ETV Bharat / business

పద్దు 2020: 'ఇకపై ప్రతి జిల్లా ఒక ఎక్స్​పోర్ట్​ హబ్'​

author img

By

Published : Feb 1, 2020, 12:42 PM IST

Updated : Feb 28, 2020, 6:37 PM IST

అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక మండళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ప్రతి జిల్లాను ఒక 'ఎక్స్​పోర్ట్​ హబ్​'గా రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Budget 2020
Budget 2020అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక మండళ్లు ఏర్పాటు

కేంద్ర బడ్జెట్​ 2020-21లో అంతర్జాతీయ వాణిజ్య, ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక మండళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్​. ప్రతి జిల్లాను ఒక ఎక్స్​పోర్ట్​ హబ్​గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

పద్దు 2020: 'ఇకపై ప్రతి జిల్లా ఒక ఎక్స్​పోర్ట్​ హబ్'​

"ప్రతి జిల్లా ఒక ఎక్స్​పోర్ట్​ హబ్​గా అభివృద్ధి చెందాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన. ప్రతి జిల్లా ఎగుమతుల హబ్​గా మారేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సంస్థాగత చర్యలు చేపట్టాలి. వస్తువుల కొనుగోలు, వివిధ రకాల సేవలకు దేశంలో ఒక ఏకీకృత కొనుగోలు వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా.. ప్రభుత్వ ఈ-మార్కెట్​, జెమ్​లలో మార్పులు చేయనున్నాం."

- నిర్మలా సీతారామన్​, ఆర్థిక మంత్రి.

రాష్ట్రాల స్థాయిలో విద్యుత్​ బిల్లులు, రవాణా వ్యయాలు, వ్యాట్​, ఇతర పన్నులకు సంబంధించి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు నిర్మలా. దేశీయ మొబైల్​ తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రూ. 1.3 లక్షల కోట్లతో మౌలిక రంగ ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జౌళి రంగానికి రూ. 1480 కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు.

త్వరలోనే జాతీయ సరకు రవాణా విధానం రూపొందించనున్నట్లు ప్రకటించారు నిర్మలా. 2 వేల కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారులు, ఓడరేవులకు అనుసంధానం చేసే రహదారుల అభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహానికి రూ. 27,300 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర బడ్జెట్​ 2020-21లో అంతర్జాతీయ వాణిజ్య, ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక మండళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్​. ప్రతి జిల్లాను ఒక ఎక్స్​పోర్ట్​ హబ్​గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

పద్దు 2020: 'ఇకపై ప్రతి జిల్లా ఒక ఎక్స్​పోర్ట్​ హబ్'​

"ప్రతి జిల్లా ఒక ఎక్స్​పోర్ట్​ హబ్​గా అభివృద్ధి చెందాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన. ప్రతి జిల్లా ఎగుమతుల హబ్​గా మారేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సంస్థాగత చర్యలు చేపట్టాలి. వస్తువుల కొనుగోలు, వివిధ రకాల సేవలకు దేశంలో ఒక ఏకీకృత కొనుగోలు వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా.. ప్రభుత్వ ఈ-మార్కెట్​, జెమ్​లలో మార్పులు చేయనున్నాం."

- నిర్మలా సీతారామన్​, ఆర్థిక మంత్రి.

రాష్ట్రాల స్థాయిలో విద్యుత్​ బిల్లులు, రవాణా వ్యయాలు, వ్యాట్​, ఇతర పన్నులకు సంబంధించి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు నిర్మలా. దేశీయ మొబైల్​ తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రూ. 1.3 లక్షల కోట్లతో మౌలిక రంగ ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జౌళి రంగానికి రూ. 1480 కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు.

త్వరలోనే జాతీయ సరకు రవాణా విధానం రూపొందించనున్నట్లు ప్రకటించారు నిర్మలా. 2 వేల కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారులు, ఓడరేవులకు అనుసంధానం చేసే రహదారుల అభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహానికి రూ. 27,300 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Last Updated : Feb 28, 2020, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.