కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధాన్ మంత్రి జన్ధన్ పథకం కింద బ్యాంక్ ఖాతాలు తీసుకున్న వారిలో సగానికి పైగా మహిళలే ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నాటికి మొత్తం 41.93 జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు ఉంటే.. అందులో 55 శాతం (23.21 కోట్ల ఖాతాలు) మహిళలవేనని పేర్కొంది.
చిన్న సంస్థలకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) లబ్ధిదారుల్లోనూ అత్యధికంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 19.04 కోట్ల ఖాతాలకు (68 శాతం మహిళలకు) ఈ ఏడాది ఫిబ్రవరి 26 నాటికి రూ.6.36 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వివరించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాల్లో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలిపేందుకు ఆర్థిక శాఖ ఈ వివరాలు వెల్లడించింది.
ఇదీ చదవండి:కుటుంబ ఆర్థిక భద్రతకు మహిళా భరోసా