ETV Bharat / business

నీరవ్​ మోదీ ఎలా మోసం చేశారో తెలుసా...?

author img

By

Published : Mar 21, 2019, 8:20 AM IST

ఆర్థిక నేరగాడు నీరవ్​ మోదీని ఎట్టకేలకు లండన్​ పోలీసులు అరెస్టు చేశారు. ఇది ప్రభుత్వ విజయమని భాజపా చెబుతుంటే... లండన్​ పారిపోనిచ్చింది మీరుకాదా అన్నది విపక్షాల ప్రశ్న. రాజకీయ దుమారానికి కారణమైన నీరవ్​ ఎవరు? ఎందుకు లండన్​ పారిపోయారు? ప్రభుత్వం అతడికి చెందిన భవంతిని ఎందుకు కూల్చివేసింది?

నీరవ్​ మోదీ

ప్రతి రోజులానే ఆ రోజు ట్రేడింగ్​ ప్రారంభమైంది. కొద్దిసేపటికే పంజాబ్​ నేషనల్​ బ్యాంకు షేర్లు కుప్పకూలిపోయాయి. కారణం ముంబయిలోని బ్రాడీ హౌస్​ బ్రాంచ్​లో భారీ కుంభకోణం బయటపడటమే. ఈ కుంభకోణం విలువ అక్షరాల రూ.12,700 కోట్లు. చేసింది... ప్రముఖ వజ్రాలు వ్యాపారి నీరవ్​ మోదీ.

మోసం ఎలా జరిగింది:

⦁ ముడి వజ్రాల కొనుగోలుకు రుణం కావాలని పంజాబ్​ నేషనల్​ బ్యాంకును ఆశ్రయించారు నీరవ్​ మోదీ. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న బ్యాంకులు విదేశాల్లో చెల్లింపులు జరిపేలా లెటర్​ ఆఫ్​ అండర్ టేకింగ్​ (ఎల్​ఓయూ), ఫారిన్​ లెటర్​ ఆఫ్​ క్రెడిట్​ జారీ చేశాయి.

⦁ బ్యాంకు ఉద్యోగులు ఇక్కడే అక్రమాలకు పాల్పడ్డారు. అడ్డదారిలో ఎల్ఓయూలు జారీ చేశారు. ​వీటిపై విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులకు ఎలాంటి అనుమానం రాలేదు. ఎల్​ఓయూలు ఆధారంగా ముడి సరకు కొనుగోలుకు నిధులు మంజూరు చేశాయి.

⦁ తరువాత పంజాబ్​ నేషనల్​ బ్యాంకు అధికారులు ఇంటర్​ మెసేజింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. విదేశాల్లోని భారతీయ బ్యాంకులు దీని గుర్తించకుండా పీఎన్​బీకి అడిగిన రుణాన్ని ఇచ్చాయి. ఈ సొమ్మును ముడి వజ్రాలు సరఫరా చేసిన వారి ఖాతాల్లోకి జమ చేశారు పంజాబ్​ నేషనల్​ బ్యాంకు అధికారులు. నీరవ్​ మోదీ వజ్రాలు పొందారు. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు పీఎన్​బీ అధికారులకు ముడుపులు ముట్టినట్లు సీబీఐ విచారణలో తేలింది.

⦁ ఈ తంతు జరిగి ఏడేళ్లయినా ఎవ్వరికీ అనుమానం రాలేదు. బదిలీలతో కొత్తగా ఆ స్థానంలోకి వచ్చిన అధికారులు ఈ మోసాలను గుర్తించి, పైఅధికారులకు సమాచారం చేరవేశారు. అలా... భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

⦁ మొదట రూ. 11,400 కోట్ల కుంభకోణం జరిగిందని భావించారు. తరువాత మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. మోసం విలువ రూ.12,700 కోట్లని తేలింది.

పీఎన్​బీకి కోలుకోలేని దెబ్బ:

కుంభకోణం బయటపడగానే స్టాక్​ మార్కెట్లో బ్యాంకు షేర్​ విలువ దారుణంగా పడిపోయింది. అప్పటివరకు రూ. 55,370 కోట్లగా ఉన్న పంజాబ్​ నేషనల్​ బ్యాంకు నిరర్థక ఆస్తుల విలువ రూ.86,620 కోట్లకు పెరిగింది.

ఇప్పుడిప్పుడే గాడిలోకి:

నీరవ్​ మోదీ కుంభకోణంతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన పంజాబ్​ నేషనల్​ బ్యాంకు తిరిగి కోలుకోవటం కష్టమేనని, దానిని ఏదో ఒక బ్యాంకులో వీలినం చేయాలని చాలా మంది ఆర్థిక నిపుణులు సూచించారు. ఆ బ్యాంకు ఉద్యోగుల నిబద్ధత, అధికారుల ప్రణాళికలతో పీఎన్​బీ తిరిగి గాడిలో పెడింది. 2019 ఫిబ్రవరి నాటికి పంజాబ్​ నేషనల్​ బ్యాంకు రూ.230 కోట్ల లాభం ప్రకటించింది. గత సంవత్సరం ఇదే సమయానికి బ్యాంకు భారీ నష్టాల్లో ఉండటం గమనార్హం.

