ETV Bharat / business

టెలికాం సంస్థల పర్యవేక్షణకు మంత్రుల బృందం

author img

By

Published : Dec 28, 2019, 8:32 PM IST

బీఎస్​ఎన్​ఎల్, ఎమ్​టీఎన్​ఎల్​ల పునరుద్ధరణ ప్రణాళిక అమలును వేగవంతం చేసేందుకు ఏడుగురు సభ్యుల మంత్రుల బృందం ఏర్పాటైంది. 4 జీ స్పెక్ట్రం కేటాయింపు, అస్సెట్​ మోనిటైజేషన్, వ్యాపార సాధ్యత, శ్రామిక శక్తి, బాండ్ల జారీ లాంటి కీలక అంశాలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది.

GoM constituted to expedite implementation of Rs 69,000 cr revival plan of BSNL, MTNL
టెలికాం సంస్థల పర్యవేక్షణకు మంత్రుల బృందం

రూ.60,000 కోట్లతో చేపట్టిన బీఎస్​ఎన్​ఎల్​, ఎమ్​టీఎన్​ఎల్​ల పునరుద్ధరణ ప్రణాళికను వేగవంతం చేసేందుకు, పర్యవేక్షించేందుకు ఏడుగురు సభ్యుల మంత్రుల బృందం ఏర్పాటైంది.

"ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థల పునరుద్ధరణ ప్యాకేజీలో... 4 జీ స్పెక్ట్రం కేటాయింపు, అస్సెట్​ మోనిటైజేషన్, వ్యాపార సాధ్యత, శ్రామిక శక్తి, బాండ్ల జారీ లాంటి కీలక అంశాలు ఉన్నాయి. ఈ ప్రణాళిక అమలును మంత్రి బృందం వేగవంతం చేస్తుంది. అలాగే పర్యవేక్షణా చేస్తుంది."- అధికారిక వర్గాలు

జీఓఎమ్​

ఉన్నత స్థాయి బృందంలో రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్​, టెలికాం మంత్రి రవిశంకర్​ ప్రసాద్​, హోంమంత్రి అమిత్​షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​, వాణిజ్యమంత్రి పీయూష్​ గోయెల్​, చమురుమంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ సభ్యులుగా ఉన్నారు.

పునరుద్ధరణ ప్యాకేజీ

ఈ ఏడాది అక్టోబర్​లో బీఎస్​ఎన్​ఎల్​, ఎమ్​టీఎన్​ఎల్​ల కోసం రూ.60,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం నష్టాల్లో మునిగిపోయిన ఈ రెండు సంస్థల విలీనం, ఆస్తులను మొనిటైజింగ్, ఉద్యోగులకు 'స్వచ్ఛంద పదవీ విరమణ' (వీఆర్ఎస్​) సౌకర్యం కలిగించడం ద్వారా రెండేళ్లలో ఈ సంయుక్త సంస్థను లాభదాయకం మార్చాలని నిర్ణయించింది.

విలీనం అనివార్యం

ముంబయి, దిల్లీలకు 'మహానగర్ టెలిఫోన్​ నిగమ్​ లిమిటెడ్'​ టెలికాం సేవలందిస్తుంది. మిగతా దేశమంతటికీ 'భారత్​ సంచార్ నిగమ్​ లిమిటెడ్​' సేవలందిస్తుంది. ఎమ్​టీఎన్​ఎల్​ గత పదేళ్లుగా, బీఎస్​ఎన్​ఎల్​ 2010 నుంచి నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని.. కలిపే ప్రణాళికకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రమంత్రివర్గం ఆమోదించింది.

వీఆర్​ఎస్​ ప్రణాళిక అమలువల్ల ప్రస్తుతం 92,700 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణను ఎంచుకున్నారు. ఫలితంగా ఈ టెలికాం కంపెనీలకు జీతం బిల్లుల్లో ఏటా రూ.8,800 కోట్లు ఆదా అవుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ రెండు సంస్థలు వచ్చే మూడేళ్లలో రూ.37,500 కోట్ల విలువైన ఆస్తులు మోనటైజ్​ చేయనున్నాయి.

