ETV Bharat / business

పనివేళలకు మించి నగదు డిపాజిట్ చేయాలంటే ఛార్జీ

author img

By

Published : Nov 2, 2020, 6:49 AM IST

బ్యాంకు పనివేళలు మించిన తర్వాత డిపాజిట్ యంత్రం ద్వారా నగదు డిపాజిట్ చేసేందుకు రూ. 50 ఛార్జీ వసూలు చేస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఈ నెల 1 నుంచి నిబంధన అమలులోకి వచ్చినట్లు పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ ఆగస్టు నుంచే ఇలాంటి ఛార్జీ వసూలు చేస్తోంది.

ICICI Banks new cash deposit charge comes into force from today
పనివేళలకు మించి నగదు డిపాజిట్ చేయాలంటే ఛార్జీ

వినియోగదారులకు ఐసీఐసీఐ చేదు వార్త చెప్పింది. బ్యాంకు పనివేళలు మించిన తర్వాత, సెలవు దినాల్లో డిపాజిట్ యంత్రం ద్వారా నగదు డిపాజిట్ చేసేందుకు రూ. 50 ఛార్జీ వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

పనివేళల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, బ్యాంకు సెలవు దినాల్లో ఈ ఛార్జీ అమలవుతుంది. బ్యాంక్ పనివేళల్లో చెల్లించాల్సిన అవసరం ఉండదు. యాక్సిస్ బ్యాంక్ ఆగస్టు నుంచే ఇలాంటి రుసుము విధిస్తోంది.

వినియోగదారులకు ఐసీఐసీఐ చేదు వార్త చెప్పింది. బ్యాంకు పనివేళలు మించిన తర్వాత, సెలవు దినాల్లో డిపాజిట్ యంత్రం ద్వారా నగదు డిపాజిట్ చేసేందుకు రూ. 50 ఛార్జీ వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

పనివేళల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, బ్యాంకు సెలవు దినాల్లో ఈ ఛార్జీ అమలవుతుంది. బ్యాంక్ పనివేళల్లో చెల్లించాల్సిన అవసరం ఉండదు. యాక్సిస్ బ్యాంక్ ఆగస్టు నుంచే ఇలాంటి రుసుము విధిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.