ETV Bharat / business

గోల్డ్ ఈటీఎఫ్​లలో పెట్టుబడులు 86 శాతం వృద్ధి

author img

By

Published : Aug 16, 2020, 12:53 PM IST

కరోనా భయాలు సహా ఇతర అంతర్జాతీయ కారణాలతో పసిడిపై మదుపరుల ఆసక్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. జులైలోనూ గోల్డ్ ఈటీఎఫ్​లకు రూ.921 కోట్ల పెట్టుబడులు రావడం ఇందుకు ఉదాహరణ. అంతకుముందు నెలతో పోలిస్తే ఇది 86 శాతం అధికం కావడం గమనార్హం.

Gold ETF inflows in july
బంగారంపై భారీగా పెరిగిన పెట్టుబడులు

గోల్డ్ ఈటీఎఫ్​లలో పెట్టుబడులు మళ్లీ భారీగా పెరిగాయి. జులైలో గోల్డ్ ఈటీఎఫ్​లకు మొత్తం రూ.921 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్​లో నమోదైన రూ.494 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే.. ఇవి 86 శాతం అధికం.

భారత మ్యూచువల్​ ఫండ్స్​ అసోసియేషన్​ (ఎఎంఎఫ్​ఐ) తాజా గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది గడిచిన 7 నెలల్లో గోల్డ్ ఈటీఎఫ్​లలో పెట్టుబడులు తొలిసారి మొత్తం రూ.4,452 కోట్లు దాటినట్లు తెలిపింది.

నెలవారీ ప్రాతిపదికన గోల్డ్ ఈటీఎఫ్​లకు జనవరిలో అత్యల్పంగా రూ.202 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో అత్యధికంగా రూ.1,483 కోట్లు రావడం గమనార్హం.

మార్చిలో కరోనా భయాలతో మదుపరులు లాభాల స్వీకరణకు(రూ.195 కోట్లు) దిగారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులే సురక్షితంగా భావించి ఏప్రిల్​లో రూ.731 కోట్లు, మేలో రూ.815 కోట్లు పెట్టుబడులు పెట్టారు.

కరోనా భయాలు, అమెరికా చైనా మధ్య నెలకొన్న అనిశ్చితులు, డాలర్​ విలువ తగ్గుతుండటం వంటి పరిణామాలు బంగారంపై పెట్టుబడి సానుకూలతను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఇటీవల పసిడి ధరలు కొత్త గరిష్ఠాలను తాకినట్లు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:ర్థిక స్వేచ్ఛ కోసం అడుగులు వేయండిలా!

గోల్డ్ ఈటీఎఫ్​లలో పెట్టుబడులు మళ్లీ భారీగా పెరిగాయి. జులైలో గోల్డ్ ఈటీఎఫ్​లకు మొత్తం రూ.921 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్​లో నమోదైన రూ.494 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే.. ఇవి 86 శాతం అధికం.

భారత మ్యూచువల్​ ఫండ్స్​ అసోసియేషన్​ (ఎఎంఎఫ్​ఐ) తాజా గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది గడిచిన 7 నెలల్లో గోల్డ్ ఈటీఎఫ్​లలో పెట్టుబడులు తొలిసారి మొత్తం రూ.4,452 కోట్లు దాటినట్లు తెలిపింది.

నెలవారీ ప్రాతిపదికన గోల్డ్ ఈటీఎఫ్​లకు జనవరిలో అత్యల్పంగా రూ.202 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో అత్యధికంగా రూ.1,483 కోట్లు రావడం గమనార్హం.

మార్చిలో కరోనా భయాలతో మదుపరులు లాభాల స్వీకరణకు(రూ.195 కోట్లు) దిగారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులే సురక్షితంగా భావించి ఏప్రిల్​లో రూ.731 కోట్లు, మేలో రూ.815 కోట్లు పెట్టుబడులు పెట్టారు.

కరోనా భయాలు, అమెరికా చైనా మధ్య నెలకొన్న అనిశ్చితులు, డాలర్​ విలువ తగ్గుతుండటం వంటి పరిణామాలు బంగారంపై పెట్టుబడి సానుకూలతను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఇటీవల పసిడి ధరలు కొత్త గరిష్ఠాలను తాకినట్లు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:ర్థిక స్వేచ్ఛ కోసం అడుగులు వేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.