ETV Bharat / business

బంగారం, వెండి మరింత ప్రియం

author img

By

Published : May 3, 2021, 4:09 PM IST

పసిడి ధర మరింత ప్రియమైంది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర సోమవారం రూ.310 పెరిగింది. వెండి కిలోకు ఏకంగా రూ.67 వేల మార్క్ దాటింది.

Gold rate in India
నేటి బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు సోమవారం మరింత పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.310 పెరిగి.. రూ.46,580 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పసిడి ధరల్లో వృద్ధి, రూపాయి క్షీణత వల్ల దేశీయంగా బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా రూ.580 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.67,429 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,777 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 26.06 డాలర్లకు చేరింది.

ఇదీ చదవండి:త్వరలో దేశీయ వినియోగానికి 'ఫైజర్'​ టీకా?

బంగారం, వెండి ధరలు సోమవారం మరింత పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.310 పెరిగి.. రూ.46,580 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పసిడి ధరల్లో వృద్ధి, రూపాయి క్షీణత వల్ల దేశీయంగా బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా రూ.580 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.67,429 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,777 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 26.06 డాలర్లకు చేరింది.

ఇదీ చదవండి:త్వరలో దేశీయ వినియోగానికి 'ఫైజర్'​ టీకా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.