకూలంగా ఉండేలా సరికొత్త ల్యాప్టాప్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది షియోమీ సంస్థ. రెండు మోడళ్లలో ఒక దానిలో మూడు, మరో దానిలో రెండు వేరియంట్లు ఉన్నాయి. జూన్ 17 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభమవుతాయి. జులై 16 వరకు ధరలు ఇలా ఉండనున్నాయి.
ఎంఐ నోట్బుక్ 14..
ఇది మూడు వేరియంట్లలో విడుదలైంది.
8 జీబీ ర్యామ్ (డీడీఆర్4) + 246 జీబీ సాటా ఎస్ఎస్డీ - రూ. 41,999
8 జీబీ ర్యామ్ (డీడీఆర్4)+ 512 జీబీ సాటా ఎస్ఎస్డీ - రూ. 44,999
8 జీబీ ర్యామ్ (డీడీఆర్4)+ 512 జీబీ సాటా ఎస్ఎస్డీ + నివిడా జీ ఫోర్స్ ఎమ్ఎక్స్ 250 (గ్రాఫిక్ కార్డ్)- రూ. 47,999
ఎంఐ నోట్బుక్ 14 హారిజన్ ఎడిషన్..
ఇది రెండు వేరియంట్లలో విడుదలైంది.
8 జీబీ ర్యామ్ (డీడీఆర్4)+ 512 జీబీ సాటా ఎస్ఎస్డీ, ఇంటెల్ ఐ5 (10వ జనరేషన్) ప్రాసెసర్ - రూ. 54,999
8 జీబీ ర్యామ్ (డీడీఆర్4)+ 512 జీబీ సాటా ఎస్ఎస్డీ, ఇంటెల్ ఐ7 (10వ జనరేషన్) ప్రాసెసర్ - రూ. 59,999
ఈ నోట్బుక్ బరువు 1.35 కిలోగ్రాములు. 13.3 అంగులాల డిస్ప్లే ఉంది. ఒకసారి బ్యాటరీని పూర్తి ఛార్జింగ్ చేస్తే 10 గంటలపాటు వాడుకోవచ్చు.