ETV Bharat / business

ద్రవ్యోల్బణం దెబ్బతో స్టాక్​ మార్కెట్లకు నష్టాలు

author img

By

Published : Jan 14, 2020, 10:12 AM IST

ద్రవ్యోల్బణం 5 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం, కూరగాయలు, ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది. ఫలితంగా ఇవాళ దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Sensex, Nifty off to choppy start amid weak macro data
ద్రవ్యోల్బణం దెబ్బతో స్టాక్​మార్కెట్లకు నష్టాలు

దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ద్రవ్యోల్బణం 5 ఏళ్ల గరిష్ఠానికి(7.35 శాతానికి) చేరుకున్న నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతినడమే ఇందుకు కారణం. కూరగాయలు, ఉల్లిపాయల ధరలు పెరగడం ఇందుకు తోడైంది.

ద్రవ్యోల్బణం వల్ల ఆర్​బీఐ తన కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశం తగ్గుతుందని, ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత ఇబ్బందికరంగా పరిణమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 58 పాయింట్లు కోల్పోయి 41 వేల 801 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 12 వేల 320 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

టాటా స్టీల్​, బీపీసీఎల్​, హెచ్​సీఎల్​ టెక్​, ఎమ్​ అండ్​ ఎమ్​, టీసీఎస్​, ఏషియన్ పెయింట్స్, వేదాంత, గెయిల్​, జేఎస్​డబ్ల్యూ రాణిస్తున్నాయి.

ఎస్​ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఓఎన్​జీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్​ నేలచూపులు చూస్తున్నాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిక్కీ, కోస్పీ లాభాల్లో ట్రేడవుతుండగా, హాంగ్​సెంగ్​, షాంగై కాంపోజిట్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ

రూపాయి విలువ 4 పైసలు పెరిగి, ఒక డాలరుకు రూ.70.82గా ఉంది.

ముడిచమురు ధర

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.17 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 64.31 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: సీఎండీ పదవీ విభజన గడువు రెండేళ్లు పొడిగింపు: సెబీ

దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ద్రవ్యోల్బణం 5 ఏళ్ల గరిష్ఠానికి(7.35 శాతానికి) చేరుకున్న నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతినడమే ఇందుకు కారణం. కూరగాయలు, ఉల్లిపాయల ధరలు పెరగడం ఇందుకు తోడైంది.

ద్రవ్యోల్బణం వల్ల ఆర్​బీఐ తన కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశం తగ్గుతుందని, ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత ఇబ్బందికరంగా పరిణమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 58 పాయింట్లు కోల్పోయి 41 వేల 801 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 12 వేల 320 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

టాటా స్టీల్​, బీపీసీఎల్​, హెచ్​సీఎల్​ టెక్​, ఎమ్​ అండ్​ ఎమ్​, టీసీఎస్​, ఏషియన్ పెయింట్స్, వేదాంత, గెయిల్​, జేఎస్​డబ్ల్యూ రాణిస్తున్నాయి.

ఎస్​ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఓఎన్​జీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్​ నేలచూపులు చూస్తున్నాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిక్కీ, కోస్పీ లాభాల్లో ట్రేడవుతుండగా, హాంగ్​సెంగ్​, షాంగై కాంపోజిట్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ

రూపాయి విలువ 4 పైసలు పెరిగి, ఒక డాలరుకు రూ.70.82గా ఉంది.

ముడిచమురు ధర

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.17 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 64.31 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: సీఎండీ పదవీ విభజన గడువు రెండేళ్లు పొడిగింపు: సెబీ

Intro:Body:



BBMP instals huge mirror to prevent urinating in the streets 



Bengaluru: BBMP is trying to get good marks in Central govt's Swachh Survekshan ranking. As a part of this, a huge mirror has been installed on the wall of the five most urinating streets in the city.



The Mirror has been installed to prevent urinating in the streets which destroys the beauty of the city. The mirror is laid out in the calculation that the people will stop passing urine here after getting ashamed of seeing themself on the mirror. 



At present mirrors have been installed near KR Market, Church Street, ESI Hospital, Indiranagar and Queen's Road near Shivajinagar. This mirror costs 50,000 Rs. 



Swachh Survekshan is a ranking exercise taken up by the Government of India to assess rural and urban areas for their levels of cleanliness and active implementation of Swachhata mission initiatives in a timely and innovative manner.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.