ప్రతి రోజులానే ఆ రోజు ట్రేడింగ్​ ప్రారంభమైంది. కొద్దిసేపటికే పంజాబ్​ నేషనల్​ బ్యాంకు షేర్లు కుప్పకూలిపోయాయి. కారణం ముంబయిలోని బ్రాడీ హౌస్​ బ్రాంచ్​లో భారీ కుంభకోణం బయటపడటమే. ఈ కుంభకోణం విలువ అక్షరాల రూ.12,700 కోట్లు. చేసింది... ప్రముఖ వజ్రాలు వ్యాపారి నీరవ్​ మోదీ.

మోసం ఎలా జరిగింది:

⦁ ముడి వజ్రాల కొనుగోలుకు రుణం కావాలని పంజాబ్​ నేషనల్​ బ్యాంకును ఆశ్రయించారు నీరవ్​ మోదీ. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న బ్యాంకులు విదేశాల్లో చెల్లింపులు జరిపేలా లెటర్​ ఆఫ్​ అండర్ టేకింగ్​ (ఎల్​ఓయూ), ఫారిన్​ లెటర్​ ఆఫ్​ క్రెడిట్​ జారీ చేశాయి.

⦁ బ్యాంకు ఉద్యోగులు ఇక్కడే అక్రమాలకు పాల్పడ్డారు. అడ్డదారిలో ఎల్ఓయూలు జారీ చేశారు. ​వీటిపై విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులకు ఎలాంటి అనుమానం రాలేదు. ఎల్​ఓయూలు ఆధారంగా ముడి సరకు కొనుగోలుకు నిధులు మంజూరు చేశాయి.

⦁ తరువాత పంజాబ్​ నేషనల్​ బ్యాంకు అధికారులు ఇంటర్​ మెసేజింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. విదేశాల్లోని భారతీయ బ్యాంకులు దీని గుర్తించకుండా పీఎన్​బీకి అడిగిన రుణాన్ని ఇచ్చాయి. ఈ సొమ్మును ముడి వజ్రాలు సరఫరా చేసిన వారి ఖాతాల్లోకి జమ చేశారు పంజాబ్​ నేషనల్​ బ్యాంకు అధికారులు. నీరవ్​ మోదీ వజ్రాలు పొందారు. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు పీఎన్​బీ అధికారులకు ముడుపులు ముట్టినట్లు సీబీఐ విచారణలో తేలింది.

⦁ ఈ తంతు జరిగి ఏడేళ్లయినా ఎవ్వరికీ అనుమానం రాలేదు. బదిలీలతో కొత్తగా ఆ స్థానంలోకి వచ్చిన అధికారులు ఈ మోసాలను గుర్తించి, పైఅధికారులకు సమాచారం చేరవేశారు. అలా... భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

⦁ మొదట రూ. 11,400 కోట్ల కుంభకోణం జరిగిందని భావించారు. తరువాత మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. మోసం విలువ రూ.12,700 కోట్లని తేలింది.

పీఎన్​బీకి కోలుకోలేని దెబ్బ:

కుంభకోణం బయటపడగానే స్టాక్​ మార్కెట్లో బ్యాంకు షేర్​ విలువ దారుణంగా పడిపోయింది. అప్పటివరకు రూ. 55,370 కోట్లగా ఉన్న పంజాబ్​ నేషనల్​ బ్యాంకు నిరర్థక ఆస్తుల విలువ రూ.86,620 కోట్లకు పెరిగింది.

ఇప్పుడిప్పుడే గాడిలోకి:

నీరవ్​ మోదీ కుంభకోణంతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన పంజాబ్​ నేషనల్​ బ్యాంకు తిరిగి కోలుకోవటం కష్టమేనని, దానిని ఏదో ఒక బ్యాంకులో వీలినం చేయాలని చాలా మంది ఆర్థిక నిపుణులు సూచించారు. ఆ బ్యాంకు ఉద్యోగుల నిబద్ధత, అధికారుల ప్రణాళికలతో పీఎన్​బీ తిరిగి గాడిలో పెడింది. 2019 ఫిబ్రవరి నాటికి పంజాబ్​ నేషనల్​ బ్యాంకు రూ.230 కోట్ల లాభం ప్రకటించింది. గత సంవత్సరం ఇదే సమయానికి బ్యాంకు భారీ నష్టాల్లో ఉండటం గమనార్హం.

AP Video Delivery Log - 0100 GMT News
Thursday, 21 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0033: EU Poroshenko AP Clients Only 4201978
Ukraine leader orders new sanctions against Russia
AP-APTN-2324: US CA University Strike Sanders AP Clients Only 4201977
Sanders: War being waged against working people
AP-APTN-2314: Colombia Footballer Arrest AP Clients Only 4201932
Ex Colombia soccer star arrested for drug shipments
AP-APTN-2314: Brazil Rio Violence AP Clients Only 4201939
Two years since 13-year-old shot in Rio crossfire
AP-APTN-2314: Venezuela Coping With Crisis AP Clients Only 4201781
Venezuelans find ways to cope with crushing crisis
AP-APTN-2304: US NY Harvard Slave Portraits AP Clients Only 4201976
Harvard accused of profiting from slave photos
AP-APTN-2304: New Zealand Funerals AP Clients Only 4201975
Two more victims of Christchurch attack buried
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.