ETV Bharat / business

జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులు..?

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనకు తాను మద్దతు తెలుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ తెలిపారు. అయితే జీఎస్‌టీ కౌన్సిల్‌ మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ(మహిళా విభాగం) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

author img

By

Published : Feb 28, 2021, 8:29 PM IST

Updated : Feb 28, 2021, 8:41 PM IST

kv-subramanian-on-petroleum-under-gst
జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులు..?

దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందనే వాదన ఉంది. తాజాగా దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనకు తాను మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. అయితే జీఎస్‌టీ కౌన్సిల్‌ మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

'పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ)పరిధిలోకి తీసుకురావడం మంచి ప్రతిపాదనే. అయితే, దీనిపై నిర్ణయాధికారం మాత్రం జీఎస్‌టీ కౌన్సిల్‌దే' అని ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ(మహిళా విభాగం) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ ఈ విధంగా మాట్లాడారు. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా అధికంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని ఈ మధ్యే పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇక, గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో లీటరు పెట్రోల్‌ వంద రూపాయలకు చేరువ కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లోనూ లీటరుకు రూ.90 నుంచి రూ.100కు చేరాయి. దీంతో ఇవి సామాన్యులపై పెనుభారంగా మారుతున్నాయి. ఈ విషయంపై ప్రజలు, విపక్షాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ ఇది రాజకీయాంశంగానూ మారింది. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ కౌన్సిల్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఆసక్తిగా మారింది.

ఇదీ చదవండి : మళ్లీ పెరిగిన పెట్రోల్​, డీజిల్ ధరలు

దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందనే వాదన ఉంది. తాజాగా దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనకు తాను మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. అయితే జీఎస్‌టీ కౌన్సిల్‌ మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

'పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ)పరిధిలోకి తీసుకురావడం మంచి ప్రతిపాదనే. అయితే, దీనిపై నిర్ణయాధికారం మాత్రం జీఎస్‌టీ కౌన్సిల్‌దే' అని ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ(మహిళా విభాగం) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ ఈ విధంగా మాట్లాడారు. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా అధికంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని ఈ మధ్యే పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇక, గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో లీటరు పెట్రోల్‌ వంద రూపాయలకు చేరువ కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లోనూ లీటరుకు రూ.90 నుంచి రూ.100కు చేరాయి. దీంతో ఇవి సామాన్యులపై పెనుభారంగా మారుతున్నాయి. ఈ విషయంపై ప్రజలు, విపక్షాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ ఇది రాజకీయాంశంగానూ మారింది. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ కౌన్సిల్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఆసక్తిగా మారింది.

ఇదీ చదవండి : మళ్లీ పెరిగిన పెట్రోల్​, డీజిల్ ధరలు

Last Updated : Feb 28, 2021, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.