ETV Bharat / business

ఇకపై ఇన్​స్టాగ్రామ్​ లైక్స్​ దాచేయొచ్చు! - facebook instagram latest news

సామాజిక మాధ్యమాల్లో ఒక్క పోస్ట్​ చేసి.. ఆ పోస్ట్​ ఎంతమంది చూశారు, ఎంత మంది ఇష్టపడుతున్నారు, ఎంత మందికి నచ్చలేదు అని పదే పదే చూసుకుంటారు నెటిజన్లు. లైక్స్​ ఎక్కువ వస్తే ఫరవాలేదు, లైక్స్​ రానివాళ్లు మాత్రం తెగ ఆందోళన చెంది, నలుగురూ చూస్తే పరువు పోతుందనుకుంటూ కుంగిపోతారు. అందుకే.. లైక్​లు ​బయటివారికి కనిపించడం, కనిపించకపోవడం పూర్తిగా వ్యక్తిగతం చేయడానికి సన్నాహాలు చేస్తోంది 'ఇన్​స్టాగ్రాం'.

ఇకపై ఇన్​స్టాగ్రామ్​ లైక్స్​ దాచేయొచ్చు!
author img

By

Published : Nov 9, 2019, 3:25 PM IST

యాప్​లో చేసే పోస్టులకు వచ్చే "లైక్స్​" గోప్యంగా ఉంచేందుకు ప్రయోగాలు జరుపుతున్నట్లు ప్రకటించింది సామాజిక మాధ్యమాల దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్.

ఈ ఏడాది పలు దేశాల్లో యాప్ వినియోగదారుల లైక్​లు బహిరంగంగా కనిపించడం, కనిపించకపోడవం పూర్తిగా వ్యక్తిగతంగా మార్చేందుకు ఇన్​స్టా కృషి చేస్తోంది. వచ్చే వారం ఈ పరీక్షలను అగ్రరాజ్యానికీ విస్తరిస్తున్నామని ప్రకటించారు ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మొస్సేరి.

పోస్ట్​ చేసిన వారు మాత్రమే..

సెప్టెంబర్​లో ఫేస్​బుక్ అనుబంధ సంస్థ ఇన్​స్టాగ్రాం.. లైక్​లను గోప్యంగా ఉండేలా చేస్తున్నట్లు ప్రకటన చేసింది. వీక్షకుల సంఖ్యను, లైక్​ల సంఖ్యను పోస్ట్​ చేసిన ఖాతాదారు మాత్రమే చూసేలా.. మిగతా వీక్షకులకు కనిపించకుండా దాచే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది.

ట్విట్టర్​ ప్రయోగం

సాధారణంగా ఒక పోస్ట్​ను ఎంత మంది చూస్తున్నారు, ఎంత మంది ఇష్ట పడుతున్నారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు యువత. ఇదివరకు ట్విట్టర్ కూడా ఇలాంటి ప్రయోగమే చేసింది. అయితే లైక్స్​ కనిపించకోపోయేసరికి వినియోగదారుల సంఖ్య తగ్గినట్లు తేలింది. అందుకే తిరిగి లైక్​లు, రీట్వీట్​లూ కనిపించేలా చేసింది. మరిప్పుడు ఇన్​స్టా చేసే ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి.

ఇదీ చదవండి:117 ఏళ్ల తర్వాత అరేబియా సముద్రంలో ఇదే తొలిసారి

యాప్​లో చేసే పోస్టులకు వచ్చే "లైక్స్​" గోప్యంగా ఉంచేందుకు ప్రయోగాలు జరుపుతున్నట్లు ప్రకటించింది సామాజిక మాధ్యమాల దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్.

ఈ ఏడాది పలు దేశాల్లో యాప్ వినియోగదారుల లైక్​లు బహిరంగంగా కనిపించడం, కనిపించకపోడవం పూర్తిగా వ్యక్తిగతంగా మార్చేందుకు ఇన్​స్టా కృషి చేస్తోంది. వచ్చే వారం ఈ పరీక్షలను అగ్రరాజ్యానికీ విస్తరిస్తున్నామని ప్రకటించారు ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మొస్సేరి.

పోస్ట్​ చేసిన వారు మాత్రమే..

సెప్టెంబర్​లో ఫేస్​బుక్ అనుబంధ సంస్థ ఇన్​స్టాగ్రాం.. లైక్​లను గోప్యంగా ఉండేలా చేస్తున్నట్లు ప్రకటన చేసింది. వీక్షకుల సంఖ్యను, లైక్​ల సంఖ్యను పోస్ట్​ చేసిన ఖాతాదారు మాత్రమే చూసేలా.. మిగతా వీక్షకులకు కనిపించకుండా దాచే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది.

ట్విట్టర్​ ప్రయోగం

సాధారణంగా ఒక పోస్ట్​ను ఎంత మంది చూస్తున్నారు, ఎంత మంది ఇష్ట పడుతున్నారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు యువత. ఇదివరకు ట్విట్టర్ కూడా ఇలాంటి ప్రయోగమే చేసింది. అయితే లైక్స్​ కనిపించకోపోయేసరికి వినియోగదారుల సంఖ్య తగ్గినట్లు తేలింది. అందుకే తిరిగి లైక్​లు, రీట్వీట్​లూ కనిపించేలా చేసింది. మరిప్పుడు ఇన్​స్టా చేసే ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి.

ఇదీ చదవండి:117 ఏళ్ల తర్వాత అరేబియా సముద్రంలో ఇదే తొలిసారి

New Delhi, Nov 09 (ANI): After the Supreme Court ordered the central government to formulate scheme in three months to construct temple on the undisputed site in Ayodhya, lawyer of Hindu Mahasabha, Varun Kumar Sinha, said, "It is a historic judgement. With this judgement, the Supreme Court has given the message of unity in diversity."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.