ఇదీ చూడండి: ఇకపై వాట్సాప్​ సందేశాలు మాయం చేయొచ్చు!

రూ.60,000 కోట్లతో చేపట్టిన బీఎస్​ఎన్​ఎల్​, ఎమ్​టీఎన్​ఎల్​ల పునరుద్ధరణ ప్రణాళికను వేగవంతం చేసేందుకు, పర్యవేక్షించేందుకు ఏడుగురు సభ్యుల మంత్రుల బృందం ఏర్పాటైంది.

"ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థల పునరుద్ధరణ ప్యాకేజీలో... 4 జీ స్పెక్ట్రం కేటాయింపు, అస్సెట్​ మోనిటైజేషన్, వ్యాపార సాధ్యత, శ్రామిక శక్తి, బాండ్ల జారీ లాంటి కీలక అంశాలు ఉన్నాయి. ఈ ప్రణాళిక అమలును మంత్రి బృందం వేగవంతం చేస్తుంది. అలాగే పర్యవేక్షణా చేస్తుంది."- అధికారిక వర్గాలు

జీఓఎమ్​

ఉన్నత స్థాయి బృందంలో రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్​, టెలికాం మంత్రి రవిశంకర్​ ప్రసాద్​, హోంమంత్రి అమిత్​షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​, వాణిజ్యమంత్రి పీయూష్​ గోయెల్​, చమురుమంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ సభ్యులుగా ఉన్నారు.

పునరుద్ధరణ ప్యాకేజీ

ఈ ఏడాది అక్టోబర్​లో బీఎస్​ఎన్​ఎల్​, ఎమ్​టీఎన్​ఎల్​ల కోసం రూ.60,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం నష్టాల్లో మునిగిపోయిన ఈ రెండు సంస్థల విలీనం, ఆస్తులను మొనిటైజింగ్, ఉద్యోగులకు 'స్వచ్ఛంద పదవీ విరమణ' (వీఆర్ఎస్​) సౌకర్యం కలిగించడం ద్వారా రెండేళ్లలో ఈ సంయుక్త సంస్థను లాభదాయకం మార్చాలని నిర్ణయించింది.

విలీనం అనివార్యం

ముంబయి, దిల్లీలకు 'మహానగర్ టెలిఫోన్​ నిగమ్​ లిమిటెడ్'​ టెలికాం సేవలందిస్తుంది. మిగతా దేశమంతటికీ 'భారత్​ సంచార్ నిగమ్​ లిమిటెడ్​' సేవలందిస్తుంది. ఎమ్​టీఎన్​ఎల్​ గత పదేళ్లుగా, బీఎస్​ఎన్​ఎల్​ 2010 నుంచి నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని.. కలిపే ప్రణాళికకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రమంత్రివర్గం ఆమోదించింది.

వీఆర్​ఎస్​ ప్రణాళిక అమలువల్ల ప్రస్తుతం 92,700 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణను ఎంచుకున్నారు. ఫలితంగా ఈ టెలికాం కంపెనీలకు జీతం బిల్లుల్లో ఏటా రూ.8,800 కోట్లు ఆదా అవుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ రెండు సంస్థలు వచ్చే మూడేళ్లలో రూ.37,500 కోట్ల విలువైన ఆస్తులు మోనటైజ్​ చేయనున్నాయి.

ఇదీ చూడండి: ఇకపై వాట్సాప్​ సందేశాలు మాయం చేయొచ్చు!

New Delhi, Dec 28 (ANI): The minimum temperature of Delhi was further dropped to record its chilliest day at 1.7 degrees Celsius on December 28. The minimum temperature was recorded at Lodhi road. Temperature has dipped to several degrees in the national capital. The cold waves have intensified while fog canopied parts of the city. Temperatures were 2.4 and 3.1 degrees at Safdurjung Enclave and Palam, respectively. Chilly weather is expected to continue in Delhi-NCR this week.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.