ETV Bharat / business

రాజ్యసభ ముందుకు బీమా చట్ట సవరణ బిల్లు - బీమారంగంలో ఎఫ్‌డీఐ సవరణ బిల్లు

బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంచేందుకు వీలు కల్పించే బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్​.. రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎఫ్​డీఐలు 74 శాతానికి పెరగనున్నాయి.

Sitharaman introduces Bill in Rajya Sabha to allow 74 pc FDI in insurance sector
బీమా రంగంలో 74 శాతం ఎఫ్​డీఐలకు అనుమతి!
author img

By

Published : Mar 15, 2021, 7:53 PM IST

బీమా​ రంగంలో విదేశీ పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెంచేందుకు మార్గం సుగమం చేసే చట్ట సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ రాజ్యసభలో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఈ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి లభిస్తుంది.

బీమా చట్టం- 1938కి సవరణ చేస్తూ కేంద్ర కేబినెట్ ఈనెల 11నే ఆమోద ముద్ర వేసింది.

ఇప్పటివరకు బీమా రంగంలో గరిష్ఠంగా 49శాతం వరకు విదేశీ పెట్టుబడులకు ఆస్కారం ఉండేది. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్​లో ఎఫ్​డీఐల వాటాను పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. ఈ సవరణ బిల్లుతో బోర్డులో ఎక్కువ మంది డైరెక్టర్లు, యాజమాన్యంలో ఉండే కీలక వ్యక్తులు భారతీయులై ఉండాలని పేర్కొన్నారు. అంతేగాక బోర్డులో 50శాతం మంది డైరెక్టర్లు స్వతంత్రులై ఉండాలని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఆరోగ్య రంగం హర్షం- నిరాశలో పర్యటకం!

బీమా​ రంగంలో విదేశీ పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెంచేందుకు మార్గం సుగమం చేసే చట్ట సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ రాజ్యసభలో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఈ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి లభిస్తుంది.

బీమా చట్టం- 1938కి సవరణ చేస్తూ కేంద్ర కేబినెట్ ఈనెల 11నే ఆమోద ముద్ర వేసింది.

ఇప్పటివరకు బీమా రంగంలో గరిష్ఠంగా 49శాతం వరకు విదేశీ పెట్టుబడులకు ఆస్కారం ఉండేది. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్​లో ఎఫ్​డీఐల వాటాను పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. ఈ సవరణ బిల్లుతో బోర్డులో ఎక్కువ మంది డైరెక్టర్లు, యాజమాన్యంలో ఉండే కీలక వ్యక్తులు భారతీయులై ఉండాలని పేర్కొన్నారు. అంతేగాక బోర్డులో 50శాతం మంది డైరెక్టర్లు స్వతంత్రులై ఉండాలని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఆరోగ్య రంగం హర్షం- నిరాశలో పర్యటకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.