మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్కు అఖిల భారత చిట్ ఫండ్ అసోసియేషన్ అత్యుత్తమ వ్యాపారవేత్త అవార్డును ప్రదానం చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్ టైమ్ డైరక్టర్ ఎస్ గురుమూర్తి చేతుల మీదుగా శైలజా కిరణ్కు అవార్డును బహుకరించారు. గత 57 ఏడేళ్లుగా మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ నాణ్యమైన సేవలను దక్షిణాదిన అందిస్తున్న విశ్వసనీయమైన కంపెనీగా ప్రజల నమ్మకాలను చూరగొందని నిర్వహకులు ప్రశంసించారు. శైలజా కిరణ్ నేతృత్వంలో మార్గదర్శి సంస్థ 11వేల 500 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందని కొనియాడారు.
ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండువగా బతుకమ్మ వేడుకలు