ETV Bharat / business

ఆధార్ ఉంటే చాలు.. ఇక క్షణాల్లో ఈ- పాన్

author img

By

Published : May 28, 2020, 6:50 PM IST

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. ఆధార్​ వివరాల ఆధారంగా తక్షణం 'ఈ-పాన్'ను కేటాయించే విధానాన్ని ప్రారంభించారు. ఈ సేవ పూర్తిగా ఉచితం.​ పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేయడమే దీని ఉద్దేశం.

FM Sitharaman launches facility of instant PAN through Aadhaar based e-KYC
ఆధార్ ఉంటే చాలు... క్షణాల్లో ఈ-పాన్ సౌలభ్యం

ఆధార్ వివరాల ఆధారంగా ఆన్​లైన్​లో తక్షణమే 'ఈ-పాన్'​ను కేటాయించే విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ సేవ పూర్తిగా ఉచితమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.

2020-21 బడ్జెట్​లో... పాన్ కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఓ ప్రతిపాదన చేశారు. అందులో భాగంగా ప్రతిసారీ అన్ని వివరాలతో దరఖాస్తు ఫారం నింపాల్సిన అవసరం లేకుండా.. ఆధార్ వివరాల ఆధారంగా ఆన్​లైన్​లో అప్పటికప్పుడు పాన్​ సంఖ్యను కేటాయించే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

"చెల్లుబాటు అయ్యే ఆధార్ నంబర్​, ఆధార్​తో అనుసంధానం చేసిన ఫోన్​ నెంబర్​ ఉన్న పాన్ దరఖాస్తుదారులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రానిక్ పాన్​ (ఈ-పాన్​) పూర్తి ఉచితంగా లభిస్తుంది."

- కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)

డిజిటల్ ఇండియా

డిజిటల్ ఇండియాలో భాగంగా ఆదాయపు పన్ను శాఖను డిజిటలైజ్​ చేసేందుకు; పన్ను చెల్లింపుదారులకు అనువుగా టాక్స్ పేయింగ్​ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు... ఈ-పాన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సీబీడీటీ తెలిపింది.

2020 మే 25 నాటికి 50.52 కోట్ల పాన్ కార్డు​లను పన్ను చెల్లింపుదారులకు కేటాయించారు. వీటిలో సుమారు 49.39 కోట్ల పాన్​లు వ్యక్తులకు కేటాయించినవి. ఇప్పటి వరకు ఆధార్​తో అనుసంధానం అయిన పాన్​ల సంఖ్య 32.17 కోట్లు.

ఇదీ చూడండి: జెన్ జెడ్ స్పెషల్ శాంసంగ్​ 'గెలాక్సీ ఏ51' విడుదల

ఆధార్ వివరాల ఆధారంగా ఆన్​లైన్​లో తక్షణమే 'ఈ-పాన్'​ను కేటాయించే విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ సేవ పూర్తిగా ఉచితమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.

2020-21 బడ్జెట్​లో... పాన్ కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఓ ప్రతిపాదన చేశారు. అందులో భాగంగా ప్రతిసారీ అన్ని వివరాలతో దరఖాస్తు ఫారం నింపాల్సిన అవసరం లేకుండా.. ఆధార్ వివరాల ఆధారంగా ఆన్​లైన్​లో అప్పటికప్పుడు పాన్​ సంఖ్యను కేటాయించే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

"చెల్లుబాటు అయ్యే ఆధార్ నంబర్​, ఆధార్​తో అనుసంధానం చేసిన ఫోన్​ నెంబర్​ ఉన్న పాన్ దరఖాస్తుదారులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రానిక్ పాన్​ (ఈ-పాన్​) పూర్తి ఉచితంగా లభిస్తుంది."

- కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)

డిజిటల్ ఇండియా

డిజిటల్ ఇండియాలో భాగంగా ఆదాయపు పన్ను శాఖను డిజిటలైజ్​ చేసేందుకు; పన్ను చెల్లింపుదారులకు అనువుగా టాక్స్ పేయింగ్​ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు... ఈ-పాన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సీబీడీటీ తెలిపింది.

2020 మే 25 నాటికి 50.52 కోట్ల పాన్ కార్డు​లను పన్ను చెల్లింపుదారులకు కేటాయించారు. వీటిలో సుమారు 49.39 కోట్ల పాన్​లు వ్యక్తులకు కేటాయించినవి. ఇప్పటి వరకు ఆధార్​తో అనుసంధానం అయిన పాన్​ల సంఖ్య 32.17 కోట్లు.

ఇదీ చూడండి: జెన్ జెడ్ స్పెషల్ శాంసంగ్​ 'గెలాక్సీ ఏ51' విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.