ETV Bharat / business

'యునిటెక్ లిమిటెడ్' నిర్వహణ బాధ్యతలు కేంద్రానికే

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ యునిటెట్​ లిమిటెడ్​ నిర్వహణ బాధ్యతలను తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. సంబంధిత పనులను పూర్తి చేయడం కోసం నూతన బోర్డుకు రెండు నెలల సమయం ఇచ్చింది.

author img

By

Published : Jan 20, 2020, 10:09 PM IST

Updated : Feb 17, 2020, 7:16 PM IST

SC accepts Centre's proposal to takeover management control of Unitech
'యునిటెక్ లిమిటెడ్' నిర్వహణ బాధ్యతలు కేంద్రానికే

సంక్షోభంలో చిక్కుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ యునిటెక్​ లిమిటెడ్​ కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సంస్థ నిర్వహణ బాధ్యతలు తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది.

నూతన విధివిధానాలు రూపొందించేందుకు యునిటెక్​ కొత్త బోర్డుకు జస్టిస్​ డి.వై. చంద్రచూడ్​​ నేతృత్వంలోని ధర్మసనం రెండు నెలల గడువునిచ్చింది. దీనిని పర్యవేక్షించేందుకు విశ్రాంత న్యాయమూర్తిని నియమించనున్నట్లు వెల్లడించింది.

సంస్థ యాజమాన్యంపై ఎటువంటి న్యాయపరమైన చర్యలు తీసుకోకుండా కొత్త బోర్డుకు రెండు నెలల తాత్కాలిక నిషేధం(మోరటోరియం) విధించింది ధర్మాసనం.

కేంద్రం అభ్యర్థన

సంస్థ నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని 2017లో తాము చేసిన ప్రతిపాదనను పునఃసమీక్షించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని శనివారం అభ్యర్థించింది కేంద్రం. నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి 12 వేల మంది కొనుగోలుదారులకు ఉపశమనం కల్పించేలా ఆదేశించాలని కోరింది. ప్రస్తుతం ఉన్న మేనేజ్​మెంట్​ స్థానంలో 10 మంది డైరెక్టర్లను ప్రభుత్వ నామినీలుగా నియమించాలని కోరింది.

అయితే సంస్థ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎలాంటి నిధులు కేటాయించబోమని కేంద్రం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: 'ప్రధాని.. బడా మిత్రులకు పేదల సొమ్ము బట్వాడా'

సంక్షోభంలో చిక్కుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ యునిటెక్​ లిమిటెడ్​ కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సంస్థ నిర్వహణ బాధ్యతలు తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది.

నూతన విధివిధానాలు రూపొందించేందుకు యునిటెక్​ కొత్త బోర్డుకు జస్టిస్​ డి.వై. చంద్రచూడ్​​ నేతృత్వంలోని ధర్మసనం రెండు నెలల గడువునిచ్చింది. దీనిని పర్యవేక్షించేందుకు విశ్రాంత న్యాయమూర్తిని నియమించనున్నట్లు వెల్లడించింది.

సంస్థ యాజమాన్యంపై ఎటువంటి న్యాయపరమైన చర్యలు తీసుకోకుండా కొత్త బోర్డుకు రెండు నెలల తాత్కాలిక నిషేధం(మోరటోరియం) విధించింది ధర్మాసనం.

కేంద్రం అభ్యర్థన

సంస్థ నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని 2017లో తాము చేసిన ప్రతిపాదనను పునఃసమీక్షించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని శనివారం అభ్యర్థించింది కేంద్రం. నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి 12 వేల మంది కొనుగోలుదారులకు ఉపశమనం కల్పించేలా ఆదేశించాలని కోరింది. ప్రస్తుతం ఉన్న మేనేజ్​మెంట్​ స్థానంలో 10 మంది డైరెక్టర్లను ప్రభుత్వ నామినీలుగా నియమించాలని కోరింది.

అయితే సంస్థ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎలాంటి నిధులు కేటాయించబోమని కేంద్రం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: 'ప్రధాని.. బడా మిత్రులకు పేదల సొమ్ము బట్వాడా'

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/ed-quizzes-karti-chidambaram-in-inx-media-case20200120211200/


Conclusion:
Last Updated : Feb 17, 2020, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.