ETV Bharat / business

విలీన బ్యాంకుల అధిపతులతో నేడు సీతారామన్ భేటీ

author img

By

Published : Mar 12, 2020, 6:00 AM IST

ఏప్రిల్ 1 నుంచి 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో నేడు ఆయా బ్యాంకుల అధిపతులతో ఆర్థక మంత్రి నిర్మలా సీతారామన్​ భేటీ కానున్నారు.

nirmala meeting with bankers
బ్యాంకర్లతో నిర్మలా సమావేశం

విలీన బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు సమావేశం కానున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి విలీనం కాబోతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నాయో సమీక్షించేందుకు ఆమె వారితో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

చర్చాంశాలు ఇవే!

యాంకర్‌ బ్యాంకులు ఖాతాదారులకు అంతరాయం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయో.. ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక రంగాలకు రుణ వితరణకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విలీనం తర్వాత బ్యాంకులు తమ ఖాతాదారులకు సేవలు, ఉత్పత్తుల్ని అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నాయనేది కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

వ్యాపార, ఆర్థిక ప్రణాళికలతో పాటు రుణ, డిపాజిట్ల వృద్ధి వంటి పలు అంశాలపై ఆర్థిక మంత్రి ఆయా బ్యాంకుల అధిపతుల్ని వివరాలు కోరనున్నట్లు తెలుస్తోంది.

విలీన బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు సమావేశం కానున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి విలీనం కాబోతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నాయో సమీక్షించేందుకు ఆమె వారితో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

చర్చాంశాలు ఇవే!

యాంకర్‌ బ్యాంకులు ఖాతాదారులకు అంతరాయం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయో.. ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక రంగాలకు రుణ వితరణకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విలీనం తర్వాత బ్యాంకులు తమ ఖాతాదారులకు సేవలు, ఉత్పత్తుల్ని అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నాయనేది కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

వ్యాపార, ఆర్థిక ప్రణాళికలతో పాటు రుణ, డిపాజిట్ల వృద్ధి వంటి పలు అంశాలపై ఆర్థిక మంత్రి ఆయా బ్యాంకుల అధిపతుల్ని వివరాలు కోరనున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.