ETV Bharat / business

కరోనాతో స్మార్ట్​ఫోన్ల విక్రయాలు 48 శాతం డౌన్!

కరోనా కారణంగా స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. లాక్​డౌన్​తో ఈ ఏడాది ఏప్రిల్-నుంచి జూన్ మధ్య స్మార్ట్​ఫోన్ల విక్రయాలు 2019 ఇదే సమయంతో పోలిస్తే 48 శాతం పడిపోయాయి. శాంసంగ్ అమ్మకాలు అత్యధికంగా 60 శాతం పడిపోయాయి.

smartphone sales report
స్మార్ట్​ఫోన్ల విక్రయాలు
author img

By

Published : Jul 18, 2020, 2:59 PM IST

Updated : Jul 18, 2020, 4:16 PM IST

కరోనాతో స్మార్ట్​ఫోన్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. కెనాలిస్​ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 ఏప్రిల్-జూన్​ మధ్య 2019 ఇదే సమయంతో పోలిస్తే స్మార్ట్​ఫోన్ల విక్రయాలు 48 శాతం తగ్గినట్లు తెలిసింది. 2020 ఏప్రిల్-జూన్​ మధ్య 1.73 కోట్ల స్మార్ట్​ఫోన్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 3.3 కోట్లుగా ఉండటం గమనార్హం.

ఏ కంపెనీపై ఎంత ప్రభావం

  • కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​తో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ అత్యధికంగా ప్రభావితమైంది. లగ్జరీ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థపై లాక్​డౌన్​ ప్రభావం పరిమితంగానే ఉన్నట్లు కెనాలిస్ నివేదిక వెల్లడించింది.
  • స్మార్ట్​ఫోన్ల విపణిలో అగ్రస్థానంలో ఉన్న షియోమీ విక్రయాలు 2020 ఏప్రిల్-జూన్​ మధ్య 48 శాతం తగ్గాయి. దీనితో మార్కెట్​లో సంస్థ వాటా 31.3 శాతం నుంచి 30.9 శాతానికి పడిపోయాయి.
  • వివో మొబైల్ ఫోన్ల విక్రయాలు 36 శాతం తగ్గాయి. 2019 ఏప్రిల్-జూన్​తో పోలిస్తే 2020 ఇదే సమయానికి వివో మార్కెట్ వాటా 17.5 శాతం నుంచి 21.3 శాతానికి పెరిగింది.
  • శాంసంగ్ స్మార్ట్​ఫోన్ల విక్రయాలు అత్యధికంగా 60 శాతం తగ్గాయి. స్మార్ట్​ఫోన్ మార్కెట్​లో సంస్థ వాటా 22.1 శాతం నుంచి 16.8 శాతానికి పడిపోయింది.
  • ఒప్పో, రియల్​మీ స్మార్ట్​ఫోన్ సంస్థల విక్రయాలు 2020 క్యూ2లో వరుసగా 27 శాతం, 35 శాతం పడిపోయాయి. దీనితో మార్కెట్ వాటా పరంగా రియల్​మీని వెనక్కినెట్టి ఒప్పో నాలుగో స్థానానికి ఎగబాకింది.
  • యాపిల్ ఫోన్ల షిప్​మెంట్​లు 20 శాతం తగ్గాయి. లాక్​డౌన్​లో టాప్​ 10 స్మార్ట్​ఫోన్ల కంపెనీల్లో అత్యల్పంగా ప్రభావితమైన సంస్థ ఇదే కావడం గమనార్హం.

ఇదీ చూడండి:కరోనా వేళ భారత్​లోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ

కరోనాతో స్మార్ట్​ఫోన్ల విక్రయాలు భారీగా పడిపోయాయి. కెనాలిస్​ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 ఏప్రిల్-జూన్​ మధ్య 2019 ఇదే సమయంతో పోలిస్తే స్మార్ట్​ఫోన్ల విక్రయాలు 48 శాతం తగ్గినట్లు తెలిసింది. 2020 ఏప్రిల్-జూన్​ మధ్య 1.73 కోట్ల స్మార్ట్​ఫోన్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 3.3 కోట్లుగా ఉండటం గమనార్హం.

ఏ కంపెనీపై ఎంత ప్రభావం

  • కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​తో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ అత్యధికంగా ప్రభావితమైంది. లగ్జరీ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థపై లాక్​డౌన్​ ప్రభావం పరిమితంగానే ఉన్నట్లు కెనాలిస్ నివేదిక వెల్లడించింది.
  • స్మార్ట్​ఫోన్ల విపణిలో అగ్రస్థానంలో ఉన్న షియోమీ విక్రయాలు 2020 ఏప్రిల్-జూన్​ మధ్య 48 శాతం తగ్గాయి. దీనితో మార్కెట్​లో సంస్థ వాటా 31.3 శాతం నుంచి 30.9 శాతానికి పడిపోయాయి.
  • వివో మొబైల్ ఫోన్ల విక్రయాలు 36 శాతం తగ్గాయి. 2019 ఏప్రిల్-జూన్​తో పోలిస్తే 2020 ఇదే సమయానికి వివో మార్కెట్ వాటా 17.5 శాతం నుంచి 21.3 శాతానికి పెరిగింది.
  • శాంసంగ్ స్మార్ట్​ఫోన్ల విక్రయాలు అత్యధికంగా 60 శాతం తగ్గాయి. స్మార్ట్​ఫోన్ మార్కెట్​లో సంస్థ వాటా 22.1 శాతం నుంచి 16.8 శాతానికి పడిపోయింది.
  • ఒప్పో, రియల్​మీ స్మార్ట్​ఫోన్ సంస్థల విక్రయాలు 2020 క్యూ2లో వరుసగా 27 శాతం, 35 శాతం పడిపోయాయి. దీనితో మార్కెట్ వాటా పరంగా రియల్​మీని వెనక్కినెట్టి ఒప్పో నాలుగో స్థానానికి ఎగబాకింది.
  • యాపిల్ ఫోన్ల షిప్​మెంట్​లు 20 శాతం తగ్గాయి. లాక్​డౌన్​లో టాప్​ 10 స్మార్ట్​ఫోన్ల కంపెనీల్లో అత్యల్పంగా ప్రభావితమైన సంస్థ ఇదే కావడం గమనార్హం.

ఇదీ చూడండి:కరోనా వేళ భారత్​లోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ

Last Updated : Jul 18, 2020, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.